టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవలే కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.. నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన ఫొటోలు, పేరును వాడుకోకుండా.. ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై తాజాగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
టాలీవుడ్ కింగ్ నాగార్జున ఇటీవలే కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.. నాగార్జున ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అనుమతి లేకుండా తన ఫొటోలు, పేరును వాడుకోకుండా.. ఆదేశాలు ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే నాగార్జున పిటిషన్ను జస్టిస్ తేజస్ కారియా విచారించారు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన కంటెంట్లో.. అలాగే వస్తువులు, దుస్తులపై తన చిత్రాన్ని అనధికారికంగా ఉపయోగించడం ద్వారా.. తన వ్యక్తిత్వ హక్కులు ఉల్లంఘిస్తున్నారని నాగర్జున తరపున న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అక్కినేని నాగార్జున వ్యక్తిత్వ హక్కులను కాపాడతామని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇటీవల ఐశ్వర్యారాయ్ విషయంలోనూ హైకోర్టు సానుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. అక్కినేని నాగర్జునకు కూడా ఊరట లభించనుందని పేర్కొన్నారు లాయర్లు..
సినీ నటుడు నాగార్జున పిటీషన్ పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారి చేసింది. నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది ఢిల్లీ హైకోర్టు. నాగార్జున ముందస్తు అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఆయన పేరు, స్వరం ఉపయోగించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది న్యాయస్థానం. ఏఐ, జెఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ ఫేక్స్ లాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలుంటాయని ఢిల్లీ హైకోర్టు హెచ్చరించింది.
































