మళ్లీ భారీగా పెరిగిపోయిన బంగారం ధరలు.. ఏకంగా ఎంత పెరిగాయంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ ఉదయం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.2,080 పెరిగి రూ.1,32,770గా ఉంది.


అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,900 పెరిగి రూ.1,21,700గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,560 పెరిగి రూ.99,580గా ఉంది. (Gold Rate)

ఢిల్లీ, ముంబైలో..

ఢిల్లీ నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,080 పెరిగి, రూ.1,32,920గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,900 పెరిగి రూ.1,21,850గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,560 పెరిగి రూ.99,730గా ఉంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.2,080 పెరిగి రూ.1,32,770గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,900 పెరిగి రూ.1,21,700గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,560 పెరిగి రూ.99,580గా ఉంది.

భారీగా తగ్గిన వెండి ధరలు

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో వెండి ధరలు ఇవాళ ఉదయం భారీగా తగ్గాయి. తాజా మార్కెట్ సమాచారం ప్రకారం మూడు నగరాల్లో కిలో వెండి ధర రూ.2,000 తగ్గి రూ.1,88,000గా ఉంది.

ఢిల్లీ నగరంలో వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండి ధర రూ.2,000 తగ్గి రూ. రూ.1,70,000గా ఉంది. ముంబైలోనూ కిలో వెండి ధర రూ.1,70,000గా ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.