రాష్ట్రంలో అన్ని చెక్​పోస్టులు రద్దు

రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖకు చెందిన అన్ని చెక్‌పోస్టులను రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో చెక్‌పోస్టుల వద్ద జరిగే నిర్లక్ష్యం, అవినీతి వంటి సమస్యలకు చెక్​పెట్టింది.


రవాణా రంగంలో పారదర్శకతను పెంచడం, త్వరగా వాహనదారులకు సేవలందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త ఉత్తర్వుల ప్రకారం వాహన తనిఖీల కోసం ఇకపై మొబైల్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మొబైల్ స్క్వాడ్‌లు వాహనాలను ఆరు నెలలకు ఒకసారి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుమతితో తనిఖీ చేస్తాయి.

రవాణ శాఖలో ప్రధాన మార్పులు :

చెక్‌పోస్టులు రద్దు : రాష్ట్రంలోని అన్ని రవాణా చెక్‌పోస్టులు శాశ్వతంగా రద్దు చేయబడ్డాయి.

మొబైల్ స్క్వాడ్‌లు : రవాణా శాఖ అధికారులు మొబైల్ స్క్వాడ్‌ల ద్వారా తనిఖీలు నిర్వహిస్తారు. ఇది అక్రమ రవాణాను నివారించడంలో సహాయపడుతుంది.

ఆన్‌లైన్ ఫీజులు : రవాణా ఫీజులు, పన్నులు చెల్లించడానికి వాహనదారులకు ఆన్‌లైన్ సదుపాయం కల్పించబడుతుంది.

పారదర్శక వ్యవస్థ : వాహన తనిఖీలు, పన్నుల వసూలు కోసం ఏఎన్‌పీఆర్ (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలు, ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు.

జరిమానాలకు అవకాశం : నిబంధనల ఉల్లంఘన, రవాణా చట్టాలను ఉల్లంఘించిన వాహనాలపై జరిమానాలు ఆన్‌లైన్‌లో విధించబడతాయి.

ఈ మార్పులన్నీ రాష్ట్ర రవాణా శాఖలో అవినీతిని తగ్గించి, పారదర్శకతను పెంచుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఉత్తర్వులన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.