ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త.. వారికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు విడతల్లో అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసింది.


శరవేగంగా ఇంటి నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా లబ్ధిదారులకు రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇల్లు కట్టుకోలేకపోతున్న లబ్ధిదారులకు ప్రభుత్వ నిర్ణయం వల్ల ఊరట లభిస్తోంది. యాదాద్రి జిల్లాలో మొదటి విడతగా 9,175 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. లబ్ధిదారులకు రుణాలు ఇప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

యాదాద్రి జిల్లాలో మొదటి విడతగా 9,175 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇల్లు మంజూరైన సమయంలోనే పేదలకు రుణాలు ఇప్పిస్తామని ప్రభుత్వం తెలిపింది. జిల్లాలో 5,980 ఇండ్లకు పునాది వేశారు. చాలామంది డబ్బులు లేక ఇల్లు కట్టడం మొదలు పెట్టలేదు. దీంతో లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇల్లు మంజూరైన లబ్ధిదారులు మహిళా సంఘాల్లో సభ్యులై ఉంటే రుణం తీసుకోవడానికి అర్హులు. సంఘాల లీడర్లతో అధికారులు మాట్లాడి రుణాలు ఇచ్చేలా చూస్తున్నారు. మూడు రకాలుగా రుణాలు తీసుకునే అవకాశం ఉంది. బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి, సంఘం అంతర్గత పొదుపు ద్వారా రుణం ఇస్తారు.డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(డీఆర్‌డీఏ) ఇందుకు సంబంధించిన బాధ్యతలు చూసుకుంటుంది. సభ్యుల అర్హతను బట్టి రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు రుణం ఇస్తారు. సంఘంలో తీసుకున్న రుణాన్ని 10 వాయిదాల్లో కట్టవచ్చు. గతంలో రుణం తీసుకుంటే, ప్రభుత్వం నాలుగు విడతలుగా ఇచ్చే డబ్బులోంచి ఆ రుణం చెల్లించాల్సి ఉంటుంది.
జిల్లాలో మొత్తం 2 వేల మందికి మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 393 మందికి రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు రుణాలు ఇచ్చారు. మొత్తం రూ. 4.34 కోట్లు రుణంగా అందించారు. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులకే రుణాలు ఇచ్చారు. ఇప్పుడు మున్సిపాలిటీల్లోని లబ్ధిదారులకు కూడా రుణాలు ఇప్పించడానికి సిద్ధమవుతున్నారు. సంఘాల్లో సభ్యులుగా ఉన్నవారికి రుణాలు ఇప్పిస్తారు.

ఇల్లు మంజూరైన లబ్ధిదారుల్లో నిర్మాణం ప్రారంభించడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో వారికి మహిళా సంఘాలు, బ్యాంకు లింకేజీ, స్త్రీ నిధి ద్వారా రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకున్నాం. 2 వేల మందికి ఇప్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని అధికారులు తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.