AP Elections: ఏపీ ఎన్నికల్లో గెలుపెవరిదో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తేల్చేశాయ్..!!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. పోలింగ్‌కు కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో చివరి అస్త్రాలు ఏమున్నాయా అని బయటికి తీసే పనిలో అధికార, ప్రతిపక్షాలు నిమగ్నమయ్యాయి. మరోవైపు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయడానికి ఉద్యోగులు కదం తొక్కుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

 

  • కూటమికే ఉద్యోగుల మొగ్గు.. వైసీపీ శ్రేణుల గుండెల్లో రైళ్లు!!
  • ఎన్టీఆర్‌ జిల్లాలో 4శాతం ఓట్లను ప్రభావితం చేయనున్న ఉద్యోగులు
  • కూటమివైపే ఉద్యోగుల మొగ్గు.. ఎండలో మండుతూనే ఓర్పుతో ఓటేశారు
  • రెండేళ్ల కిందటే ఉద్యోగుల అంతిమ నిర్ణయం, సమయం రావటంతో చూపించారు
  • ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్ల కుటుంబ సభ్యులతో పెరగనున్న శాతం

ఆంధ్రజ్యోతి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) పోస్టల్‌ బ్యాలెట్‌ (Postal Ballot) తొలిరోజునే ఉద్యోగులు కదం తొక్కడాన్ని గమనిస్తే వారు పూర్తిగా ఎటువైపు మొగ్గు చూపారన్నది నిగ్గు తేలుతోంది! టీడీపీ (Telugu Desam) కూటమికే ఉద్యోగులు బలంగా మొగ్గు చూపినట్టు కనిపిస్తోంది. ఉద్యోగులు తమ అంతరాత్మ సాక్షిగా నిర్ణయాత్మక తీర్పును వెలువరించబోతున్నారన్నది స్పష్టమౌతోంది. తమను రోడ్డున పడేసిన వైసీపీ ప్రభుత్వంపై (YSR Congress) ఉద్యోగులు రెండేళ్ల కిందటే మనసు విరిగిపోయి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓటుతో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని ఉద్యోగులు ఎన్నో సందర్భాల్లో చెబుతూ వచ్చారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రారంభం రోజునే ఉద్యోగులు కదం తొక్కటం కూటమికి లాభించబోతోందన్నది అర్ధమౌతోంది. ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా 3 రోజుల పాటు దాదాపుగా 20వేల మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 90శాతానికి పైగా టీడీపీ కూటమికే ఓట్లు వేసినట్టు అర్థమౌతోంది. ఈ లెక్కన చూస్తే ఉద్యోగుల్లో వైసీపీ ప్రభుత్వం పట్ల ఉన్న తీవ్ర వ్యతిరేకత అర్థమౌతోంది. ఉద్యోగులే కదా అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే వారి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఇదే వైఖరితో ఉండే అవకాశాలే ఎక్కువ.

Postal-Ballots.jpg

ఇదిగో లెక్కలివీ..!

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 17లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో 20వేల మంది ఉద్యోగులంటే 1.17 శాతం ఓటర్లే అనుకోవచ్చు. వారి కుటుంబ సభ్యులను కనీసం ఇద్దరిని కలుపుకుంటే 4శాతానికి పెరుగుతుంది. ఒక్క పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారానే 3శాతం ఓట్లను ఉద్యోగులు ప్రభావితం చేయగలుగుతున్నారంటే నేరుగా ప్రత్యక్ష ఎన్నికల్లో వినియోగించుకునే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పదవీ విరమణ చెందిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులుంటా రు. వీరే కాకుండా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ సీపీఎస్‌ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు వారి కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్‌ జిల్లావ్యాప్తంగా భారీగా ఉంటారు. కుటుంబ సభ్యులే కాకుండానే వీరంతా 15వేల మంది వరకు ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిపి 45వేల మంది అవుతారు.

YS-Jagan-Sabha.jpg

రైళ్లు పరిగెడుతున్నాయ్!

వీరంతా కలిపితే మరో 2.64 శాతం మంది ఉంటారు. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకున్న ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల 3శాతం, నాన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ అంటే ఈవీఎంల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే ఉద్యోగులు, కార్మికులు వారి కుటుంబ సభ్యులు కలిపి 2.64 శాతం మొత్తంగా 5.64 శాతం మేర ఉద్యోగులు ప్రభావితం చూపబోతున్నారన్నది స్పష్టంగా అర్థమౌతోంది. పోనీ మరో 1.64 శాతం కూడా తీసివేద్దాం. ఇలా చూసినా 4 శాతం మేర ఓట్లను ఎన్టీఆర్‌ జిల్లాలో ఉద్యోగులు ప్రభావితం చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. ప్రధాన పార్టీల మధ్య ఓట్ల శాతం పెద్దగా తేడా ఏమీ లేదు. దీన్ని బట్టి చూస్తే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 4 శాతం ఓట్లను ఆయా పార్టీలపై గణనీయమైన ప్రభావాన్ని చూపగలుగుతాయన్నది స్పష్టంగా అర్ధమౌతోంది. శనివారం జిల్లా వ్యాప్తంగా జరిగిన ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఎన్నికలకు కదంతొక్కిన ఉద్యోగులను చూసి వైసీపీ శ్రేణుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *