సంక్రాంతి వేళ ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ – విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అంతేకాకుండా మరికొన్ని రూట్లలోనూ స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్లు పేర్కొంది.
సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. ఓవైపు బస్టాండ్లలో… మరోవైపు రైల్వే స్టేషన్లలో రద్దీ కనిపిస్తోంది. సొంత ఊర్లకు వెళ్లేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రద్దీ పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం…. కొన్ని హైదరాబాద్ – విజయవాడ మధ్య నడవనున్నాయి. మరికొన్ని హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య సేవలు అందించనున్నాయి. పండగకు ముందు, తర్వాతి రోజుల్లో ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.
- హైదరాబాద్ – విజయవాడ మధ్య జనవరి 11, 12, 12,18, 19 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్స్ హైదరాబాద్ నుంచి ఉదయం 6.10 గంటలకు బయల్దేరి… మధ్యాహ్నం 1.40 గంటలకు విజయవాడకు చేరుకుంటాయి.
- ఇక విజయవాడ – హైదరాబాద్ మధ్య జనవరి 10,11,12,17,19 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ ట్రైన్స్ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.40 నిమిషాలకు బయల్దేరి.. రాత్రి 10.35 నిమిషాలకు హైదరాబాద్ కు చేరుకుంటాయి.
- హైదరాబాద్ – విజయవాడ మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, చర్లపల్లి, భువనగిరి, జనగాం, ఘన్ పూర్, కాజీపేట, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర స్టేషన్లలో ఆగుతాయి. జనరల్ సెకండ్ క్లాస్ బోగీలుంటాయి.
హైదరాబాద్ – కాగజ్ నగర్ మధ్య జనవరి 11, 12 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. ఈ ట్రైన్స్ హైదరాబాద్ నుంచి ఉదయం 7.55 నిమిషాలకు బయల్దేరి… మధ్యాహ్నం 2.15 నిమిషాలకు కాగజ్ నగర్ చేరుకుంటాయి.
కాగజ్ నగర్ – హైదరాబాద్ మధ్య జనవరి 10, 11 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. ఈ ట్రైన్స్ మధ్యాహ్నం 3.15 నిమిషాలకు బయల్దేరి… రాత్రి 10.20 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటాయి.
ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్,చర్లపల్లి, భువనగిరి, ఆలేరు, ఘన్ పూర్, కాజీపేట, ఉప్పల్, ఓదేల, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో జననరల్ సెకండ్ క్లాస్ బోగీలుంటాయి. ఈ సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటన ద్వారా కోరారు.

































