రాష్ట్ర ప్రభుత్వం రవాణా శాఖకు చెందిన అన్ని చెక్పోస్టులను రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో చెక్పోస్టుల వద్ద జరిగే నిర్లక్ష్యం, అవినీతి వంటి సమస్యలకు చెక్పెట్టింది.
రవాణా రంగంలో పారదర్శకతను పెంచడం, త్వరగా వాహనదారులకు సేవలందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. కొత్త ఉత్తర్వుల ప్రకారం వాహన తనిఖీల కోసం ఇకపై మొబైల్ స్క్వాడ్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మొబైల్ స్క్వాడ్లు వాహనాలను ఆరు నెలలకు ఒకసారి జిల్లా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనుమతితో తనిఖీ చేస్తాయి.
రవాణ శాఖలో ప్రధాన మార్పులు :
చెక్పోస్టులు రద్దు : రాష్ట్రంలోని అన్ని రవాణా చెక్పోస్టులు శాశ్వతంగా రద్దు చేయబడ్డాయి.
మొబైల్ స్క్వాడ్లు : రవాణా శాఖ అధికారులు మొబైల్ స్క్వాడ్ల ద్వారా తనిఖీలు నిర్వహిస్తారు. ఇది అక్రమ రవాణాను నివారించడంలో సహాయపడుతుంది.
ఆన్లైన్ ఫీజులు : రవాణా ఫీజులు, పన్నులు చెల్లించడానికి వాహనదారులకు ఆన్లైన్ సదుపాయం కల్పించబడుతుంది.
పారదర్శక వ్యవస్థ : వాహన తనిఖీలు, పన్నుల వసూలు కోసం ఏఎన్పీఆర్ (ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్) కెమెరాలు, ఇతర అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు.
జరిమానాలకు అవకాశం : నిబంధనల ఉల్లంఘన, రవాణా చట్టాలను ఉల్లంఘించిన వాహనాలపై జరిమానాలు ఆన్లైన్లో విధించబడతాయి.
ఈ మార్పులన్నీ రాష్ట్ర రవాణా శాఖలో అవినీతిని తగ్గించి, పారదర్శకతను పెంచుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఉత్తర్వులన్నీ తక్షణమే అమల్లోకి వస్తాయి.
































