మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు నిన్న ఆల్ టైం రికార్డుకు చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు కూడా పసిడి ధరలు భారీగా పెరిగి మరోసారి బిగ్ షాక్ ఇచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.92,850 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.950 పెరిగి రూ.93,800గా ఉంది. అలాగే నిన్న రూ.1,01,290 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.1040 పెరిగి రూ.1,02,330 గా ఉంది. ఇక అటు వెండి ధరపై రూ.1000 పెరిగి కిలో రూ.1,29,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.93,800
24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,02,330
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.93,800
24 క్యారెట్ల బంగారం ధర – రూ.,1,02,330
































