SBI Equity Scheme: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్బీఐ ఎంఎఫ్ తీసుకొచ్చిన ఓ స్కీమ్ అదరగొట్టింది. గడిచిన 10 సంవత్సరాల కాలంలో సగటు వార్షిక రాబడి 20 శాతానికి పైగా అందించింది. సాధారణంగా 12- 16 శాతం వరకు అంచనా వేయవచ్చు. కానీ, ఈ స్కీమ్ అంచనాలను మంచి రాబడులు అందించింది. అదే ఎస్బీఐ కాంట్రా ఫండ్. ఇందలో రూ. 10 లక్షలు జమ చేస్తే ఎంతొచ్చింది అనేది ఇప్పుడే తెలుసుకుందాం.
SBI Equity Scheme: స్టాక్ మార్కెట్లు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో హైరిటర్న్స్ అందుకోవచ్చు అని చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. అయితే అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. సరైన సమయంలో సరైన స్టాక్ లేదా సరైన మ్యూచువల్ ఫండ్ ఎంచుకుని దీర్ఘకాలం పాటు ఓపికతో పెట్టుబడి పెట్టగలిగిన వారికే హైరిటర్న్స్ అందుతుంటాయి. స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్న క్రమంలో ఇటీవలి కాలంలో చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ వైపు మళ్లుతున్నారు. ఈక్విటీ ఫండ్స్లో చాలా రకాల ఫండ్స్ హైరిటర్న్స్ ఇచ్చాయి.దీంతో ఇన్వెస్టర్లు ఆకర్షితమవుతున్నారు. అలా హైరిటర్న్స్ ఇచ్చిన ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ (SBI Mutual Fund) స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి మార్కెట్లోకి లాంచ్ అయిన ఎస్బీఐ కాంట్రా ఫండ్ (SBI Contra Fund) ఊహించని విధంగా హైరిటర్న్స్ ఇచ్చింది. గడిచిన 3 ఏళ్ల కాలంలో ఈ ఫండ్ వార్షిక రాబడి (CAGR) రేటు 21.31 శాతంగా ఉంది. అలాగే గత 5 సంవత్సరాల్లో ఈ ఫండ్ సగటు రాబడి 21.85 శాతంగా ఉంది. అలాగే గత 10 సంవత్సరాల రాబడులు చూసుకుంటే ఏడాదికి 18.94 శాతం చొప్పున అందించింది. ఈ ఫండ్ను 2013, జనవరిలో లాంచ్ చేశారు. ఇందులో హైరిస్క్ ఉంటుందని ఇన్వెస్టర్లు గమనించాలి. ఫిబ్రవరి 16, 2026 నాటికి ఈ ఫండ్ సైజ్ రూ.48,729.33 కోట్లుగా ఉంది. ఇందులో కనీస సిప్ పెట్టుబడి విలువ రూ.500గా ఉంది.
రూ.10 లక్షలకు 10 ఏళ్లలో ఎంతొచ్చింది?
ఎస్బీఐ కాంట్రా ఫండ్ డైరెక్ట్ ప్లాన్ హైరిటర్న్స్ అందించింది.సాధారణంగా ఈక్విటీ ఫండ్స్లో సగటు రాబడి 12-15 వరకు అంచనా వేస్తారు. కానీ ఈ ఫండ్ గత 10 సంవత్సరాల్లో ఏకంగా 18.94 శాతం వార్షిక రిటర్న్స్ ఇచ్చింది. 10 సంవత్సరాల క్రితం ఈ స్కీమ్లో రూ.10 లక్షలు ఒకేసారి లంప్ సమ్ విధానంలో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. మీరు ఇప్పటి వరకు కొనసాగితే ఏడాదికి 18.94 శాతం చొప్పున రాబడి మీ కార్పస్కి జమ అవుతుంది. ఇక్కడ మీకు వచ్చే వడ్డీపై వడ్డీ జనరేట్ అవుతుంది. దీంతో 10 ఏళ్ల తర్వాత మీ చేతికి రూ.56,66,000 వరకు వస్తాయి. అంటే మీ పెట్టుబడిపై వడ్డీనే రూ.46.66 లక్షల వరకు వస్తుంది.
ఈ కథనం సమాచారం ఇచ్చేందుకే. మ్యూచువల్ ఫండ్స్లోనూ హైరిస్క్ ఉంటుంది. మార్కెట్ ఒడుదొడుకులకు స్కీమ్స్ లోనవుతుంటాయి. అలాగే గతంలో వచ్చిన రిటర్న్స్ భవిష్యత్తులో వస్తాయని కచ్చితంగా చెప్పలేం. సరైన స్కీమ్ ఎంచుకుని ఓపికతో కొనసాగిన వారికే మంచి లాభాలు అందుకునే అవకాశం ఉంటుంది.



































