ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. అధికారుల మార్పులు, ఓటర్ల జాబితా సవరణ, ఇతర అంశాలపై అధికారులతో పలు సమీక్షలు నిర్వహించింది.
రాజకీయపార్టీల అభిప్రాయాలను కూడా తెలుసుకుంది. మిగతా రాష్ట్రలతో పోలిస్తే ఏపీలో జమిలి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్ధితి ఉండటంతో ఈసీ కాస్త ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. ఇందులో భాగంగా ఈసారి రాష్ట్రంలో ఎన్నికలు జరిగేతేదీని సూత్రప్రాయంగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు (అసెంబ్లీ మరియు పార్లమెంట్) పోలింగ్ తేదీగా ఏప్రిల్ 16ను డేట్ ఆఫ్ రిఫరెన్స్ గా తీసుకోవాలని అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం నోట్ పంపింది. ఇందులో లోక్ సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు చేస్తున్న కసరత్తులో భాగంగా ఈ తేదీని రిఫరెన్స్ గా పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఈసీ సూచించింది. దీంతో ఇప్పుడు అధికారులు ఏప్రిల్ 16వ తేదీని టార్గెట్ గా పెట్టుకుని పనిచేయనున్నారు.
ఏప్రిల్ 16వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ప్రారంభించేందుకు ఈసీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలి విడతలోనే ఏపీలో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. అందుకే ఏప్రిల్ 16వ తేదీని హద్దుగా పెట్టుకుని పని చేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.
గతంలో ఏపీలో పర్యటించిన సందర్భంగా రాజకీయ పార్టీలు ఈసీని ఎన్నికల తేదీపై ఆరా తీశాయి. దీంతో ఎన్నికల సంసిద్ధత కోసం ఏప్రిల్ 16ను టార్గెట్ గా పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం సంకేతాలు ఇచ్చింది. ఇప్పుడు అధికారులకు జారీ చేసిన నోట్ లోనూ అదే విషయం పేర్కొనడంతో దాదాపుగా ఇదే ఏపీలో ఎన్నికల తేదీ కావచ్చని తెలుస్తోంది.
Related News
Intelligence Alert To Election Comission: ఏపీలో ఎన్నికల కౌంటింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ.. ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక తాజాగా ఇచ్చింది. కౌంటింగ్ కు ముందు తర్వాత కాకినాడ స...
Continue reading
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై (Elections 2024 Result) రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ( Prashant Kishore) సంచలన వ్యాఖ్యలు (Sensational comments) చేశారు.
జగన్ (Ja...
Continue reading
'రిగ్గింగ్ను అడ్డుకోవాలనే ఏజెంట్గా కూర్చున్నా'
ప్రాణం పోయినా.. అరాచకాలను ఎదుర్కొవాలనుకున్నా..వైకాపా వర్గీయుల దాడిలో గాయపడ్డ చేరెడ్డి మంజుల
ఈనాడు, అమరావతి: 'మా ఊళ్లో ప్రతి ఎ...
Continue reading
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు దేశవ్యాప్తంగా నాలుగో విడత పోలింగ్ జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు ఓటింగ్ జరుగుతుంది. ఓటేసేందుకు జనాలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఇక ...
Continue reading
కొంతమంది ఓటుని చాలా పవిత్రమైన హక్కుగా భావిస్తారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఓటు వేసి తీరతారు. అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంటారు.
బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన ...
Continue reading
చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అన్ని చోట్లా పోలింగ్...
Continue reading
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
పార్లమెంట్(Parliament elections) ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో...
Continue reading
AP Polling : ఏపీలో సోమవారం లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుందని సీఈవో ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.
...
Continue reading
జగన్ పన్నాగం పారలేదు. ఆయన ఎత్తులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముకుతాడు వేసింది. ఓటర్లకు డబ్బులు పంచడమే కాకుండా, ప్రభుత్వ పథకాల ద్వారా పోలింగుకు ఒకటి, రెండు రోజుల ముందు రూ.14,165 కో...
Continue reading
AP Elections 2024: ఏపీ వ్యాప్తంగా 4,44,216 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వినియోగించుకున్నారని ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ తెలిపారు. మే 4 నుంచి 9వ తేదీ వరకు పోస్టల...
Continue reading
ఏపీలో ఎన్నికల పోలింగ్ కు మరో ఆరు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో హోం ఓటింగ్ పూర్తి కాగా.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఉద్యోగుల ఓటింగ్ కొనసాగుతోంది. అయితే ఇందులో ఉద్...
Continue reading
అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని పలువురు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు కొనసాగుతోంది. ఇటీవల ఎస్పీ అన్బురాజన్ను బదిలీ చేసిన ఈసీ.. తాజాగా అనంతపురం డీఐజీ...
Continue reading