ఆర్థిక అవసరాలు ఎప్పుడు, ఏ రూపంలో తలుపు తడతాయో ఎవరూ చెప్పలేరు. ఇంటి శుభకార్యాలు, పిల్లల చదువులు లేదా అనుకోని అనారోగ్యం.. కారణం ఏదైనా కావచ్చు. ఇలాంటి సమయాల్లో ప్లేస్టోర్లోని నకిలీ లోన్ యాప్ల ఉచ్చులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కంటే, నమ్మకమైన బ్యాంకును ఆశ్రయించడం మేలు.
అందుకే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్ల కోసం ఒక అద్భుతమైన లోన్ ఆఫర్ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. లక్షల రూపాయల పర్సనల్ లోన్ మీ ఖాతాలోకి వచ్చేలా ఈ ప్రక్రియను సరళతరం చేసింది.
ఎస్బీఐ తీసుకొచ్చిన ఈ కొత్త పర్సనల్ లోన్ స్కీమ్ ప్రత్యేకత ఏంటంటే, ఎటువంటి ఆస్తులను తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు (Collateral-free). మీ అర్హతను బట్టి కనీసం రూ. లక్ష నుంచి గరిష్టంగా రూ. 50 లక్షల వరకు భారీ మొత్తాన్ని లోన్గా పొందవచ్చు. వడ్డీ రేట్లు కూడా ప్రైవేట్ యాప్లతో పోలిస్తే చాలా తక్కువగా అంటే 10.05 శాతం నుంచే ప్రారంభమవుతున్నాయి. ఈ అప్పును తీర్చడానికి బ్యాంకు మీకు 6 నెలల నుంచి 7 ఏళ్ల వరకు సుదీర్ఘ గడువును ఇస్తోంది. ఒకవేళ మీకు ఇప్పటికే ఒక లోన్ ఉన్నా, అవసరమైతే రెండోసారి (Top-up) కూడా లోన్ తీసుకునే ఛాన్స్ ఉండటం గమనార్హం.
ఎవరు అర్హులు? జీతం ఎంత ఉండాలి?
ఈ రుణం ప్రధానంగా స్థిరమైన ఆదాయం ఉన్న ఉద్యోగుల కోసం రూపొందించబడింది.
అర్హత: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, డిఫెన్స్, రైల్వేస్ మరియు గుర్తింపు పొందిన కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వారు.
జీతం: ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం రూ. 20,000, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు రూ. 25,000 నెలవారీ వేతనం ఉండాలి.
సర్వీస్: ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం 6 నెలలు, ప్రైవేట్ ఉద్యోగులకు 12 నెలల పని అనుభవం ఉండాలి.
వయసు: 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండి, మంచి క్రెడిట్ స్కోర్ (CIBIL) ఉండటం తప్పనిసరి. ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్నవారికి ఈ ప్రక్రియ మరింత వేగంగా పూర్తవుతుంది.
ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు & డాక్యుమెంట్స్
సాధారణంగా లోన్ అంటే డాక్యుమెంట్ల మోత ఉంటుంది. కానీ ఇక్కడ ఆధార్, పాన్ కార్డ్, గత ఆరు నెలల పే స్లిప్స్ మరియు బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటే సరిపోతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. డిఫెన్స్ ఎంప్లాయీస్కు మరియు ప్లాటినం ప్యాకేజీ ఉన్నవారికి ప్రాసెసింగ్ ఫీజు పూర్తిగా మాఫీ చేశారు. మిగిలిన వారికి కూడా వారి క్రెడిట్ స్కోర్ను బట్టి ఫీజులో 50 శాతం వరకు రాయితీ లభిస్తోంది. అతి తక్కువ పేపర్ వర్క్ ఉండటంతో లోన్ మంజూరు కూడా మెరుపు వేగంతో జరుగుతుంది.
లోన్ పొందడం ఇప్పుడు చాలా ఈజీ!
బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ఎస్బీఐ మూడు సులభమైన మార్గాలను కల్పించింది:
మిస్డ్ కాల్: మీ ఫోన్ నుండి 7208933142 నంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు, బ్యాంక్ ప్రతినిధులే మీకు కాల్ చేసి లోన్ వివరాలు సేకరిస్తారు.
SMS: మీ మొబైల్ నుండి ‘PERSONAL’ అని టైప్ చేసి 7208933145 నంబర్కు సందేశం పంపవచ్చు.
టోల్ ఫ్రీ: మరిన్ని వివరాల కోసం 1800 1234 నంబర్కు నేరుగా కాల్ చేయవచ్చు. ఇవే కాకుండా యోనో (YONO) యాప్ లేదా ఎస్బీఐ వెబ్సైట్ ద్వారా కూడా నిమిషాల్లో అప్లై చేసుకోవచ్చు.




































