భారతదేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా పాలతో టీ తయారు చేయరు.. ఎందుకో తెలుసా?

ఇండియాలో చాలామంది పాలతో చేసే మిల్క్ టీ తాగుతారు. కానీ ఇతర దేశాల్లో మాత్రం టీలో పాలు కలపరు. భారత్‌లో టీ తయారీలో ఈ తేడా ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.


ప్రపంచంలో దాదాపు అన్ని దేశాల్లో టీ (Tea) లవర్స్‌ ఉంటారు. ఒక్కో దేశంలో ఒక్కోలా ప్రిపేర్ చేసినా.. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ టీ పౌడర్. తేయాకు పొడిని నీటిలో మరిగించి.. అవసరమైతే షుగర్, నిమ్మరసం, ఇతర పదార్థాలు కలిపి వివిధ రకాల టీ వెరైటీలు తయారు చేస్తారు. కానీ ఇండియాలో మాత్రం ఎక్కువగా పాలతో చేసే మిల్క్ టీ తాగుతారు. సాధారణంగా ఇతర దేశాల్లో ప్రజలు రెగ్యులర్‌గా తాగే టీలో పాలు కలపరు. భారత్‌లో టీ తయారీలో ఈ తేడా ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.

వలసరాజ్యాలతో మొదలైన అలవాటు టీ భారతదేశంలో పుట్టలేదు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారితో పాటు ఇండియాలోకి అడుగుపెట్టింది. ప్రపంచ టీ వ్యాపారంలో చైనా ఆధిపత్యంతో పోటీ పడటానికి ఈస్ట్ ఇండియా కంపెనీ పెద్ద ఎత్తున టీ సాగును ప్రారంభించింది. మొదట్లో భారతీయుల కోసం టీ సాగు చేయలేదు. ఎగుమతి కోసం, బ్రిటిష్ ఉన్నత వర్గాల కోసం పండించారు.

1900ల ప్రారంభంలో బ్రిటిష్ వారు భారతీయులకు టీ గురించి ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. దానిని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి పాలు, చక్కెర యాడ్‌ చేయాలని సూచించారు. ఈ ఐడియా క్లిక్ అయింది. భారతీయులు బ్రిటీష్ వారి టీ తాగే విధానాన్ని ఫాలో అవ్వలేదు, కానీ దాన్ని సరికొత్తగా ఆవిష్కరించారు. బ్రిటిష్‌ వారి మార్కెటింగ్‌ స్ట్రాటజీ వర్కైట్‌ అయింది. తక్కువ కాలంలోనే లక్షలాది మందికి టీ లేనిదే రోజు గడవని పరిస్థితి వచ్చింది.

పాలు ప్రత్యేకం ఇండియాలో ప్రతి కిచెన్‌లో పాలు ఉండాల్సిందే. చాలా రకాల డ్రింక్స్‌, స్వీట్స్‌ తయారీలో పాలు మెయిన్‌ ఇంగ్రీడియంట్‌. టీతో కూడా పాలకు ఇలాంటి రిలేషన్‌ బిల్డ్‌ అయింది. పాలు టీని క్రీమీగా చేస్తాయి, ఏలకులు, అల్లం వంటివి కలిపినప్పుడు మంచి టేస్ట్‌, సువాసన తీసుకొస్తాయి. చక్కెర కలిపినప్పుడు రుచి ఇంకాస్త పెరుగుతుంది. దీంతో టీ ఓ డ్రింక్‌ కంటే మంచి ఫీలింగ్‌గా మారింది. రిలాక్స్‌ కావడానికి బెస్ట్‌ వే అయింది.

మసాలా చాయ్ ఫేమస్   భారతదేశం అంతటా టీ వ్యాపించడంతో, ప్రతి ప్రాంతంలో ఓ కొత్త రకం టీ తయారైంది.  కొందరు స్పైసీ కిక్ కోసం అల్లం, మరికొందరు సువాసన కోసం లవంగాలు, ఏలకులు దాల్చిన చెక్క వంటివి కలపడం స్టార్ట్‌ చేశారు. సుగంధ ద్రవ్యాలు, పాల మిశ్రమం టీని మసాలా చాయ్‌గా (Masala chai) మార్చాయి.

20వ శతాబ్దం మధ్య నాటికి టీ స్టాళ్లు, చాయ్‌వాలాలు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. రైల్వే స్టేషన్ల నుంచి నగరంలో వీధి మూలల వరకు పొగలు కక్కుతున్న టీ దుకాణాలు వెలిశాయి. విద్యార్థులు, కార్మికులు, ప్రయాణికులు ఇలా అందరూ ఆ దుకాణాల వద్ద నిల్చుని టీ టేస్ట్‌ చేసి వెళ్తుంటారు. భాష, మతం, ప్రాంతం వేరుగా ఉండే దేశంలో టీ అందరికీ కామన్‌ కనెక్షన్‌ అయింది. ఎందులోనూ సారూప్యత లేని ఇద్దరి వ్యక్తులు కలిసి హాయిగా టీని షేర్‌ చేసుకుంటారు.

విదేశాల్లో టీ చాలా సింపుల్‌ చైనా, జపాన్ వంటి దేశాలలో టీ కల్చర్‌ ఉంది. ఇక్కడ టీ ప్యూర్‌, ఫోకస్డ్‌గా ఉంటుంది. టీ ఆకుపైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. ప్యూట్‌ టీ టేస్ట్‌ చేయడానికి, కేలరీలు తగ్గించడానికి ప్రయారిటీ ఇస్తారు. అయితే బ్రిటిష్ వారు పాలు కలుపుతారు. కానీ చాలా తక్కువగా యాడ్‌ చేస్తారు. యూరప్ అంతటా టీ లైట్‌గా, ఎలిగెంట్‌గా ఉంటుంది. దీనికి విరుద్ధంగా భారతదేశం టీని బోల్డ్, సోషల్‌గా మార్చింది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.