తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. పిటిషనర్‌కు రూ కోటి జరిమానా

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించిన పిటిసనర్‌ కు రూ. కోటి జరిమానా విధించింది. హైకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్ లో ఉండగా మరో బెంచ్ కు వెళ్లిన పిటిషనర్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. హైకోర్టును తప్పుదోవ పట్టించేఆలా పిటిషన్లు వేయడంపై జస్టిస్ నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


పిటిషన్ పెండింగ్ లో ఉండగా మరో బెంచ్ లో ఆర్డర్ తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి నగేష్.. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు యత్నించినందుకు రూ. కోటి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.