దసరాకు చుక్కా ముక్కా లేనట్లే..

దసరా అంటే సాధారణంగా ఒక కిక్కు.. ఏ పండగకి లేనంతగా దసరా పండుగకు అంత జోష్ ఉంటుంది. ఇదే రోజు చుక్క.. ముక్క ఉండాల్సిందే.. అంతేకాకుండా పల్లె, పట్టణం అని తేడా లేకుండా మద్యం ఏరులై పారుతోంది.


కుటుంబ సభ్యులంతా మద్యం మత్తును గమ్మత్తుగా ఎంజాయ్ చేస్తుంటారు. మద్యంతో పాటు మటన్, చికెన్, పిష్, ఫ్రాన్స్ ఉండాల్సందే. అయితే ఈసారి దసరాకు ముక్క.. చుక్కపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకే రోజు గాంధీ జయంతి.. దసరా..

ఆక్టోబరు 2న గాంధీ జయంతి రోజు నాడే దసరా కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం, మాంసం విక్రయాల పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం దుకాణాలు మూసివేయడం అనవాయితీ. అయితే అన్ని పండుగల మాదిరిగా దసరా ఉండదు.. ఆ రోజున చాలా మందికి చుక్కలేనేదే.. ముద్ద తిగదు. అందుకోసం ఆక్టోబర్ 2న మద్యం, మాంసం విక్రయాల పై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఆక్టోబరు 2న మద్యం, మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించాలా..? మినహాయింపు ఇవ్వాలా..? అనే దాని పై మల్లగుల్లాలు పడుతున్నారు.

గతేడాది దసరా కిక్కుకు 1285 కోట్లు..

దసరా పండక్కి గతే ఏడాది రాష్ట్ర ఖజానకు రూ.1285 కోట్లు వచ్చి చేరాయి. దసరా వేడుకలను పురస్కరించుకొని గత సంవత్సరం అక్టోబర్ 1 నుంచి 14 వరకు.. 11 రోజుల్లో ఎక్పైజ్ శాఖకు రూ.1285.16 కోట్లు వచ్చాయి. వీటిల్లో ఈ 11,03,614 కేసుల లిక్కర్ సీసాలు.. 20,63,350 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. పండుగ రోజు అంటే 11వ తేదీన అత్యధికంగా రాష్ట్ర వ్యాప్తంగా 3,06,761 కేసుల బీర్లను కొనుగోలు చేశారు. ఏ గల్లీలోని కిరాణా కొట్టులో చూసినా లిక్కర్ బాటీళ్లు, బీరు సీసాలే దర్శనమిచ్చాయి. వైన్ షాపుల వద్ద మద్యం ప్రియులు బారులు తీరు పెద్దఎత్తున మద్యాన్ని కొనుగోలు చేశారు. అయితే అక్టోబరు 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను మూసి వేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో మద్యం అమ్మకాల పై తీవ్ర ప్రభావం పడవచ్చు. రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడే అవకాశం లేకపోలేదు.

మాంసానికి మస్తు గిరాకీ…

దసరాకి మాంసాహారులైన ప్రతి ఇంట్లో ముక్క ఉండాల్సిందే.. గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు, మేకపోతులను కోసి వాటాలు వేయాల్సిందే. నాట్ కోళ్లు, ఫారం కోళ్లు, చేపలు, రొయ్యలకు సైతం మస్తుగిరాకీ ఉంటోంది. ఇలా ప్రతి ఒక్కరూ పండుగ జరుపుకుంటారు. గ్రామాలు, పట్టణాలలోని వ్యాపారస్తులు, దుకాణాదారులు, పెద్ద పెద్ద వాహనాల యాజమానులు దసరా పండుగ సందర్భంగా వారి దుకాణాలు, పరిశ్రమలు వాహనాల ముందు మేకపోతులు, గొర్రెపోతులు బలి ఇవ్వడం అనవాయితీ, ఇందుకోసం పొరుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున మేకలు, గొర్రెలు, కోళ్లు, చేపలు, రొయ్యలలను వ్యాపారులు దిగుమతి చేసుకుంటారు. అయితే దసరా ఒక వేల మాంసం దుకాణాలను మూసివేసినట్లయితే ముక్కపై తీవ్ర ప్రభావం ఉంటుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.