ఆంధ్రప్రదేశ్ ఎవరి కంట్రోల్ లో ఉంది ? చెయ్యి జారిపోయిందని సీరియస్, మాట వినకుంటే !

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు ఒకే విడతలో ఒకే రోజు జరగడంతో అన్ని పార్టీల నాయకులు పోలింగ్ ఫలితాలపై అనేక ఆశలు పెట్టుకున్నారు.


ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసి అధికారం దక్కించుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నించింది.

అయితే ఎన్నికలు పూర్తి అయిన తరువాత ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో రాజకీయ కక్షలతో దాడులు జరిగాయి. పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో జరిగిన సంఘటనలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గొడవల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయ్యింది. తాము ఎన్నిసార్లు హెచ్చరించినా అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని ఈసీ మండిపడింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెకరెట్రీ జవహర్ రెడ్డి, డీజీపీని ఢిల్లీకి పిలిపించుకున్న ఈసీ వివరణ కోరింది. ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన విరణతో ఈసీ అసహనం వ్యక్తం చేసిందని తెలిసింది. ఈ దెబ్బకు మీడియాతో మాట్లాడకుండా వెనుక గేటు నుంచి సీఎస్, డీజీపీ చిన్నగా జారుకున్నారు. ఇద్దరు అధికారులు ఇచ్చిన విరణతో ఎన్నికల అధికారులు అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. ఈ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈసీ సీరియస్ అయ్యింది.

ఈసీ దెబ్బకు ఆంధ్రప్రదేశ్ లోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల మీద వేటుపడింది. కొందరు అధికారులను బదిలి చెయ్యడంతో కొందరిని సస్పెండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెలరేగిన హింసకు వైసీపీ నాయకులకు కొమ్ముకాసిన అధికారులపై వేటు పడటంతో ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు చేస్తున్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఉలిక్కిపడ్డారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు తాము చెప్పినట్లు నడుచుకోవాలని ఆంధ్రప్రదేశ్ లోని అధికారులను ఈసీ హెచ్చరించిందని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టిన ఈసీ ఎప్పటికప్పుడు జిల్లా అధికారులు, ఎస్పీల నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నదని తెలిపింది, ప్రభుత్వ ఉద్యోగాల చేస్తున్న వారు ఉద్యోగుల్లా ఉండాలని, ఏ పార్టీ నాయకులకు కొమ్ముకాయకూడదని, నియమాలు ఉల్లంఘించి నాయకులు చెప్పినట్లు తల ఊపుకుంటూ వెళ్లి వారు చెప్పినట్లు చేస్తే పరిస్థితులు వేరుగా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఈసీ హెచ్చరించిందని తెలిసింది. ఆంధ్రప్రదేశ్ ను కంట్రోల్ లోకి తీసుకున్న ఈసీ ప్రత్యేక అధికారులతో ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నదని తెలిసింది.