భారత్‌, చైనా మధ్య కీలక ఒప్పందం

www.mannamweb.com


ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ వివరాలు తెలిపారు.

తూర్పు లద్దాఖ్ పరిస్థితుల విషయంలో భారత్, చైనా మధ్య భారీ పురోగతి కనపడింది. తూర్పు లద్దాఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (వాస్తవాధీన రేఖ) వెంట పెట్రోలింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి భారత్, చైనాలు ఒక ఒప్పందానికి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. 16వ బ్రిక్స్ సదస్సు కోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ కీలక ముందడుగు పడడం గమనార్హం. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తోనూ రష్యాలో మోదీ చర్చలు జరపనున్నారు.

ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ వివరాలు తెలిపారు. ఇరు దేశాల మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి పెట్రోలింగ్‌పై ఒప్పందం కుదిరిందని అన్నారు. ఎన్నో వారాలుగా చర్చలు జరుగుతున్నాయని, దీంతో ఈ ఒప్పందం జరిగిందని చెప్పారు. ఈ ఒప్పందం బలగాల ఉపసంహరణతో పాటు 2020లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడుతుందని తెలిపారు.

కాగా, ఈ నెల 22, 23న రష్యాలో జరగనున్న బ్రిక్స్‌ సదస్సులో జరగనుంది. గల్వాన్‌ లోయలో 2020లో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. అనంరం భారత్‌, చైనా అక్కడ భారీ స్థాయిలో బలగాలను మోహరించాయి.