AP Elections 2024: మరో సీనియర్ పోలీస్ అధికారిపై ఈసీ వేటు..

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లాలోని పలువురు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు కొనసాగుతోంది. ఇటీవల ఎస్పీ అన్బురాజన్‌ను బదిలీ చేసిన ఈసీ.. తాజాగా అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై వేటు వేసింది. తక్షణమే విధుల నుంచి రిలీవ్‌ కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎన్నికల బాధ్యతలు అప్పగించొద్దని ఉన్నతాధికారులను ఆదేశించింది. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

వైకాపాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అన్బురాజన్‌ను ఈసీ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో అమిత్‌ బర్దర్‌ను నియమించింది. మరోవైపు అనంతపురం అర్బన్‌ డీఎస్పీగా టి.వి.వి ప్రతాప్‌ కుమార్‌ను, రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ ఎన్నికల సంఘం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *