నీతా అంబానీ వాడే టీ కప్పుల ఖరీదెంతో తెలుసా ?

అంబానీస్‌ ఇల్లంటే ఆ మాత్రం ఉంటుంది మరి. అంత ఖరీదైన ఇంట్లో ఫర్నీచర్‌, ఇంటీరియర్‌ కూడా ఖరీదైనవే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖేష్ అంబానీకి చెందిన ఇల్లు ఆంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. ఇంటి ప్రతి మూలను ప్రపంచ స్థాయికి తీర్చిదిద్దారు. అసమానమైన సౌకర్యాలతో అమర్చారు. వంటగది విషయంలో కూడా అంబానీ కుటుంబం రాజీపడలేదు. దశాబ్దంన్నర క్రితం ఆంటిలియాకు వెళ్లే ముందు నీతా అంబానీ వంటగదిని సిద్ధం చేయించారు. నీతా ప్రైవేట్ జెట్‌లో శ్రీలంకకు వెళ్లి మరీ వంటగదికి అవసరమైన పాత్రలను కొనుగోలు చేశారట. అందుకు ప్రత్యేక కారణం ఉంది. శతాబ్దాలకు పైగా సంప్రదాయం కలిగిన జపనీస్ పింగాణీ తయారీదారు నోరిటేక్ బ్రాండ్ నుండి ప్రత్యేకమైన ఉత్పత్తులను ఎంచుకోవడమే నీతా లక్ష్యం. నోరిటేక్ బ్రాండ్ 22 క్యారెట్ల బంగారం, ప్లాటినంతో తయారు చేసిన పింగాణీ పాత్రలకు ప్రసిద్ధి చెందింది. శ్రీలంక నుండి నీతా కొనుగోలు చేసిన టీ కప్పులు బంగారంతో తయారు చేయబడిన ప్రత్యేక డిజైన్లను కలిగి ఉన్నాయి. ఒక టీ కప్పు ధర దాదాపు 3600 డాలర్లు అంటే ఇండియన్‌ కరెన్సీలో రూ. 3 లక్షలకు పైమాటే. అలాంటి టీ కప్పులు ఉన్న సెట్‌ను నీతా రూ. 15 కోట్లకు పైగా ఖర్చు చేసి కొనుగోలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. వంటగదికి అవసరమైన టీ సెట్‌ను శ్రీలంక నుండి కొనుగోలు చేసి ప్రైవేట్ జెట్ ద్వారా ముంబైకి తీసుకువచ్చారు. ఆంటిలియా సమీపంలో నోరిటేక్ బ్రాండ్ స్టోర్ ఉన్నప్పటికీ, ధర వ్యత్యాసాన్ని పరిగణనలోకి తీసుకుని శ్రీలంక నుండి నేరుగా కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారట నీతా. నోరిటేక్ అతిపెద్ద తయారీ కేంద్రం శ్రీలంకలో ఉంది. బంగారం, ప్లాటినంతో అలంకరించిన 50 సెట్స్‌తో కలిగిన నోరిటేక్ డిన్నర్ సెట్ భారతదేశంలో కొనాలంటే 800 డాలర్ల నుంచి 2,000 డాలర్ల మధ్య ఖర్చవుతుంది. శ్రీలంక నుండి కొనుగోలు చేసినప్పుడు దాని ధర 300 డాలర్ల నుండి 500 డాలర్లు మాత్రమే. ఈ విధంగా నీతా తక్కువ ధరకు కొనుగోలు చేయగలిగారు. కుటుంబ సభ్యులతో పాటు ఆంటిలియాలో 600 మంది సిబ్బంది కూడా ఇక్కడ భోజనం వండుతారు. ఈ వంటగది అత్యాధునిక సాంకేతిక పరికరాలు, సాంప్రదాయ వంట పద్ధతుల కలయికతో అమర్చబడి ఉంది. శాఖాహార ఆహారాన్ని మాత్రమే తయారు చేసినప్పటికీ, భారతీయ, విదేశీ శైలులను అవలంబిస్తారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.