ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి.
మే 12 నుండి మే 20 వరకు జరిగిన ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో వేలాది మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://bie.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. అంతేగాక, ఫలితాలను మరింత సులభంగా తెలుసుకునేందుకు మనమిత్ర WhatsApp నెంబర్ 9552300009 ను కూడా ఉపయోగించవచ్చు. విద్యార్థులు ఫలితాలు చూసే ముందు తమ హాల్ టికెట్ నంబర్ ను సిద్ధంగా పెట్టుకోవాలని బోర్డు అధికారులు సూచిస్తున్నారు.