ఎందుకంటే పన్ను ఎగవేతను ఆపడం, వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడం కోసం అదాయపు పన్ను శాఖ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుటోంది. మీ పాన్ కార్డు ఆధార్ తో లింక్ చేయకుండా దాన్ని ఉపయోగిస్తున్నట్టయితే.. మీరు అనేక ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలపై జరిమానా చెల్లించాల్సి రావచ్చు. వీటిలో బ్యాంకు ఖాతాను తెరవడం, బ్యాంకింగ్ వ్యవహారాలు నిర్వహించడం, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం, ఆస్తిని కొనుగోలు చేయడం, రుణం కోసం దరఖాస్తు చేసుకోవడం, ఆదాయపు పన్ను రిటర్న్లను దాఖలు చేయడం వంటి సందర్భాల్లో మీకు భారీ ఫైన్ పడే అవకాశం ఉంది. ఈ అన్ని సందర్భాల్లో నిష్క్రియాత్మక పాన్ను ఉపయోగిస్తే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272B కింద ప్రతి లావాదేవీకి రూ. 10వేల వరకు జరిమానా విధించవచ్చు. ప్రభుత్వం ఇప్పటికే ఆధార్తో పాన్ను లింక్ చేయడం తప్పనిసరి చేసింది. నిర్ణీత గడువులోపు ఇది చేయకపోతే ఆ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. దీనివల్ల ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు నిర్వహించలేరు. అలాగే, ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్నవారిపై కూడా ఆదాయ పన్నుశాఖ నిఘా ఉంచింది. చెల్లుబాటు లేని పాన్లను ఉపయోగించి చేసిన లావాదేవీలను తక్షణమే గుర్తించడానికి ఆదాయపు పన్ను శాఖ ఇప్పుడు AI, డేటా విశ్లేషణలను ఉపయోగించడం ప్రారంభించింది. ఇది మోసగాళ్లను గుర్తించడమే కాకుండా, తప్పుడు ఆదాయపు పన్ను రిటర్న్లు, నకిలీ రీఫండ్ క్లెయిమ్లు, పెద్ద లావాదేవీలను కూడా నివారిస్తుంది. ఇంకా పాన్ను ఆధార్తో లింక్ చేయని వారు వెంటనే దీన్ని చేయాలి. ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ వెబ్సైట్ ద్వారా దీన్ని ఆన్లైన్లో చేయవచ్చు. ఇది చేయకపోతే, పాన్ను సస్పెండ్ చేయవచ్చు. బ్యాంక్, డీమ్యాట్ ఖాతాలను స్తంభింపజేయవచ్చు. అలాగే పన్ను రిటర్న్లను దాఖలు చేయడం కూడా సాధ్యం కాదు.
Also Read
Education
- All
- Students
- Teachers
- School Apps - Web Links
- IMP GOs
- CSE Proceedings
- Softwares
- Applications and Forms
- Special Programmes in Schools
- Usefull Videos
- AP MDM
- FA and SA Exams
- Dpt .Tests
- 10th Class / SSC
- Lesson Plans
- Service Rules
- PRC Related
- Time Tables
- Grants
- Leave Rules
- Income Tax
- APGLI / ZPPF / GSI
- CFMS
- NT Books
- Trainings
More