ప్రయాణికులకు శుభవార్త.. 44 ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

 ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాలకు వీక్లీ స్పెషల్‌ రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది.


ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని 44 ప్రత్యేక రైళ్లను పట్టాలెక్కించినట్లు వివరించింది. విశాఖపట్నం – బెంగళూరు (08581) మధ్య జూన్‌ ఒకటి నుంచి 29వ తేదీ వరకు ప్రతి ఆదివారం రైలు రాకపోకలు సాగిస్తుందని పేర్కొంది. ఇక బెంగళూరు-విశాఖపట్నం (08582) మధ్య జూన్‌ 2 నుంచి 30 వరకు ప్రతి సోమవారం రైలు నడుస్తుందని తెలిపింది.

విశాఖపట్నం – తిరుపతి (08547) రైలు జూన్‌ 4 నుంచి జులై 30 వరకు ప్రతి బుధవారం రైలు నడుస్తుందని.. విశాఖపట్నం-తిరుపతి (08548) రైలు జూన్‌ 5 నుంచి జులై 31 వరకు ప్రతి గురువారం రైలు నడుస్తుందని తెలిపింది. విశాఖపట్నం-చర్లపల్లి (08579) రైలు జూన్‌ 6 నుంచి జులై 27 వరకు ప్రతి శుక్రవారం.. చర్లపల్లి నుంచి – విశాఖపట్నం (08580) మధ్య రైలు జూన్‌ 7 నుంచి జులై 26 వరకు ప్రతి శనివారం నడుస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ప్రయాణికులు ఆయా రైళ్ల సేవలను వినియోగించుకోవాలని కోరింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.