తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల (Election) హడావుడి ప్రారంభం మొదలైంది. గత సంవత్సర కాలంగా పల్లెల్లో సర్పంచులు లేకపోవడంతో..
ప్రత్యేక అధికారులతో గ్రామాల పరిపాలనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు పంచాయా అని ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) మొదట ఎంపీటీసీ ఎన్నికలు (MPTC elections) నిర్వహించాలని భావిస్తుంది. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం సూచనలు (Government instructions) కూడా చేసింది. ఎంపీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికల నిర్వాహణ ఉండటంతో అధికారులు ఆ విధంగా ముందుకు సాగుతున్నారు.
ఈ మేరకు ఎన్నికల సంఘం (Election Commission) కసరత్తు చేస్తుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది (Polling staff) డేటాను సిద్ధం చేయాలని కలెక్టర్ల (collectors)కు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నమోదైన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని ఈ సందర్భంగా ఈసీ సూచించినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని జిల్లా, రెవెన్యూ, డివిజన్, మండలం, పంచాయతీలతో పాటు వార్డుల సంఖ్య ఆధారంగా..పూర్తి వివరాలు అందుబాటులో ఉండాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఆదేశాలతో త్వరలోనే పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
































