AP Elections 2024: సీఎం జగన్ కుట్రను భగ్నం చేసిన ఎన్నికల కమిషన్.. డబ్బులు ఎక్కడ జగన్

అమరావతి: అంతన్నారు.. ఇంతన్నారు… ఎన్నికలు కొద్ది రోజుల ముందు తెగ హడావిడి చేశారు. సంక్షేమానికి తానే అంబాసిడర్ అన్నట్లు గొప్పలు చెప్పుకునే జగన్ రెడ్డి (CM Jagan) తాము డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాలు గడవు అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. 10వతేదీ రాత్రికే డబ్బులు ఇవ్వాలన్నట్లు హడావిడి చేశారు. ఎన్నికల కోడ్‌ (Election Code)కు ముందు సంక్షేమ పథకాల (Welfare schemes) బటన్ (Button) నొక్కి.. సరిగ్గా ఎన్నికలు జరిగే సమయంలో లబ్దిదారుల ఖాతాల్లో నగదు బదిలీ చేసి ఓటర్లకు గాలం వేద్దామనుకుంటే ఎన్నికల కమిషన్ (Election Commission) ఆ కుట్రను భగ్నం చేసింది.


సీన్ కట్ చేస్తే.. నిన్న (సోమవారం)తో ఎన్నికలు (Elections) అయిపోయాయి. 14వ తేదీన లబ్దదారుల ఖాతాలకు డీబీటీ (DBT) ద్వారా డబ్బులు విడుదల చేయవచ్చని ఈసీ చెప్పింది. అయినప్పటికీ ఇవ్పటి వరకు లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు పడలేదు. దీంతో ‘డబ్బులు ఎప్పుడు ఇస్తావ్ జగన్’ అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ 10వ తేదీ రాత్రికే డబ్బులు ఇవ్వాలంటూ హడావిడి చేసిన జగన్ ప్రభుత్వం కోర్టు (Court)లో లంచ్ మోషన్‌ (Lunch Motion)లో తెగ హడావిడి చేసింది. జనవరి 23న బటన్ నొక్కినప్పటికీ మే 10వ తేదీ వరకు నిధులు విడుదల చేయలేదు. ఆరు పథకాలకు ఎన్నికలకు ముందు నిధులు విడుదల చేసి రాజకీయ లబ్ది పొందాలని ప్రయత్నం చేసింది. అయితే జగన్ ప్రభుత్వం కుయుక్తులను ఎన్నికల కమిషన్ అడ్డుకుంది. 14వ తేదీన నిధులు విడుదల చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఆరు పథకాలకు సుమారు రూ. 14వేల కోట్లు జమ చేయాల్సి ఉన్నప్పటికీ జగన్ సర్కార్ (Jagan Govt.) నుంచి ఉలుకూ పలుకూ లేదు. దీంతో ప్రతిపక్షాలు, ప్రజలు జగన్ సర్కార్ తీరును ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు చేసిన హడావిడి అంతా ఉత్తిత్తిదేనా? అని దుమ్మెత్తి పోస్తున్నారు.