రైల్వే ప్రయాణికులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కల నెరవేరింది. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును (Sleeper train) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi ) శనివారం ప్రారంభించారు.
రైలు టైమింగ్స్, వివరాలు
ఈ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న వేగవంతమైన రైలు అయిన సరైఘాట్ ఎక్స్ప్రెస్ కంటే ఈ వందే భారత్ స్లీపర్ రైలు సుమారు 3 గంటల తక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకుంటుంది. (Sleeper train) హౌరా నుంచి గౌహతి మధ్య ఉన్న 958 కిలోమీటర్ల దూరాన్ని ఈ వందే భారత్ స్లీపర్ కేవలం 14 గంటల్లోనే కవర్ చేస్తుంది. ఈ వందే భారత్ స్లీపర్ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ ప్రస్తుతం 130 కిలోమీటర్ల వేగంతోనే నడపనున్నారు.
సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు హౌరాలో బయలుదేరనున్న ఈ వందే భారత్ స్లీపర్ రైలు మరుసటి రోజు ఉదయం 8 గంటల 20 నిమిషాలకు కామాఖ్య స్టేషన్కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కామాఖ్యలో సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటల 15 నిమిషాలకు హౌరాకు చేరుకుంటుంది. హౌరా నుంచి గురువారం తప్ప మిగిలిన 6 రోజులు కామాఖ్య నుంచి బుధవారం తప్ప మిగిలిన 6 రోజులు ఈ వందే భారత్ స్లీపర్ రైలు నడుస్తుంది.



































