ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే… వేసవి సెలవుల లెక్క తప్పిందే.

స్కూల్ విద్యార్థులు, కాలేజీ యువత ఎగిరిగంతేసే సమాచారమిది. తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు వేసవి సెలవులపై క్లారిటీ ఇచ్చింది. దాదాపు 50 రోజులపాటు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఈ నెల నుండే వేసవి సెలవులు ప్రారంభం అవుతాయని… అయితే ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నట్లు కాకుండా కాస్త ఆలస్యంగా ఈ సెలవులు ప్రారంభంకానున్నాయి.


ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా మార్చి 24 నుండే విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే మే నెలంతా సెలవులే ఉంటాయి. ఎండల తీవ్రత తగ్గి వర్షాకాలం ప్రారంభమయ్యే జూన్ లో తిరిగి విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయని తెలిపారు. జూన్ 12 ను విద్యాసంస్థలు పున:ప్రారంభం అవుతాయని విద్యాశాఖ ప్రకటించింది.

వేసవి సెలవుల్లో విద్యాసంస్థలు క్లాసులు నిర్వహించకూడదని … అలా చేసినట్లు తెలిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఇంటర్ విద్యార్థులకు ఇప్పటికే పరీక్షలు ముగిసి వేసవి సెలవులు కొనసాగుతున్నాయి… వారికి కూడా వేసవి సెలవుల్లో నీట్, ఎంసెట్, జెఈఈ అంటూ క్లాసులు నిర్వహించకూడదని ఇంటర్మీడియట్ బోర్డ్ హెచ్చరించింది. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడేలా మండుటెండల వేళ క్లాసుల నిర్వహణ తగదని … విద్యాసంస్థలు ఇందుకు సహకరించాలని సూచించారు.

వేసవి సెలవులపై జరుగుతున్న ప్రచారంపై క్లారిటీ :

ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. అడపాదడపా వర్షాలు కురిసి వాతావరణం చల్లబడుతున్నాయి… దీంతో మధ్యలో ఎండలు తగ్గినా వడగాలుల వీస్తున్నాయి. ఇక మండుటెండల సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుతున్నాయి. ఇప్పటికే తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు మించిపోయాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి.

ఇలా ఎండలు ముదురుతున్న నేపథ్యంలో వేసవి సెలవులు ఈసారి ముందుగానే ప్రారంభం కానున్నట్లు ప్రచారం జరిగింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, తల్లిదండ్రుల ఆందోళనను పరిగణలోకి తీసుకుని పరీక్షలు తొందరగా ముగించి ముందుగానే సెలవులు ఇస్తారన్నది ప్రచారం. ప్రతిసారిలా ఏప్రిల్ 24 నుండి కాకుండా ఏప్రిల్ 20 నుండే వేసవి సెలవులు ప్రారంభం అవుతాయని జోరుగా ప్రచారం జరిగింది.

ఈ ప్రచారం నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కన్ఫ్యూజన్ మొదలయ్యింది. పరీక్షల షెడ్యూల్ ఏమయినా మారుతుందా? అన్న అనుమానం మొదలయ్యింది. ఇలా గందరగోళం నెలకొనడంతో పరీక్షలు, వేసవి సెలవులపై విద్యాశాఖ క్లారిటీ ఇవ్వక తప్పలేదు. ప్రస్తుతం జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని… వేసవి సెలవులు ఎప్పట్లాగే ఏప్రిల్ 24న ప్రారంభం అవుతాయని ప్రకటించారు. కాబట్టి వేసవి సెలవులపై ఎలాంటి ప్రచారాన్ని నమ్మొద్దని విద్యాశాఖ స్పష్టం చేసింది.

ఏపీలో వేసవి సెలవులు ఎప్పట్నుంచంటే…

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుండే ప్రారంభం కానున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే వేసవి సెలవులు ఉంటాయని… ఏప్రిల్ 24 నుండి జూన్ 12 వరకు సెలవులు కొనసాగుతాయి. అయితే తెలంగాణలో ఇప్పటికే వేసవి సెలవులకు అధికారిక ప్రకటన వెలువడగా ఏపీలో ఇంకా వేసవి సెలవులపై స్పష్టత రావాల్సి ఉంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇదిలావుంటే ఇప్పటికే ఇంటర్మీడియట్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. అలాగే పదో తరగతి పరీక్షలు కూడా ముగియడంతో వారు కూడా వేసవి సెలవుల్లో ఉన్నాయి… ఫలితాల తర్వాత వీరు ఇంటర్మీడియట్ లో చేరాల్సి ఉంటుంది. ఇలా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మాత్రం జూన్ 1 తో వేసవి సెలవులు ముగుస్తాయి… జూన్ 2న కాలేజీలు పున:ప్రారంభం అవుతాయి.,

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.