ముఖ్యంగా ఇటీవల వెండి ధర విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే.
5 వేల చొప్పునే పెరుగుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే గత వారం.. 6 రోజుల వ్యవధిలో సుమారు రూ. 35 వేలకుపైనే పెరిగి.. కిలోకు హైదరాబాద్ నగరంలో రూ. 2 లక్షలపైకి చేరింది. ఐతే ఇప్పుడు అదిరిపోయే శుభవార్త వచ్చింది. ఒక్కరోజులో రికార్డ్ స్థాయిలో రేటు పతనం అయింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనాపై విధించిన 100 శాతం దిగుమతి సుంకాలు తాత్కాలికమేనని, త్వరలో చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ ను కలిసి గొప్ప ఒప్పందం కుదుర్చుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో అస్థిరత తగ్గి.. డిమాండ్ తగ్గింది. ఇదే సమయంలో కొద్ది రోజులుగా ఇటు వైపు విపరీతంగా పెట్టుబడులు పెట్టినవారు.. ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల వద్ద.. లాభాల్ని చేసుకోవడంలో భాగంగా.. ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా వెండి ధర కుప్పకూలింది.
హైదరాబాద్ నగరంలో సిల్వర్ రేటు ఒక్కరోజులోనే ఏకంగా రూ. 13 వేలు తగ్గగా.. ఇప్పుడు కేజీకి రూ. 1.90 లక్షలకు చేరింది. దీనికి ముందు ఇది రూ. 2.03 లక్షలుగా ఉండేది. దానికి ముందటి రోజు కూడా వెండి ధర రూ. 3 వేలు పడిపోయింది.
వెండి ధర బాటలోనే బంగారం రేటు కూడా పెద్ద మొత్తంలో పతనం అయింది. హైదరాబాద్ నగరంలో ఒక్కరోజు 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 1750 తగ్గగా తులం రూ. 1,19,950 కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పుత్తడి ధర 10 గ్రాములపై రూ. 1910 తగ్గడంతో ఇప్పుడు రూ. 1,30,860 కు దిగొచ్చింది. దీంతో ఇక మీదట బంగారం, వెండి ధరలు మరింత తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
దీనికి ముందటి రోజు అంటే.. అక్టోబర్ 17న రాత్రి సమయంలోనే ఒక్కసారిగా ఇంటర్నేషనల్ మార్కెట్లో బంగారం, వెండి రేట్లు భారీగా దిగొచ్చాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 100 డాలర్లకుపైగా తగ్గి.. 4,250 డాలర్ల స్థాయిలో ఉంది. సిల్వర్ రేటు రికార్డ్ స్థాయిలో దాదాపు 3 డాలర్ల వరకు తగ్గగా.. ఔన్సుకు 52 డాలర్ల దిగువకు చేరింది. కిందటి రోజు ఒక దశలో 54.70 డాలర్లపైకి చేరి జీవన కాల గరిష్టాల్ని నమోదు చేసింది. ఏదేమైనా ఎట్టకేలకు రేట్లు పడిపోవడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
































