Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒక్క పూట బడులపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు..

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.


తెలంగాణలో ఒక్క పూట బడులపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వలు ఇచ్చింది. . 2025 మార్చి 15వ తేదీనుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు, ఎయిడెడ్ ఇతర అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని బడులు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు పాఠశాలు ఉంటాయని వెల్లడించింది. 12:30 మధ్యాహ్న భోజనం అందిస్తారని తెలిపింది. లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ 23 వరకూ హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి. అయితే.. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు కొనసాగే పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో సూచించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.