తమిళనాడులో అధికారంలో ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (డిఎంకె) మద్దతుతో నటుడు కమల్ హాసన్ త్వరలో రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. డీఎంకే తన నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం)కి కేటాయించాలని నిర్ణయించింది.
పార్లమెంటు ఎగువ సభకు హాసన్ నామినేట్ను నిర్ధారిస్తూ.. MNM ఇప్పటికే ఒక తీర్మానాన్ని ఆమోదించింది. కమల్ హాసన్ రాజకీయ ప్రయాణం 2018లో ప్రారంభమైంది. కాగా, రానున్న రాజ్యసభ ఎన్నికలకు డీఎంకే మంగళవారం అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. డిఎంకె ప్రకటించిన మరో ముగ్గురు అభ్యర్థులు – సీనియర్ న్యాయవాది పి విల్సన్, కవి, రచయిత్రి సల్మా, మాజీ మంత్రి ఎస్ఆర్ శివలింగం.
2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఎంఎన్ఎంతో కుదుర్చుకున్న ఎన్నికల ఒప్పందానికి అనుగుణంగానే కమల్ హాసన్ పార్టీకి ఒక సీటు కేటాయించినట్లు అధికార డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
































