ఆ మిక్సీలపై భారీ డిస్కౌంట్..ఫ్లిప్ కార్ట్ సేల్‌లో అద్భుత ఆఫర్

www.mannamweb.com


వంటింటికి అవసరమైన వివిధ ఎలక్ట్రానిక్ వస్తువులలో మిక్సర్ గ్రైండర్ ఒకటి. ఇది లేకపోతే వంటి పని పూర్తి కాదు. కూరలకు రుచిని తీసుకువచ్చే సుగంధాలను పొడి చేయాలన్నా, టిఫిన్ కోసం పూరీలు తయారు చేయడానికి పిండిని కలపాలన్నా, ఇంకా అనేక అవసరాలకు చాలా అవసరం.

ఇలా మిక్సర్ గ్రైండర్లు వంటింట్లో మహిళలకు ఎంతో ఉపయోగపడతాయి. దీపావళి పండగ త్వరలో రాబోతోంది. ఈ సందర్భంగా ఇంటిలోని మహిళలకు మిక్సర్ గ్రైండర్ బహుమతిగా ఇస్తే ఎంతో బాగుంటుంది. అయితే దాని ధర గురించి భయపడవద్దు. ఫ్లిప్ కార్ట్ సేల్ లో రూ.2 వేల కంటే తక్కువ ధరకే వివిధ కంపెనీల మిక్సర్ గ్రైండర్లు అందుబాటులో ఉన్నాయి.

సాన్సుయ్ ప్లస్

నలుపు, నీలం రంగులో లభిస్తున్న సాన్సుయ్ ప్లస్ 500 వాట్స్ జ్యూసర్ మిక్సర్ గ్రైండర్ ఎంతో ఆకట్టుకుంటోంది. దీనికి సుమారు 43 వేల మంది వినియోగదారులు 4.1 స్టార్ రేటింగ్ ఇచ్చారు. కంపెనీ నుంచి రెండేళ్ల వారంటీ లభిస్తుంది. మిక్సర్ గ్రౌండింగ్ కోసం మూడు జార్ లను అందిస్తారు. వాటితో మసాలా దినుసులను గ్రైండ్ చేసుకోవచ్చు. పండ్ల నుంచి జ్యూస్ లు కూడా తీసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 63 శాతం తగ్గింపుతో కేవలం రూ. 1,299కి అందుబాటులో ఉంది.

పీజియన్

స్టెయిన్ లెస్ స్టీల్ జాడీ, బ్లేడ్ లతో పీజియన్ 500 వాట్స్ మిక్సర్ గ్రైండర్ ఆకట్టుకుంటోంది. దీనికి ధృడమైన ఏబీఎస్ బాడీ ఉండడం అందనపు ప్రత్యేకత. దీనివల్ల తుప్పు పట్టకుండా, విద్యుత్ షాక్ కొట్టకుండా ఉంటుంది. దీనిలోని 500 వాట్స్ మోటారుతో 19 వేల ఆర్పీఎం వేగంతో మిక్సర్ పనిచేస్తుంది. ఎలాంటి మసాలా దినుసులనైనా చాలా సులభంగా రుబ్బుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ సేల్ లో దీనిపై 65 శాతం తగ్గింపు అందిస్తున్నారు. కేవలం రూ.1,699కి కొనుగోలు చేసుకోవచ్చు.

బజాజ్ జీఎక్స్ 1

మసాల దినుసులను పొడి చేసుకోవడానికి, పూరీ పిండి వంటిని కలుపుకోవటానికి బజాజ్ జీఎక్స్ 1 మిక్సర్ గ్రౌండర్ చాలా ఉపయోగంగా ఉంటుంది. దీనితోపాటు అందించే మూడు రకాల జాడీలతో వివిధ పదార్థాలను గ్రౌండ్ చేసుకోవచ్చు. ఉపయోగించుకోవడం కూడా చాలా సులభం. ఈ మిక్సర్ గ్రైండర్ వోల్టేజ్ పరిధిలో పనిచేస్తుంది. సమర్థవంతమైన పనితీరును అందిస్తుంది. ఫ్లిప్ కార్డులో రూ.1,899కు అందుబాటులో ఉంది.