వెండి ఆభరణాలకు కూడా హాల్మార్కింగ్ తప్పనిసరి చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఈ కొత్త రూల్ సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. బంగారం తర్వాత వెండిని విలువైన లోహంగా చాలా మంది చూస్తారు. బంగారంతో పాటు వెండి ఆభరణాలను కూడా ధరిస్తారు. అయితే బంగారం మాదిరిగానే వెండికి కూడా నియమాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వెండి ఆభరణాలకూ హాల్మార్కింగ్ తప్పనిసరి చేయడానికి కొత్త నియమాలు అమలు చేసేలా ప్రణాళికలు చేస్తోంది.
బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ఈ కారణంతో చాలా మంది వెండి వైపు మెుగ్గు చూపిస్తున్నారు. వెండికి డిమాండ్ కూడా పెరిగింది, ధరలు పెరుగుతున్నాయి. అయితే సెప్టెంబర్ 1, 2025 నుండి కొత్త నియమాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. వెండి ఆభరణాలకు కూడా హాల్మార్కింగ్ తప్పనిసరి చేసేలా ప్రభుత్వం ఆలోచిస్తోంది.
వెండి ఆభరణాలకు హాల్మార్కింగ్ విధానం సెప్టెంబర్ 1, 2025 నుండి అమలులోకి వస్తుందని నివేదికలు చెబుతున్నాయి. బంగారం కోసం ఇప్పటికే అమలులో ఉన్న హాల్మార్కింగ్ విధానం మాదిరిగానే వెండికి కూడా సెప్టెంబర్ 1 నుండి హాల్మార్కింగ్ తప్పనిసరి అవుతుంది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రకారం వెండి ఆభరణాలను 900, 800, 835, 925, 970, 990 అనే ఆరు స్వచ్ఛత స్థాయిలుగా వర్గీకరించారు. వెండి ఆభరణాల స్వచ్ఛతను బట్టి 6 అంకెల హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ (HUID) ఇస్తారు. ఈ హాల్మార్క్ ప్రతి ఆభరణాలపై ముద్రిస్తారు. ఈ కొత్త వ్యవస్థ ప్రస్తుతం అమలులో ఉన్న హాల్మార్కింగ్ వ్యవస్థను భర్తీ చేస్తుంది.
హాల్మార్కింగ్ అనేది విలువైన లోహ ఆభరణాలలో లోహం స్వచ్ఛతను సూచిస్తుంది. ఇది అధికారికంగా స్వచ్ఛతను నమోదు చేసే ప్రత్యేక ప్రక్రియ. భారతదేశంలో బీఐఎస్.. హాల్మార్కింగ్ ఆభరణాలు చట్టపరమైన స్వచ్ఛత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది.
సెప్టెంబర్ 1, 2025 నుండి వెండి ఆభరణాలకు హాల్మార్కింగ్ తప్పనిసరి ఉండే అవకాశం ఉంది. బంగారం కోసం అమలు చేసే దానిలాగే ఉంటుంది. బీఐఎస్ కేర్ యాప్లోని వెరిఫై HUID ఫీచర్ ద్వారా కొనుగోలుదారులు ఆభరణాల స్వచ్ఛతను చెక్ చేయవచ్చు.
































