వారానికి ఐదు రోజుల పని దినాలను వెంటనే అమలు చేయాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు ఒక రోజు సమ్మె చేపట్టారు. 12వ వేతన సవరణ సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం అమల్లోకి తేవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
సమ్మె లో భాగంగా విజయవాడ ధర్నా చౌక్ లో ధర్నా చేపట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో కీలక పాత్ర పోషిస్తున్నామని అంటున్న బ్యాంకు ఉద్యోగులు.

































