BREAKING : తెలుగు తేజం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు భారత రత్న. మరో ఇద్దరు మాజీ ప్రధానులకు భారతరత్న.. ప్రకటించిన కేంద్రం

భారతమాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ ప్రకటించారు.
విశిష్ట పండితుడు మరియు రాజనీతిజ్ఞుడిగా, నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారని ప్రధాని మోడీ అన్నారు. ఏపీ సీఎంగా, కేంద్ర మంత్రిగా, అనేక సంవత్సరాల పాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన కృషిని దేశం గుర్తుంచుకుంటుందన్నారు.


భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని దూరదృష్టి గల నాయకత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. కాగా 1991 – 96 వరకు భారత ప్రధానిగా పీవీ నర్సింహారావు పనిచేశారు. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పీవీ నర్సింహారావు సేవలందించారు. పీవీ వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్. స్వామినాథన్ కు సైతం కేంద్రం భారత రత్న ప్రకటించింది.