కేంద్ర ప్రభుత్వం పలు వస్తువులపై జీఎస్టీని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. GST కౌన్సిల్ సమావేశంలో అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్ను GST రహితంగా చేశారు.
అంటే దేశంలో మదర్ డెయిరీ, అముల్ మిల్క్ రెండూ జీఎస్టీ పరిధి నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం రెండు కంపెనీల పాలపై 5% GST విధిస్తుంది. ఇప్పుడు ఈ ప్రకటన తర్వాత రెండు కంపెనీల పాలను ఎంత తగ్గించవచ్చనేది అతిపెద్ద ప్రశ్న. అయితే కంపెనీల నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ నవరాత్రి మొదటి రోజు నుండి కొత్త జీఎస్టీ రేట్లు అమలు చేసిన తర్వాత పాల ధరలు గణనీయంగా తగ్గుతాయని అంచనా వేయవచ్చు. పాల ధరలలో రూ. 2 నుండి రూ. 4 వరకు తగ్గింపు ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని కారణంగా మధ్యతరగతి వారికి పెద్ద ఉపశమనం లభిస్తుంది. అముల్, మదర్ డెయిరీ మిల్క్ ధరలను ఎంత తగ్గించవచ్చో తెలుసుకుందాం.
అమూల్ పాల ప్రస్తుత ధర (మే 2025 నుండి అమలులో ఉంది)
- అముల్ గోల్డ్ (ఫుల్ క్రీమ్ పాలు) ధర లీటరుకు రూ. 69 (5% GSTతో).
- అముల్ తాజా (టోన్డ్ పాలు) ప్రస్తుత ధర లీటరుకు రూ. 57 (5% GSTతో).
- అముల్ టీ స్పెషల్ ప్రస్తుతం లీటరుకు రూ.63కి (5% GST).
- ప్రస్తుతం అమూల్ గేదె పాలు రూ.75 (5% GST).
- ఇది కాకుండా అముల్ ఆవు పాలు ప్రస్తుతం రూ.58 (5% GST)
అమూల్ పాలపై పన్ను తగ్గిన తర్వాత ఉండే ధరలు(సెప్టెంబర్ 22 నుండి అమలులోకి వస్తుంది).
- పన్ను మినహాయింపు పొందిన తర్వాత అముల్ గోల్డ్ (ఫుల్ క్రీమ్ పాలు) లీటరుకు రూ.3.45 తగ్గి రూ.65 నుండి 66 వరకు ఉంటుందని అంచనా.
- అముల్ తాజా (టోన్డ్ పాలు) పన్ను రహితంగా మారిన తర్వాత అది లీటరుకు రూ.2.85 తగ్గి రూ.54 నుండి 55 వరకు ఉంటుందని అంచనా.
- అముల్ టీ స్పెషల్ పన్ను రహితంగా మారిన తర్వాత లీటరుకు రూ.3.15 తగ్గి రూ.59 నుండి 60 వరకు ఉంటుందని అంచనా.
- అమూల్ గేదె పాలు పన్ను రహితంగా మారిన తర్వాత దాని ధర లీటరుకు రూ.3.75 తగ్గి రూ.71 నుండి 72 వరకు ఉంటుందని అంచనా.
- ఇది కాకుండా అమూల్ ఆవు పాలు పన్ను రహితంగా మారిన తర్వాత దాని ధర లీటరుకు రూ.2.90 తగ్గి రూ.56 నుండి 57 వరకు ఉంటుందని అంచనా.
మదర్ డైరీ మిల్క్ ప్రస్తుత ధర (మే 2025 నుండి అమలులో ఉంది):
- మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ మిల్క్ ధర లీటరుకు రూ. 69 (5% GSTతో)
- మదర్ డెయిరీ టోన్డ్ పాలు లీటర్కు రూ.57 (5% GST)
- మదర్ డైరీ బఫెలో మిల్క్ ధర రూ.74 (5% GST)
- మదర్ డైరీ ఆవు పాలు రూ.59 (5% GST) ఇది అమూల్ కంటే రూ. 1 ఎక్కువ.
- మదర్ డెయిరీ డబుల్ టోన్డ్ పాలు లీటరుకు రూ.51కి (5% GST).
- మదర్ డైరీ టోకెన్ పాలు (బల్క్) రూ.54 (5% GST)
పన్ను తగ్గింపు తర్వాత ధరలు:
- మదర్ డెయిరీ ఫుల్ క్రీమ్ మిల్క్ జీఎస్టీ తగ్గిన తర్వాత రూ.3.45 తగ్గి లీటరుకు రూ.65 నుండి 66 వరకు ఉంటుందని అంచనా.
- మదర్ డెయిరీ టోన్డ్ పాలు రూ.2.85 తగ్గి లీటరుకు రూ.55 నుంచి 56 వరకు తగ్గవచ్చు.
- మదర్ డెయిరీ బఫెలో మిల్క్ రూ.3.7 తగ్గి లీటర్కు రూ.70 నుండి రూ.71 వరకు ఉండవచ్చు.
- ఆవు పాలు రూ.2.95 తగ్గి లీటరుకు రూ.56 నుండి 57 వరకు ఉండవచ్చని అంచనా.
- మదర్ డెయిరీ డబుల్ టోన్డ్ పాలు రూ.2.55 తగ్గి లీటరుకు రూ.48 నుంచి రూ.49 వరకు ఉండవచ్చని అంచనా.
- మదర్ డెయిరీ టోకెన్ పాలు (హోల్సేల్) రూ.2.7 తగ్గి లీటరుకు రూ.51 నుండి 52 వరకు ఉండవచ్చు.
మదర్ డైరీ ప్రకటన:
వివిధ ఉత్పత్తులపై GST కోతల కారణంగా వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తామని మదర్ డెయిరీ గురువారం తెలిపింది. దేశంలోని ప్రముఖ పాల కంపెనీలలో మదర్ డెయిరీ ఒకటి. గత ఆర్థిక సంవత్సరంలో దీని టర్నోవర్ రూ. 17,500 కోట్లు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంపై స్పందిస్తూ, మదర్ డెయిరీ MD మనీష్ బాండ్లిష్ మాట్లాడుతూ.. పనీర్, చీజ్, నెయ్యి, వెన్న, UHT పాలు, పాల ఆధారిత పానీయాలు, ఐస్ క్రీం వంటి వివిధ పాల ఉత్పత్తులపై GST రేట్లను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాము. ఇది ముఖ్యంగా ప్యాకేజ్డ్ కేటగిరీకి పెద్ద ప్రోత్సాహకం అని, ఇది భారతీయ ఇళ్లలో బాగా ప్రాచుర్యం పొందుతోందని అన్నారు. అలాగే భవిష్యత్తులో వాటి డిమాండ్ మరింత పెరుగుతుందని బాండ్లిష్ అన్నారు.
































