రైలు బోగీలపై ఈ గీతలు ఎందుకు ఉంటాయో తెలుసా? చాలా మందికి తెలియదు!

చాలా మంది రైలు ప్రయాణం చేసి ఉంటారు. సామాన్యులకు తక్కువ ఛార్జీలతో అందుబాటులో ఉండేది రైలు ప్రయాణం మాత్రమే. అందుకే సామాన్యులు సైతం రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు.


రైల్వేకు సంబంధించిన ఎన్నో విషయాలు ఉంటాయి. వాటిని పెద్దగా పట్టించుకోరు. మీరు కూర్చున్న రైలులోని బోగీలపై వివిధ రకాల సమాచారంతో పాటు కొన్ని గీతలు కనిపిస్తుంటాయి. అవి ఎందుకు ఉంటాయోనని మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ గీతల వల్ల ఎన్నో అర్థాలు ఉన్నాయి. ప్రతి భోగీ పైన వివిధ రకాల రంగులతో గీతలు ఉంటాయి. ఆ రంగులను బట్టి వాటి అర్థాలు మారుతుంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

నీలి రంగు లో పసుపు గీతలు ఉంటే: రైలు బోగీపై పసుపు రంగు చారలు ఉంటే అనారోగ్యం ఉన్న వ్యక్తుల కోసం కేటాయించిన బోగీ అని అర్థం. అంటే అంగవైకల్యం ఉన్న వారికి కేటాయించిన బోగీ.

బోగీ పై పసుపు గీతలు ఉంటే: బోగీ చివర పసుపు రంగు రేఖలు ఉంటే అది రిజర్వ్ చేయని కోచ్ అని అర్థం. అంటే అది జనరల్ కోచ్ అని. ఇందులో టికెట్ నెంబర్ అవసరం లేదు.

బూడిద రంగులో ఎరుపు గీతలు ఉంటే: రైలు బోగీపై బుడిద రంగులో ఎరుపు గీతలు ఉన్నట్లయితే అది ఫస్ట్‌ క్లాస్‌ కోచ్‌ అని అర్థం చేసుకోవాలి. ఫస్ట్‌క్లాస్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నవారికి ఈ బోగీలో ప్రయాణించవచ్చు.

ఆకుపచ్చ రంగు గీతలు ఉంటే: రైలు బోగీపై ఆకుపచ్చ గీతలు ఉంటే ఈ కోచ్‌ మహిళలకు కేటాయించబడిందని అర్థం. ఇలాంటి బోగీలు ముంబైలో నడుస్తున్న స్థానిక రైళ్లలో కనిపిస్తుంటుంది.

బోగీ పై తెల్లని గీతలు ఉంటే: నీలి రంగు డబ్బా బోగీపై లేత నీలం లేదా తెలుపు రంగు గీతలు ఉన్నట్లయితే అది స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌ అని అర్థం.

గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌కు ఆకుపచ్చ కోచ్‌లు, అలాగే మీటర్-యార్డ్ రైళ్లకు గోధుమ రంగు కోచ్‌లు ఉంటాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.