Friday, September 20, 2024

White Hair: చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలా..? వీటిని అతిగా తీసుకోవడమే అందుకు కారణం.. అవేమిటంటే..?

White Hair: మారిన జీవనశైలి, ఉద్యోగ బాధ్యతలతో పెరిగిన ఒత్తిడి కారణంగా.. జుట్టు తెల్లబడడం, రాలడం, చుండ్రు అనేవి సర్వసాధారణ కేశ సమస్యలుగా మారాయి.
అయితే ఒత్తిడి లేకపోయినా లేదు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడితే అందుకు మనం తినే ఆహారమే ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. అవును, వృద్ధాప్యానికి సంకేతమైన తెల్ల జుట్టు మనం తినే ఆహారం కారణంగానే మొదలవుతుంది.

కొన్ని రకాల ఆహారాలను అతిగా తినడం వల్ల జుట్టు తెల్లబడుతుందని కేశ నిపుణులు చెబుతున్నారు. అంతేకాక ఆ ఆహారాలు జుట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కూడా వివరించారు. మరి ఏయే ఆహారాలను అతిగా తినడం వల్ల జుట్టు తెల్లబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కూల్ డ్రింక్స్: చిన్నవయసులోనే జుట్టు తెల్లబడడానికి కూల్ డ్రింక్స్ ఒక కారణం. ఎందుకంటే ఈ డ్రింక్స్‌లో ఎక్కువ మొత్తంలో ఉండే సోడా, చక్కెర.. జుట్టు పెరుగుదలకు అవసరమైన విటమిన్లను శరీరం తీసుకోకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా మీ జుట్టు త్వరగా తెల్లబడుతుంది.

చక్కెర: చక్కెర ఎక్కువగా ఉండే స్వీట్లు, ఇతర ఆహారాలను ఎక్కువగా తినేవారికి జుట్టు త్వరగా తెల్లబడుతుంది. చిన్నవారిలో కూడా వెంట్రుకలు వేగంగా తెల్లగా మారుతాయి. జుట్టు పెరుగుదలకు, నల్లబడేందుకు విటమిన్ ఇ ఎంతగానో అవసరం.

అయితే చక్కెర ఎక్కువగా తీసుకుంటే దాంతో శరీరం విటమిన్ ఇ ని గ్రహించలేదు. ఆ కారణంగా జుట్టు త్వరగా తెల్లగా అవుతుంది.

మోనోసోడియం గ్లూటమేట్: మోనోసోడియం గ్లూటమేట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తరచూ ఎక్కువగా తీసుకున్నా కూడా వెంట్రుకలు త్వరగా నెరుస్తాయి.

ఎందుకంటే ఈ మోనోసోడియం గ్లూటమేట్ మన శరీర మెటబాలిజం ప్రక్రియపై ప్రభావం చూపుతుంది. అంతేకాక జుట్టు సమస్యలను కూడా కలిగిస్తుంది.

ఉప్పు: ఉప్పు ఎక్కువగా తీసుకున్నా కూడా జుట్టు తెల్లబడుతుంది. ఉప్పును ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ద్రవాలు నియంత్రణ కోల్పోతాయి.

ఆ ప్రభావం జుట్టుపై కూడా పడుతుంది. ఉప్పులో ఉండే సోడియం శరీరంలో ఎక్కువగా చేరితే జుట్టు సమస్యలే కాదు, కిడ్నీ సమస్యలు కూడా వస్తాయి.

Tingling : చేతులు, కాళ్లలో వచ్చే తిమ్మిర్లను పోగొట్టే.. అద్భుతమైన చిట్కా..!

Tingling : మారిన ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా మనలో చాలా మంది అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ప్రతి ఇద్దరిలో ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.
నేటి తరుణంలో మనలో చాలా మంది అరికాళ్లు, అరి చేతుల్లో మంటలు, తిమ్మిర్లు, అలాగే కండరాలు పట్టుకుపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పెద్ద వారిలోనే కాకుండా నడి వయస్కుల్లో కూడా మనం సమస్యను గమనించవచ్చు. ఇటువంటి సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం రక్తనాళాలు బలహీనంగా మారడమే. రక్తనాళాలు బలహీనంగా మారిన చోట రక్తసరఫరా తగ్గుతుంది. రక్తసరఫరా తగ్గడం వల్ల వెంటనే ఆ ప్రదేశంలో తిమ్మిర్లు రావడం, సూదితో గుచ్చినట్టు ఉండడం, పట్టేసినట్టు ఉండడం జరుగుతుంది.
ఇటువంటి సమస్యలతో బాధపడే వారు ఒక చక్కటి ఆయుర్వేద చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడే వారు పాలతో గసగసాలను కలిపి తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. పాలల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. పాలను తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయి. క్యాల్షియం లోపం తలెత్తకుండా చేయడంలో, ఎముకలను ధృడంగా మార్చడంలో, మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో, శరీరాన్ని బలంగా, ధృడంగా మార్చడంలో ఇలా అనేక రకాలుగా పాలు మనకు దోహదపడతాయి. అలాగే గసగసాల్లో ఒమెగా 3, ఒమెగా 6, క్యాల్షియం, ఫైబర్, ప్రోటీన్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. గసగసాలను తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది.
గసగసాలను తీసుకోవడం వల్ల నిద్రలేమి, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు, తిమ్మిర్లు, వాపులు వంటి సమస్యలు తగ్గుతాయి. గసగసాల పాలను తీసుకోవడం వల్ల మతిమరుపు, రక్తపోటు, శరీరంలో బలహీనత వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ పాలను తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పాలను ఎలా తయారు చేసుకోవాలి.. ఎలా తీసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పాలను తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలు, ఒక టీ స్పూన్ గసగసాలు వేసి పాలను వేడి చేయాలి. ఈ పాలను ఒక పొంగు వచ్చే వరకు మరిగించిన తరువాత ఇందులో రుచి కొరకు ఒక టీ స్పూన్ పటిక బెల్లం పొడిని వేయాలి. పంచదారను మాత్రం ఉపయోగించకూడదు.

ఈ పాలను మరో నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పాలను పడుకోవడానికి అర గంట ముందు తాగి నిద్రపోవాలి. ఇలా ఈ పాలను తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, నరాలల్లో వాపులు, అరికాళ్లల్లో మంటలు, తిమ్మిర్లు వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఎముకలు, నరాలు బలంగా తయారవుతాయి. ఈ పాలను తాగడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. జీర్ణ సమస్యలు తగ్గు ముఖం పడతాయి. నిద్రలేమి సమస్య దూరమవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఈ విధంగా గసగసాల పాలను తాగడం వల్ల మనం అనేక రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు. చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు.

Fever In Kids : మీ పిల్లలకు తరచూ జ్వరం వస్తుందా.. ఈ సూచనలు పాటిస్తే ఇక జ్వరం రాదు..!

Fever In Kids : ప్రస్తుత కాలంలో చంటి పిల్లలు ఎక్కువగా తరుచూ జ్వరాలతో బాధపడుతున్నారు. వారిలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో తరుచూ జ్వరాల బారిన పడుతున్నారు.
జ్వరం వచ్చినప్పుడల్లా వారు రెండు నుండి మూడు కిలోల బరువు తగ్గిపోతున్నారు. జ్వరం నుండి కోలుకుని మరలా కొద్దిగా కండ పట్టేసరికి మరలా జ్వరం వచ్చి బలహీనంగా అయిపోతున్నారు. ఇలా జ్వరం వచ్చినప్పుడల్లా పిల్లలకు సరిగ్గా నిద్ర ఉండదు. వారి వల్ల తల్లి దండ్రులకు కూడా నిద్ర సరిగ్గా ఉండదు. అలాగే జ్వరం వచ్చినప్పుడల్లా వేలకు వేలకు ఖర్చు చేయాల్సి వస్తుంది. చాలా మంది పిల్లల్లో ఎన్ని మందులు వాడినప్పటికి ఇలా జ్వరం, జలుబు, దగ్గు వంటి ఇన్పెక్షన్ ల బారిన పడుతూనే ఉంటారు. అయితే జ్వరం వచ్చిన వెంటనే హాస్పిటల్ కు వెళ్లే అవసరం లేకుండా కొన్ని చిట్కాలను వాడడం వల్ల చాలా సులభంగా పిల్లల్లో వచ్చే జ్వరం, ఇన్పెక్షన్ లు తగ్గేలా చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పిల్లలకు జ్వరం వచ్చిన వెంటనే, వారికి కొద్దిగా నలతగా ఉన్న వెంటనే తల్లి దండ్రులు వెంటనే మందులు వేసేస్తూ ఉంటారు. ఇదే మనం చేసే అతి పెద్ద తప్పని నిపుణులు చెబుతున్నారు. అలాగే వారికి జ్వరం వచ్చినప్పుడు పాలు తాగాలి అనిపించదు. ఆహారం తీసుకోవాలని అనిపించదు. కానీ పిల్లలకు బలవంతంగా పాలు తాగించాలని, ఆహారం ఇవ్వాలని చూస్తూ ఉంటారు. ఇది మనం చేసే రెండు తప్పని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు జ్వరం, జలుబు, దగ్గు వంటి ఇన్పెక్షన్ లు రాగానే వెంటనే మందులు ఇవ్వకూడదు. చంటి పిల్లలకైనా సరే ఇలా వెంటనే మందులు ఇవ్వడం మంచి కాదు. అలాగే వారికి బలవంతంగా పాలు తాగించడానికి, ఆహారం ఇవ్వడానికి ప్రయత్నించవద్దు. వారికి ఆకలి వేసినప్పుడు వారే ఆహారాన్ని తీసుకుంటారు. ఇలా జ్వరం వచ్చినప్పుడు పాలకు బదులుగా కాచి చల్లార్చిన నీళ్లను తాగించడానికి ప్రయత్నం చేయాలి.
చాలా మంది చంటి పిల్లలకు, చిన్న పిల్లలకు నీటిని తాగించడం మంచిది కాదని భావిస్తూ ఉంటారు. కానీ ఇది అపోహ మాత్రమేనని చంటి పిల్లలకు, చిన్న పిల్లలకు నీటిని తాగించవచ్చని నీటిని తాగించడం వల్ల శరీరంలో డీటాక్సిఫికేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తల్లి పాలు తాగని పిల్లలకు విరోచనం సులభంగా అవ్వదు. అలాంటి పిల్లలకు నీటిని తాగించడం వల్ల విరోచనం సులభంగా అవుతుంది. కనుక పిల్లలకు నీటిని తాగించడం మంచిదే అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇలా జ్వరంతో బాధపడే పిల్లలకు కాచి చల్లార్చిన నీటిలో తేనె కలిపి రోజుకు 5 నుండి 6 సార్లు పట్టించాలి. ఇలా పాలు తాగించకుండా నీటిని తాగించడం వల్ల పొట్టకు ఎంతో హాయిగా ఉంటుంది. శరీరం దానంతట అదే యాంటీ బాడీస్ ను తయారు చేసుకుంటుంది.
శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ కు కారణమైన క్రిములను యాంటీ బాడీస్ నశింపజేస్తాయి. దీంతో 3రోజుల పాటు ఇబ్బందిపెట్టే జ్వరం కూడా ఒక్క రోజులో తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఒక రోజు పాటు లంకనం పెట్టడం వల్ల పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం, కఫం వంటి సమస్యల నుండి సత్వర ఫలితం కలుగుతుందని, అలాగే వారిలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

కేంద్రం నుంచి ఉచిత ఇల్లు.. ఇలా పొందండి

ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే గృహ నిర్మాణ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. 25, జూన్, 2015న ప్రారంభించింది. ఈ పథకం కింద ఇళ్లు లేని వారు..

ఇల్లు కట్టుకునేలా లేదా కొనుక్కునేలా ప్రయోజనాలు లభిస్తాయి. ఇందుకు కొన్ని అర్హతలు ఉండాలి. మీకు ఆ అర్హతలు ఉంటే, మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్దిదారుల జాబితాను rhreporting.nic.in పోర్టల్‌లో చూడవచ్చు. ఈ పథకం కోసం మీరు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

PMAY ప్రయోజనం ఏమిటి?

దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, సొంత ఇల్లు నిర్మించుకోలేని వారు, ఈ పథకం ద్వారా సొంత ఇల్లు నిర్మించుకోవచ్చు. ఇందుకోసం కొన్ని అర్హతలను నిర్ణయించారు. వాటిని పరిశీలిద్దాం.

PMAY కోసం అర్హతలు:
దరఖాస్తుదారు తప్పనిసరిగా కింది వాటిలో ఏదైనా అర్హత కలిగివుండాలి.

– ఇల్లు లేని కుటుంబం అయివుండాలి. ఒకటి లేదా రెండు గదులు, కచ్చా గోడలు, కచ్చా పైకప్పు ఉన్న కుటుంబాలు అప్లై చేసుకోవచ్చు.

– 25 ఏళ్లు పైబడిన అక్షరాస్యులు లేని కుటుంబం.

– 16 నుండి 59 సంవత్సరాల వయస్సులో వయోజన పురుష సభ్యుడు లేని కుటుంబం.

– 16, 59 సంవత్సరాల మధ్య వయోజన సభ్యులు లేని కుటుంబం.

– సామర్థ్యం ఉన్న సభ్యులు లేని కుటుంబాలు, వికలాంగ సభ్యులు ఉన్నవారు.

– భూమిలేని కుటుంబాలు, సాధారణ కూలీల ద్వారా ఆదాయం పొందుతున్నవారు.

– షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతరులు, మైనారిటీలు.

దరఖాస్తుదారు ఈ కింది అర్హతలను కూడా కలిగి ఉండాలి:

– దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ నివాసి అయి ఉండాలి.

– దరఖాస్తుదారుకు శాశ్వత ఇల్లు ఉండకూడదు.

– దరఖాస్తుదారు తప్పనిసరిగా 18 సంవత్సరాల వయస్సు పరిమితిని దాటి ఉండాలి.

– దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయం రూ.03 లక్షల నుంచి రూ.06 లక్షల మధ్య ఉండాలి.

– దరఖాస్తుదారుడి పేరు రేషన్ కార్డు లేదా బిపిఎల్ జాబితాలో ఉండాలి.

– దరఖాస్తుదారు ఓటరు జాబితాలో తన పేరును కలిగి ఉండటం తప్పనిసరి. అలాగే ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు కలిగి ఉండాలి.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన యొక్క అవసరమైన పత్రాలు:

మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలనుకుంటే, మీరు ఈ కింది పత్రాలను కలిగి ఉండాలి.

– ఆధార్ కార్డ్ లేదా ఆధార్ నంబర్

– మీ ఫొటో
– లబ్ధిదారుని జాబ్ కార్డ్ లేదా జాబ్ కార్డ్ నంబర్

– బ్యాంకు పాస్ బుక్

– స్వచ్ఛ భారత్ మిషన్ (SBM) నమోదు సంఖ్య

– మొబైల్ నంబర్

PMAY కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కోసం ఇంటి దగ్గరే, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేకపోతే, మీరు ఏదైనా ప్రజా సేవా కేంద్రానికీ లేదా మీసేవా కేంద్రానికీ లేదా బ్లాక్ లేదా గ్రామ అధిపతి దగ్గరకు వెళ్లి పైన ఇచ్చిన అన్ని పత్రాలతో వెళ్లవచ్చు. మీరు హౌసింగ్ స్కీమ్ అసిస్టెంట్‌కి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ ప్రక్రియ కింది విధంగా ఉంటుంది.
ముందుగా మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్‌సైట్‌ (https://pmaymis.gov.in)ను సందర్శించాలి. ఆ తరువాత, వెబ్‌సైట్ యొక్క ప్రధాన పేజీ మీ ముందు ఓపెన్ అవుతుంది. అందులో మీరు మెనూ బార్‌లో ఉన్న మూడు పైలను చూస్తారు, దానిపై క్లిక్ చేయండి, ఆపై కొన్ని ఆప్షన్లు జాబితా రూపంలో మీ ముందు కనిపిస్తాయి. వాటిలో మీరు “Awaassoft”పై క్లిక్ చేయాలి, ఆ తర్వాత మరొక జాబితా ఓపెన్ అవుతుంది. అందులో మీరు “డేటా ఎంట్రీ”పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత, ఒక పేజీ మీ ముందు ఓపెన్ అవుతుంది. అందులో మీరు “DATA ENTRY FOR AWAAS”ను ఎంచుకోవాలి.

అప్పుడు మీరు మీ రాష్ట్రం, జిల్లాను ఎంచుకుని, “కొనసాగించు” బటన్‌పై క్లిక్ చేయాలి.
ఆపై మీ వినియోగదారు పేరు, పాస్‌వర్డ్, క్యాప్చా (captcha)ను నమోదు చేసి, “లాగిన్” బటన్‌పై క్లిక్ చేయండి.

ఆ తర్వాత “బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫారం” మీ ముందు ఓపెన్ అవుతుంది.
అందులో మీరు మొదటి విభాగంలో మీ “వ్యక్తిగత వివరాల”కి సంబంధించిన సమాచారాన్ని పూరించాలి.

అప్పుడు మీరు రెండవ విభాగంలో “బెనిఫిషియరీ బ్యాంక్ ఖాతా వివరాలు” పూరించాలి.

తర్వాత మూడవ విభాగంలో మీరు జాబ్ కార్డ్ నంబర్, స్వచ్ఛ్ భారత్ మిషన్ రిజిస్ట్రేషన్ నంబర్ (SBM నంబర్) వంటి “బెనిఫిషియరీ కన్వర్జెన్స్ వివరాల” సమాచారం నమోదు చేయాలి.

బ్లాక్ ద్వారా పూరించే నాల్గవ విభాగంలో, మీరు “కన్సర్న్ ఆఫీస్ ద్వారా పూరించిన వివరాలు”కి సంబంధించిన సమాచారాన్ని పూరించాలి.

ఈ విధంగా మీరు బ్లాక్ లేదా పబ్లిక్ సర్వీస్ సెంటర్ ద్వారా ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా PM ఆవాస్ యోజన ఫారమ్‌ను పూరించవచ్చు. ఆ తర్వాత లబ్దిదారుల జాబితాను rhreporting.nic.in పోర్టల్‌లో చూడవచ్చు.

Saunf Seeds Benefits: సోంపు గింజలతో సులువుగా బరువు తగ్గండి ఇలా !

Saunf For Weight Loss: జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం అధిక బరువు సమస్య బారిన పడుతున్నారు. అంతేకాకుండా ఈ సమస్య నుంచి బయట పడడానికి అనేక రకాల మందులను వాడుతున్నారు.
అయితే ఈ సమస్య నుంచి బయట పడాలి అనుకుంటే ఈ చిట్కాను పాటించడం వల్ల సహజంగా బరువును తగ్గించుకోవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గడంలో సోంపు గింజలు సహాయపడతాయి. సోంపు గింజలను మనం ఎక్కువగా ఆహారం తరువాత తీసుకుంటాము. సోంపు గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడంతో పాటు మనం చాలా సులభంగా బరువు కూడా తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు సోంపు గింజలను వాడడం చాలా సులభం.

సోంపు గింజలతో చేసిన కాషయం తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు సోంపు గింజలను ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ సోంపు గింజలను వేసి నానబెట్టాలి. ఈ నీటిని సోంపుతో సహా గిన్నెలో పోసి మరిగించాలి. ఈ నీళ్లు మరిగించిన తరువాత దీనిని గ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచాలి. ఈ కషాయం గోరు వెచ్చగా అయిన తరువాత ఇందులో నిమ్మరసం వేసి కలపాలి.

ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. వంటల్లో నూనెను తక్కువగా ఉపయోగించాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఈ విధంగా సోంపు గింజల నీటిని తాగడం వల్ల మనం చాలా సులభంగా బరువు తగ్గవచ్చు. సోంపు గింజల నీటిని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

Joint Pains:కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులను తగ్గించే ఈ పండును అసలు మిస్ చేసుకోవద్దు

Pomelo Fruit Benefits In telugu : మొక్కలు అనేవి ప్రకృతి ప్రసాదించిన వరం. సీజనల్ గా దొరికే పండ్లను తింటూ ఆ సీజన్ లో వచ్చే ఆరోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు.
అలా ఈ సీజన్ లో దొరికే సిట్రస్ జాతికి చెందిన పంపర పనస పండులో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పులుపు, వగరు, తీపి రుచుల కలయికతో ఉండే ఈ పండు రెండు రంగుల్లో ఉంటుంది. దానిమ్మ గింజల రంగు తొనలు లేదా తెల్లని తొనలు ఉంటాయి. ఈ పండును మహిళలు ప్రతి రోజు తింటే వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకలకు సంబందించిన సమస్యలు ఏమి రావు. ముఖ్యంగా అస్థియో ఫ్లోరోసిస్, కీళ్ల నొప్పులు వంటివి రాకుండా ఉంటాయి.

డయబెటిస్ ఉన్నవారికి ఈ పండు ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. అధిక బరువు తగ్గటానికి, కాలేయ సమస్యలు లేకుండా కాలేయం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. శరీరం అంతా రక్త ప్రసరణ బాగా జరిగేలా చేయటమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంచేలా చేసి గుండెకు సంబందించిన సమస్యలను తగ్గిస్తుంది.
జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడూ పంపర పనస తోనలను తింటే కేవలం 5 నిమిషాల్లోనే కడుపు ఉబ్బరం తగ్గిపోతుంది. పంపర పనసను జ్యూస్ రూపంలోను, సలాడ్ రూపంలోను తీసుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్..ఎల్లుండి డబ్బులు జమ !

ఏపీలోని డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. YSR ఆసరా పథకం నిధుల విడుదల తేదీ ఖరారు అయింది. ఈ నెల 23న అనంతపురం జిల్లా ఉరవకొండలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారు.
2019 ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళల పేరుతో బ్యాంకుల్లో రూ.25,570.80 కోట్ల అప్పు ఉంది.

ysr asara scheme amount release date
ఇప్పటివరకు నాలుగు విడతల్లో రూ.19,175.97 కోట్లు చెల్లించిన జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం…. మిగిలిన రూ.6394.83 కోట్లను 78 లక్షల మంది ఖాతాల్లో జమ చేయనుంది. ఈ నెలాఖరు వరకు ఆసరా ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించనుంది. దీంతో ఏపీలోని డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Cyber fraud: సైబర్ ఫ్రాడ్ జరిగిందా?ఈ నెంబర్ కు కాల్ చేస్తే మీ డబ్బు తిరిగి మీ అకౌంట్ లోకి!

ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. ముఖ్యమైన లావాదేవీలు బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా జరుగుతున్నాయి. బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా లక్షల రూపాయల విలువైన లావాదేవీలు కూడా సులభంగా చేయవచ్చు.
అయితే, ఇది సైబర్ నేరాల ప్రమాదాన్ని కూడా పెంచింది. వ్యక్తులు తప్పుడు లింక్‌పై క్లిక్ చేయడం లేదా తప్పుడు యాప్‌ను డౌన్‌లోడ్ చేయడం వల్ల వారి ఖాతా నుండి మరొక ఖాతాకు డబ్బు బదిలీ చేయబడే ఇలాంటి కేసులు ప్రతిరోజూ వెలుగులోకి వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతి పౌరుడు తెలుసుకోవలసిన నంబర్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) జారీ చేసింది.

ఈ నెంబర్‌ కి కాల్ చేసి సైబర్ నేరాలను నమోదు చేయండి

మీరు ఎప్పుడైనా సైబర్ నేరాలకు గురైనట్లయితే, వెంటనే 1930 నెంబర్‌కు డయల్ చేయండి. మీ UPI ID లేదా బ్యాంక్ ఖాతా లింక్ చేయబడిన నంబర్ నుండి ఈ నెంబర్‌కు కాల్ చేయండి. ఈ నంబర్ సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్, మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కి లింక్ చేయబడింది. ఈ నెంబర్‌కు కాల్ చేయడం ద్వారా మీరు మోసానికి సంబంధించిన సమాచారం కోసం అడగబడతారు. ఇక్కడ ఎవరూ మిమ్మల్ని ATM పిన్ లేదా నెట్ బ్యాంకింగ్ వంటి వివరాలను అడగరని గుర్తుంచుకోండి. అలాగే, అటువంటి సున్నితమైన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు. మీరు పేరు, చిరునామా, మోసం చేసిన విధానం,సమయం వంటి సమాచారాన్ని మాత్రమే అందించాలి.

ఈ నెంబర్‌కు కాల్ చేసిన తర్వాత, మీ ఫిర్యాదుపై తక్షణ చర్య తీసుకోబడుతుంది. మీ ఖాతా నుండి విత్‌డ్రా అయిన డబ్బును తిరిగి పొందేందుకు కృషి చేయబడుతుంది. ఈ నంబర్ MHA యొక్క టోల్ ఫ్రీ నంబర్, సైబర్ క్రైమ్ యొక్క ఫిర్యాదును ఏ సమయంలో అయినా దానిపై నమోదు చేయవచ్చు.

మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ టెక్నిక్ ట్రై చేయండి..

Find Fake Sim Card: మారుతోన్న కాలానికి అనుగుణంగా నేరాలు కూడా మారుతున్నాయి. పెరిగిన సాంకేతికతో పాటు నేరాల తీరు కూడా మారిపోయింది. ఇంటర్నెట్ వినియోగం పెరిగినప్పటి నుంచి సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం రోజుల్లో ప్రతీ పనికి ఆధార్ కార్డును ఉపయోగిస్తున్నాం. మరి మన ఆధార్‌ను ఎవరైనా ఉపయోగించుకొని సిమ్ కార్డ్ తీసుకుంటే ఎలా.? ఇలా తీసుకున్న సిమ్ కార్డును ఏదైనా అసాంఘిక కార్యక్రమానికి ఉపయోగిస్తే మీరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది. ఈ తరుణంలో మీ ఐడీపై ఎవరైనా సిమ్ కార్డ్ తీసుకున్నారో తెలుసుకోవాలనుకుంటున్నారా. మీ పేరుపై ఎన్ని సిమ్‌కార్డులు ఉన్నాయో తెలుసుకోవడానికి కేంద్ర టెలికాం సంస్థ ఒక ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

కొన్ని సింపుల్ స్టెప్స్‌తో మీ పేరుపై ఏవైనా ఫేక్ సిమ్స్ ఉన్నాయో ఇలా చెక్ చేసుకోండి..

* ఇందుకోసం ముందుంగా https://tafcop.dgtelecom.gov.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* అనంతరం ఓపెన్ అయిన పేజీలో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి అనే బాక్స్ ఉంటుంది.

* మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన గెట్ ఓటీపీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

* మొబైల్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయగానే మీ పేరు మీద యాక్టివ్‌గా ఉన్న మొబైల్ నెంబర్లు కనిపిస్తాయి.

* సదరు నెంబర్లలో మీకు అవసరం లేకపోయినా, తెలియని నెంబర్ ఏదైనా ఉన్నా.. దానిపై క్లిక్ చేసి నెంబర్ బ్లాక్ చేయాలి.

* ఇలా చేయగానే మీ మొబైల్ నెంబర్‌కు రిక్వెస్ట్ ఐడీ వెళుతుంది.

* రిక్వెస్ట్‌ను ట్రాక్ చేసుకోవడానికి భవిష్యత్తులో ఈ ఐడీ ఉయోగపడుతుంది.

https://tafcop.dgtelecom.gov.in/

Clock Vastu Tips: ఇంట్లో గోడ గడియారం ఈ దిక్కున పెట్టకండి.. తర్వాత చాలా బాధపడుతారు..!

Clock Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువు దాని దిశలో ఉండాలి. లేదంటే కుటుంబంలో చాలా సమస్యలు మొదలవుతాయి. ఇంట్లో గోడ గడియారాన్ని చాలామంది ఇష్టమొచ్చిన దిశలో పెడుతారు.
దీనివల్ల నెగిటివ్‌ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. గడియారానికి సంబంధించిన వాస్తు పద్దతులు కచ్చితంగా పాటించాలి. ఎందుకంటే గడియారం సమయాన్ని తెలుపుతుంది. దీనివల్ల సకాలంలో పనులు జరుగుతాయి.

నేటి కాలంలో ప్రతి చేతిలో మొబైల్ ఉంటుంది. దీని ద్వారా సమయం తెలుసుకోవచ్చు. కానీ పూర్వం ఇంట్లో గడియారం ఉండటాన్ని స్టేటస్ సింబల్‌గా భావించేవారు. లెక్క ప్రకారం ప్రతి ఇంట్లో ఒక గడియారం ఉండాలి. దీనివల్ల అన్ని పనులను సకాలంలో ప్రారంభించవచ్చు అలాగే పూర్తి చేయవచ్చు. అయితే దీనిని గోడకు వేలాడదీసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. ఈ రోజు గడియారం నియమాలను తెలుసుకుందాం.

మీరు ఇంట్లో గోడ గడియారాన్ని తప్పు దిశలో ఇన్స్టాల్ చేయకూడదు. లేదంటే అది మీ దురదృష్టానికి కారణం అవుతుంది. వాస్తు ప్రకారం.. ఇంట్లో వస్తువులను సరైన స్థలంలో ఉంచకపోతే అవి నెగిటివ్‌ ఎనర్జీని ప్రసరిస్తాయి. ఇది ఆ ఇంట్లో నివసించే ప్రజలందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. గోడ గడియారాన్ని ఇంట్లో సరైన దిశలో ఉంచినట్లయితే అది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ ఉంటుంది.

వాస్తు ప్రకారం ఇల్లు లేదా కార్యాలయం దక్షిణ గోడపై గడియారాన్ని ఉంచకూడదు. ఎందుకంటే హిందూ గ్రంధాల ప్రకారం దక్షిణ దిశను మృత్యుదేవత దిశగా పరిగణిస్తారు. వ్యాపార స్థలంలో ఈ దిశలో గడియారాన్ని ఉంచడం వల్ల అడ్డంకులు రావడం మొదలవుతాయి. పురోగతి ఆగిపోతుందని నమ్ముతారు. అదేవిధంగా ఇంటి దక్షిణ గోడపై గడియారాన్ని ఉంచడం అక్కడ నివసించే ప్రజలపై నెగిటివ్‌ ప్రభావం చూపుతుంది. దక్షిణం వైపు కాకుండా ఇంటి ప్రధాన ద్వారం పైన కూడా గడియారాన్ని పెట్టకూడదు. వాస్తు ప్రకారం గడియారాన్ని తలుపు పైన ఉంచకూడదు. ఆగిపోయిన విరిగిపోయిన గడియారాలను ఇంట్లో నుంచి తీసివేయాలి.

10th,ITI సర్టిఫికేట్ ఉంటే చాలు..పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగం..వెంటనే అప్లయ్ చేసుకోండి

భారతీయ రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. జైపూర్‌లోని నార్త్ వెస్ట్రన్ రైల్వేలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC)1646 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 10 నుంచి ప్రారంభమైంది. అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 10,2024. మీరు కూడా ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకుంటే, క్రింద ఇవ్వబడిన అన్ని ముఖ్యమైన అంశాలను జాగ్రత్తగా చదవండి.

పోస్టుల వివరాలు

మొత్తం ఖాళీలు: 1646

డివిజన్ల వారీగా ఖాళీలు

1) డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం(DRM), అజ్మీర్: 402

ట్రేడుల వారీగాఖాళీలు..

ఎలక్ట్రికల్(కోచింగ్)- 30
ఎలక్ట్రికల్ (పవర్)- 30

ఎలక్ట్రికల్(TRD)- 40

కార్పెంటర్ (ఇంజినీర్)- 25

పెయింటర్ (ఇంజినీర్)- 20

మేసన్ (ఇంజినీర్)- 30

పైప్ ఫిట్టర్ (ఇంజినీర్)- 20

ఫిట్టర్ (C&W)- 50

కార్పెంటర్ (మెకానిక్)- 25

డీజిల్ మెకానిక్- 132

2) డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం(DRM), బికనీర్: 424
ట్రేడుల వారీగాఖాళీలు

ఫిట్టర్ (మెకానికల్)- 190

పవర్ (ఎలక్ట్రీషియన్)- 69

ఎలక్ట్రీషియన్ (కోచింగ్)- 89

ఎలక్ట్రీషియన్(TRD)- 54

వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)(ఇంజినీర్)- 19

వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)(మెకానిక్)- 03

3) డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం(DRM), జైపూర్‌ డివిజన్: 488

ట్రేడుల వారీగాఖాళీలు..
మెకానికల్(ఫిట్టర్)- 274

S & T(ఎలక్ట్రానిక్స్ మెకానిక్)- 85

ఎలక్ట్రికల్/జి(ఎలక్ట్రీషియన్)- 88

ఎలక్ట్రికల్(TRD)(ఎలక్ట్రీషియన్)- 41

4) డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయం(DRM), జోధ్‌పూర్ డివిజన్: 67

ట్రేడుల వారీగాఖాళీలు..

డీజిల్ మెకానికల్- 25

C&W- 21

ఎలక్ట్రికల్/ AC- 06

ఎలక్ట్రికల్/TL- 06
ఎలక్ట్రికల్- 09

5) బీటీసీ క్యారేజ్, అజ్మీర్: 113

ట్రేడుల వారీగాఖాళీలు..

పెయింటర్- 25

ఫిట్టర్- 45

వెల్డర్- 18

ఎలక్ట్రీషియన్- 25

6) బీటీసీ లోకో, అజ్మీర్: 56

ట్రేడుల వారీగాఖాళీలు..

డీజిల్ మెకానిక్- 11
ఫిట్టర్ – 15

వెల్డర్ – 30

7) క్యారేజ్ వర్క్ షాప్, బికనీర్: 29

ట్రేడుల వారీగాఖాళీలు..

ఫిట్టర్ – 13

వెల్డర్- 08

ఎలక్ట్రీషియన్- 08

8) క్యారేజ్ వర్క్ షాప్, జోధ్‌పూర్: 67

ట్రేడుల వారీగాఖాళీలు..

ఫిట్టర్ – 28
కార్పెంటర్ – 15

వెల్డర్(G & E)- 08

పెయింటర్(జనరల్)- 08

మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్- 05

మెషినిస్ట్- 03

దరఖాస్తు రుసుము

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అన్ని కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము – రూ 100. అయితే SC/ST, (PWBD), మహిళలకు దరఖాస్తు రుసుము లేదు

Vitamin D: శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? విటమిన్ డీ లోపం ఉన్నట్లే.. అవేంటో తెలుసుకోండి

Benefits Of Vitamin D: బలమైన ఎముకలు, ఆరోగ్యవంతమైన దంతాల కోసం శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. విటమిన్ డి లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

విటమిన్ డి లోపం వల్ల శరీరంలో కనిపించే లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. విటమిన్ డి లోపాన్ని సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవడంలో సహాయపడతాయి. విటమిన్ డి ఇతర విటమిన్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇది హార్మోన్ (Vitamin D Deficiency) గా పనిచేస్తుంది. ఇది మన శరీరానికి చాలా ముఖ్యం. ఇది శరీరంలో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం మొదలైనవాటిని గ్రహించడంలో సహాయపడుతుంది. సూర్యరశ్మి విటమిన్ డికి మంచి మూలం. విటమిన్ డి లోపాన్ని తీర్చడానికి, మీరు అవకాడో, చికెన్, వేరుశెనగలు, వెన్న లాంటివి తీసుకోవాలి. విటమిన్ డి లోపం వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం
అలసట..
సరైన ఆహారం తీసుకోకపోయినా, తగినంత నిద్రపోయినా చాలా మందికి అలసటగా అనిపిస్తుంది. దీనికి కారణం శరీరంలో విటమిన్ డి తగినంతగా లేకపోవడం. విటమిన్ డి లోపం వల్ల చాలా అలసట వస్తుంది. దీనిని విస్మరించడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలాంటి పరిస్థితిలో విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. దీంతో శక్తి స్థాయిలను మెరుగుపడతాయి. లేకపోతే వైద్యుడిని సంప్రదించడం మేలు.
ఎముకలు – కండరాల నొప్పి
విటమిన్ డి ఎముకలను దృఢంగా చేస్తుంది. శరీరంలో కాల్షియం ఉత్పత్తికి విటమిన్ డి అవసరం. విటమిన్ డి లేకపోవడం వల్ల శరీరానికి తగినంత కాల్షియం అందదు. దీని వల్ల ఎముకలు, కండరాల్లో నొప్పి సమస్య ఉంటుంది. కొన్నిసార్లు వెన్ను లేదా కండరాలలో నొప్పి ఉంటుంది. ఇవి విటమిన్ డి లోపం లక్షణాలు కావచ్చు.
టెన్షన్
విటమిన్ డి లోపం కారణంగా.. మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. విటమిన్ డి తక్కువగా ఉన్న మహిళలు తరచుగా ఒత్తిడికి గురవుతారు. సూర్యకాంతి మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మెదడులో సెరోటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇది మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుందని అధ్యయనంలో తెలింది.
బలహీన రోగనిరోధక శక్తి
విటమిన్ డి మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చుతుంది. ఇది వైరస్లు, బ్యాక్టీరియా నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. మీరు తరచుగా అనారోగ్యానికి గురైనా జలుబు లేదా ఫ్లూ వంటి సమస్యను ఎదుర్కొంటే విటమిన్ డి లోపం ఒక లక్షణం కావచ్చు. ప్రతి సీజనల్ మార్పు మీ శరీరంపై ప్రభావం చూపుతుంది.

14 Days No Sugar: వరుసగా 14 రోజుల పాటు అసలు పంచదార వాడకాన్ని బంద్ చేస్తే.. ఈ డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలివీ..

14 Days No Sugar: వరుసగా 14 రోజుల పాటు అసలు పంచదార వాడకాన్ని బంద్ చేస్తే.. ఈ డాక్టర్ చెప్పిన షాకింగ్ నిజాలివీ..

ఉదయాన్నే వేడి వేడి టీ, లేదా కాఫీతో రోజును మొదలుపెడతాం. చిక్కని టీలో సరిపడా పాలు, డికాషన్, చక్కెర సమపాళ్ళలో ఉంటే నోటికి రుచేకాదు. మనసుకు హాయికూడా..
ఇందులో ఏది తగ్గినా చక్కని టీ తాగిన ఫీలింగ్ పోతుంది. ముఖ్యంగా టీలో చక్కెర తగ్గితే మాత్రం నోటికి రుచిగా అనిపించదు. తియ్యటి ఏ తీపి పదార్థం తిన్నా బెల్లంకన్నా చక్కెర ఉండాల్సిందే. కూరలలో ఉప్పు ఎంత ముఖ్యమో.. తీపి పదార్థాలు అనగానే పంచదార ఉండి తీరాల్సిందే. బెల్లం కన్నా పంచదారతో చేసే స్వీట్స్ ని ఇష్టంగా తింటూ ఉంటాం. అయితే మితిమీరిన చక్కెర వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చిపడతాయి.

చక్కెర మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. దీనిని టీ నుండి స్వీట్ల వరకు ఉపయోగిస్తున్నాం. అది లేకుండా రుచి చప్పగా అనిపిస్తుంది. చక్కెర ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్నాం. ఈ చక్కెర వాడకం వల్ల మధుమేహం, ఊబకాయం, దంతాల నష్టం వంటి అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ వినియోగంలో ఎలాంటి మార్పూ రాలేదు. ఎక్కువ చక్కెర తినడం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కాలేయ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. విషయం తెలుసుకుని చక్కెర వాడకం తగ్గించుకుంటే అది శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది తెలుసుకుందాం.

14 రోజులు చక్కెరను వాడటం తగ్గిస్తే అది శరీరం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూద్దాం.

శరీరంపై చక్కెర ప్రభావం గురించి పోషకాహార నిపుణురాలు న్మామి అగర్వాల్ ఇలా చెప్పారు. 14 రోజుల పాటు, చక్కెరను వాడటం మానేస్తే, దాని ఫలితాలు శరీరంలో చూడవచ్చు. చక్కెర లేనప్పుడు, మన శరీరం రక్తంలో చక్కెర స్థాయిని మరింత ప్రభావవంతంగా నియంత్రించడం ప్రారంభిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. వాపును తగ్గిస్తుంది.

How To Make Curd: కేవలం 15 నిమిషాల్లో పెరుగు తయారు చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..

How To Make Curd: కేవలం 15 నిమిషాల్లో పెరుగు తయారు చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి..

పెరుగు జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది ఆరోగ్య నిపుణులు వేసవిలో తప్పనిసరిగా పెరుగు, మజ్జిగ తినాలని కూడా సిఫార్సు చేస్తున్నారు. అయితే, రాత్రిపూట పెరుగు తినటం నివారించాలంటున్నారు.
ఎందుకంటే ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ సీజన్‌లో పాల కంటే పెరుగుకు డిమాండ్ పెరుగుతుంది. పెరుగు, మజ్జిగ, లస్సీ రూపంలో తప్పక తీసుకుంటారు. అయితే, మార్కెట్‌లో లభించే పెరుగు కల్తీ ఉండే అవకాశం లేకపోలేదు. అందుకే పెరుగును ఇంట్లోనే తయారు చేసుకుంటారు. అయితే, పెరుగు తయారుచేసే సాంప్రదాయ పద్ధతులు చాలా మందికి తెలుసు. కానీ, తక్కువ సమయంలో పెరుగు ఎలా తయారు చేయాలో చాలా మందికి తెలియదు. అలాంటి వారికోసమే ఈ సమాచారం. కేవలం 15 నిమిషాల్లో పెరుగును తయారుచేసే సులువైన మార్గం ఉంది. ఈ ట్రిక్‌తో పెరుగు స్టోర్‌లో లాగానే క్రీమీగా మారుతుంది. మీకు నమ్మకం లేకుంటే మీరూ ఒకసారి ప్రయత్నించి చూడండి.

మీరు పెరుగును చిక్కగా, క్రీమీగా చేయాలనుకుంటే, నాణ్యమైన పాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో పెరుగు చేయడానికి ఎప్పుడూ మీగడ పాలు మాత్రమే కొనండి. అందులో నీళ్లు అస్సలు కలపకూడదు. సూపర్‌ మార్కెట్‌లో దొరికినట్టుగానే ఉండే పెరుగు తయారు చేయడానికి పాలను బాగా మరిగించండి . ఇక నిమిషాల్లో పెరుగు తయారు చేయాలంటే.. కొన్ని ప్రత్యేక వస్తువులు కూడా అవసరం. అది అల్యూమినియం ఫాయిల్ , స్టీల్ బౌల్, దేశీ పుల్లని పెరుగు కావాలి.

తక్కువ సమయంలో పెరుగు తయారు చేయడానికి, ఒక స్టీల్ గిన్నెలో గోరువెచ్చని పాలు పోసి, దానికి 2-3 చెంచాల పెరుగును కలపాలి. ఆ తర్వాత చెంచా లేదంటే హ్యాండ్ బ్లెండర్‌తో బాగా కలపాలి. మనం వేసిన పెరుగు ఆ పాలల్లో పూర్తిగా కరిగిపోయేలా చూసుకోండి. ఇప్పుడు ఈ గిన్నెను ఫాయిల్ పేపర్‌తో పూర్తిగా కప్పేయాలి. ఆ తర్వాత ఒక పాత్రలో నీటిని గ్యాస్‌పై మరిగించాలి. తర్వాత అందులో స్టీల్ స్టాండ్ వేసి దానిపై పుల్లటి పెరుగు కలిపిన పాలను ఉంచాలి. దానిని పై మూతపెట్టి గ్యాస్ మంటను తగ్గించండి . మీకు 15 నిమిషాల్లోనే పెరుగు సిద్ధమవుతుంది.
15 నిమిషాల్లో సెట్ అయ్యే పెరుగు చిక్కగా, క్రీమీగా ఉంటుంది. కానీ, ఇది చాలా పుల్లగా ఉండదు. అలాంటప్పుడు మీరు తీపి పెరుగును ఇష్టపడితే, మీరు వెంటనే తినెయొచ్చు.. అయితే సరిగ్గా పులుపు కావాలంటే గిన్నెలోని రేకు తీయకుండా క్యాస్రోల్‌లో ఉంచి మూత పెట్టాలి. దానిని మందపాటి టవల్‌లో చుట్టి, ఎవరూ కదిలించకుండా ఉండేలా ఓ మూలలో ఉంచండి. 2-3 గంటల తర్వాత అది చక్కటి చిక్కటి గడ్డ పెరుగుగా మారుతుంది.

స్మోకింగ్స్‌ బిస్కెట్స్‌లో పొగ ఎక్కడి నుంచి వస్తుంది.? వీటిని ఎలా తయారు చేస్తారో తెలుసా.?

Smoking biscuts స్మోకింగ్స్‌ బిస్కెట్స్‌లో పొగ ఎక్కడి నుంచి వస్తుంది.? వీటిని ఎలా తయారు చేస్తారో తెలుసా.?

స్మోకింగ్ బిస్కెట్స్. ఈ మాట ఈ మధ్యకాలంలో చాలా వినిపిస్తుంది. షాపింగ్ మాల్స్ లో, ఫుడ్ కోర్టులలో, ఫంక్షన్ హాల్ లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. మామూలు బిస్కెట్లు అయినా తింటున్నప్పుడు అందులోంచి విపరీతమైన పొగ వస్తుంది.
సరదాగా ఆ స్మోక్ కోసం పిల్లలు పెద్దలు అంతా ఈ స్మోక్ బిస్కెట్స్ తింటున్నారు. స్మోక్ బిస్కెట్స్ తో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం రీల్స్ చేసుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది.

అసలు ఈ పొగ ఎక్కడి నుంచి వస్తుంది. ఈ స్మోక్ బిస్కెట్ ఎలా తయారు చేస్తారో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. లిక్విడ్ నైట్రోజన్ బిస్కెట్స్ మీద వేయడం ద్వారా ఈ పొగ వస్తుంది. ఒకరకంగా ఇది డ్రై ఐస్ లాంటిది. నైట్రోజన్ని 1000 డిగ్రీల వద్ద కంప్రెస్ చేయడం ద్వారా లిక్విడ్ నైట్రోజన్ తయారవుతుంది. ఇది బిస్కెట్స్ మీద వేయడం ద్వారా కొద్దిసేపు నోట్లోంచి పొగ ధారాళంగా వస్తూనే ఉంటుంది. బిస్కెట్స్‌ను నములుతున్నంత సేపు పొగ రావడానికి ప్రధాన కారణం ఇదే. అయితే ఇదంగా బాగానే ఉన్నా అసలు ఈ పొగ వాళ్ల ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదం ఉంటుందా.? అసలు ఈ బిస్కెట్స్‌ ఆరోగ్యానికి ఎంత వరకు సేఫ్‌ అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సిగరెట్ తాగితే వచ్చేలా వస్తున్న ఈ పొగ సిగరెట్ కంటే డేంజర్. అయ్యో.. ఒక్కసారికే అంత డేంజర అని అనుకుంటున్నారా.. అవును ఈ పొగ కడుపులోకి వెళ్లడం ద్వారా గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి. మనకు తెలియకుండానే పేగులలో ఒక చల్లదనాన్ని ఏర్పరిచి పొరలాగా ఉండిపోతుంది. చిన్నపిల్లలకైతే ఇది ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం ద్వారా కూడా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి స్మోక్‌ బిస్కెట్స్‌ని కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారు కూడా. మనదేశంలో మాత్రం దీనిపైన పెద్దగా ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కచ్చితంగా ఈ స్మోక్ బిస్కెట్స్ తింటున్నప్పుడు ఎంతో కొంత పొగ ఊపిరితిత్తుల్లోకి, కడుపులోకి వెళ్తుంది. లోపలి భాగాన్ని చాలా సెన్సిటివ్గా అతి చల్లదనంలోకి తీసుకెళ్తుంది. దీనివల్ల దీర్ఘకాలిక రోగాలతో పాటు గ్యాస్టిక్ సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు పదేపదే ఈ స్మోకింగ్ బిస్కెట్స్ తినడం వల్ల నోటి లోపల సెన్సిటివిటీ కోల్పోతారు అనేది వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Old Smartphone: పాత స్మార్ట్‌ఫోన్‌ను పక్కన పడేయకండి.. ఇలా క్యాష్‌ చేసుకోండి..!


Old Smartphone
: కొంతమంది తరచుగా ఫోన్లు మారుస్తుంటారు. మార్కెట్‌లోకి ఏది కొత్తగా వస్తే దానిని కొనుగోలు చేస్తారు. ఈ సమయంలో పాతవాటిని పక్కన పడేస్తుంటారు.
ఇలాంటి తప్పు చేయకుండా వాటిద్వారా ఎంతోకొంత మనీ సంపాదించే అవకాశం ఉంది. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ సమాచారం తెలుసుకుంటే సులువుగా మనీ సంపాదిస్తారు. పాత స్మార్ట్‌ఫోన్ ఏ విధంగా అమ్మాలో ఈ రోజు తెలుసుకుందాం.

ఈ వెబ్‌సైట్‌ని సందర్శించండి

ఇంట్లో ఉండే పాత స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించాలంటే Cashify.com గొప్ప ఎంపికని చెప్పవచ్చు. అయితే ఇందులో ఫోన్‌కు బదులుగా నగదు మాత్రమే చెల్లిస్తారు. ఈ పరిస్థితిలో ఎంతో కొంత డబ్బు అందుతుంది. కానీ దానికి ముందు మీరు అనుసరించాల్సిన చిన్న ప్రక్రియ ఉంటుంది. దీనిని అనుసరించడం వల్ల పాత స్మార్ట్‌ఫోన్లను సులువుగా అమ్మవచ్చు.

పాత ఫోన్‌ విక్రయించే ప్రక్రియ
ముందుగా మీరు Cashify.com వెబ్‌సైట్‌కి వెళ్లి లొకేషన్ ఇవ్వాలి. తర్వాత అందులో మీ స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను వెతకాలి. అది కనిపించిన వెంటనే ఎంతకు అమ్మవచ్చో తెలుస్తుంది. ఈ మొత్తాన్ని అంగీకరించిన తర్వాత స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ వర్కింగ్ కండిషన్‌లో ఉందా లేదా, స్మార్ట్ ఫోన్ నుంచి కాల్స్ చేయగలరా లేదా అనే సమాచారాన్ని అందివ్వాలి. చివరగా స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న లోపాలు, స్మార్ట్‌ఫోన్ వయస్సును చెప్పాలి. తర్వాత మొబైల్ నంబర్, ఈ మెయిల్ ఐడిని ఎంటర్‌ చేయాలి. ఈ ప్రక్రియను పూర్తి చేసిన వెంటనే మీ స్మార్ట్‌ఫోన్ కోసం ఇవ్వాల్సిన మొత్తం స్క్రీన్‌పై కనిపిస్తుంది.

బాబోయ్.. స్మార్ట్‌ ఫోన్‌ల మొబైల్ కవర్‌ల కింద డబ్బులు దాస్తే ఇంత ప్రమాదమా?

Mobile back cover: బాబోయ్.. స్మార్ట్‌ ఫోన్‌ల మొబైల్ కవర్‌ల కింద డబ్బులు దాస్తే ఇంత ప్రమాదమా?

స్మార్ట్‌ఫోన్ లేకుండా క్షణం కూడా గడపలేని రోజులు వచ్చేశాయి. ప్రస్తుతం జేబులో వాలెట్ పెట్టుకోవడమన్నా మర్చిపోతామేమో గానీ వెంట ఫోన్ తీసుకెళ్లడం మాత్రం అస్సలు మర్చిపోం.
ఈ క్రమంలో జనాలు స్మార్ట్‌ ఫోన్లను డబ్బులు దాచుకునే పర్సులుగా కూడా వాడేస్తున్నారు. చాలా మంది తమ స్మార్ట్‌ఫోన్‌లకున్న బ్యాక్ కవర్ కింద పదో పరకో దాచుకోవడం చూస్తూనే ఉంటాం(Keeping money in mobile back cover). అత్యవసరం సమయాల్లో డబ్బులు ఉంటాయని కొందరు ఇలా చేస్తే మరికొందరు మాత్రం తమకు తీపి గుర్తులుగా మిగిలిన నోట్లు ఇలా స్మార్ట్‌ఫోన్ల వెనకాల దాస్తుంటారు. అయితే, ఇలాంటి అలవాటు ఉన్నవారు తక్షణమే ఆ పని మానుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్‌లో కూడా మైక్రోప్రాసెసర్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. స్మార్ట్‌ఫోన్ వేగంగా పనిచేయాలంటే ఇది చాలా కీలకం. ఈ క్రమంలో మైక్రోప్రాసెసర్లు బోలెడంత ఉష్ణాన్ని విడుదల చేస్తాయి. ఈ వేడితో అంతిమంగా మైక్రోప్రాసెసర్లకే ప్రమాదం కాబట్టి ఉష్ణం సెల్‌ఫోన్ నుంచి త్వరగా బయటకు వెళ్లేలా అందులో అనేక ఏర్పాట్లు ఉంటాయి. వీటికి అడ్డంకులు సృష్టిస్తే స్మార్ట్‌ఫోన్‌ల ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి చివరకు అవి పేలిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

స్మార్ట్‌ఫోన్ల వెనకాల దాచుకునే కరెన్సీ నోట్లు సరిగ్గా ఇలాంటి ప్రమాదాన్నే తెచ్చిపెడతాయి. వేడి బయటకు వేళ్లేమార్గం లేకపోవడంతో స్మార్ట్‌ఫోన్లలో వేడి(smartphone temparatures) పతాకస్థాయికి చేరుకుని అవి పేలిపోవచ్చని(Explosion) హెచ్చరిస్తున్నారు. కరెన్సీ తయారీలో రకరకాల రసాయనాలు వాడతారు కాబట్టి ఇలాంటి పేలుళ్లకు అవకాశాలు మరింత ఎక్కువనేది నిపుణులు అభిప్రాయం. కాబట్టి, ఇలాంటి అలవాటు ఉన్న వారు తక్షణం తమ పంథా మార్చుకోవాలని సూచిస్తున్నారు.

కాంగ్రెస్‌లో చేరడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన YS షర్మిల

న తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా నియామకమైన షర్మిల..

రేపు అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ వెళ్లి ఇడుపులపాయలోని తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ఆమె నివాళులు అర్పించి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్న నేపథ్యంలో తన తండ్రి ఆశీస్సులు తీసుకునేందుకు వచ్చానని తెలిపారు.

కాంగ్రెస్ అన్న, పార్టీ సిద్ధాంతాలన్న తన తండ్రి వైఎస్‌కు ఎంతో ఇష్టమని.. అందుకే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం తాను పని చేస్తానని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం తన తండ్రి కళ అని.. అది నేరవేరే వరకు పోరాటం చేస్తానని షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. తనను నమ్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించిన హై కమాండ్‌కు ఈ సందర్భంగా ఆమె మరోసారి ధన్యవాదాలు తెలిపారు. కాగా, ఇటీవల తన వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన షర్మిల.. ఆమె సైతం హస్తం గూటికీ చేరిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్‌లో చేరిన షర్మిలకు అధిష్టానం కీలక పోస్ట్ కట్టబెట్టింది. త్వరలోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్‌కు కాంగ్రెస్ చీఫ్‌గా నియమించింది. షర్మిల నేతృత్వంలో ఎన్నికల పోరుకు బరిలోకి దిగాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. ఈ నేపథ్యంలో సోదరుడు, సీఎం జగన్‌ను షర్మిల ఎలా ఢీకొడుతుందని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అన్న, చెల్లెల పోరుతో పాటు.. మరోవైపు టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగుతుండటంతో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌ ఎన్నికలకు ముందే కాకరేపుతున్నాయి.

పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే చాలు…మోదీ ప్రభుత్వం అందిస్తున్న రూ. 10 లక్షలు మీ సొంతం..ఎలాగంటే..?

పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే చాలు…మోదీ ప్రభుత్వం అందిస్తున్న రూ. 10 లక్షలు మీ సొంతం..ఎలాగంటే..?

సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఎదురయ్యే మొదటి సవాలు పెట్టుబడి. ముఖ్యంగా బ్యాంకు నుంచి రుణం పొందాలంటే చాలా డాక్యుమెంట్లు కావాలి. దీంతో పాటు అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే రుణం పొందడానికి కొన్ని తనఖా పెట్టడానికి ఆస్తులు కూడా అవసరం. ఇంత చేసినా తక్కువ వడ్డీకి రుణం అందడం దాదాపు అనుమానమే.

ఇలాంటి పరిస్థితుల్లో సొంత వ్యాపారం చేసుకోవాలని కలలు కనే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై)ని అమలులోకి తెచ్చింది. ఈ పథకం ద్వారా మీరు తక్కువ వడ్డీ, రిస్క్ ఫ్రీ లోన్ పొందవచ్చు. దీని ద్వారా మీరు వ్యాపారవేత్తగా కూడా మారవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ ముద్ర రుణ పథకాన్ని ఏప్రిల్ 2015లో ప్రారంభించింది. ఈ పథకం కింద 3 రకాల రుణాలు ఉన్నాయి. మొదటి కేటగిరీ శిశు లోన్ స్కీమ్, రెండవది కిషోర్ లోన్, మూడవది తరుణ్ లోన్.
ఈ పథకం కింద ప్రభుత్వం వ్యాపారం ప్రారంభించడానికి రూ.50 వేల నుండి రూ.10 లక్షల వరకు రుణాలు అందిస్తుంది. తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే భారతీయ పౌరుడు ఎవరైనా PMMY కింద రుణం తీసుకోవచ్చు. అలాగే ఈ లోన్ తీసుకునేటప్పుడు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ఎలాంటి ఆస్తిని తనఖా పెట్టాల్సిన అవసరం లేదు.

మీరు ఎంత రుణం తీసుకోవచ్చు?
శిశు లోన్ : శిశు రుణం కింద రూ. 50,000 వరకు రుణాలు ఇస్తారు.
కిషోర్ లోన్ : కిషోర్ లోన్ కింద, రూ. 50,000 నుండి రూ. 5 లక్షల వరకు రుణాలు అందించబడతాయి.
తరుణ్ లోన్ : తరుణ్ సాలా కింద రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రుణాలు ఇస్తారు.
ముద్రా లోన్ తిరిగి చెల్లించే కాలం ఎంత ?
ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద తీసుకున్న రుణాలను 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలలోపు అంటే 36 నెలల నుండి 60 నెలల లోపు తిరిగి చెల్లించాలి. వ్యక్తిగత రుణ గ్రహీత ఆర్థిక స్థితి, రుణ మొత్తం మొదలైనవాటిని పరిశీలించిన తర్వాత ఇది నిర్ణయించబడుతుంది.

ముద్రా పథకం కింద రుణం పొందేందుకు అర్హత ఏమిటి ?
24 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల మధ్య ఉన్న ఎవరైనా ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, KYC సర్టిఫికేట్ , ఓటర్ ఐడి వంటి పత్రాలను కలిగి ఉండాలి. నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ అందించే మైక్రో యూనిట్లకు క్రెడిట్ గ్యారెంటీ కింద ముద్ర పథకం కింద లోన్ గ్యారెంటీ అందిస్తారు. 5 సంవత్సరాల పాటు వారంటీ కవర్ అందుబాటులో ఉంది. అందువల్ల ముద్రా పథకం కింద రుణాలకు గరిష్ట కాలపరిమితి 60 నెలలుగా నిర్ణయించారు.

ముద్ర లోన్ కోసం ఎలా అప్లై చేయాలి ?
>> https://www.mudra.org.in/ వెబ్‌సైట్ నుండి రుణ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి .
>> శిశు లోన్ ఫారమ్ భిన్నంగా ఉంటుంది, తరుణ్ , కిషోర్ రుణం ఒకే రూపంలో ఉంటుంది.
>> రుణ దరఖాస్తు ఫారమ్‌లో మొత్తం సమాచారాన్ని పూరించండి.
>> సరైన మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, పేరు, చిరునామా మొదలైనవి అందించండి.
>> మీరు మీ వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంభించాలనుకుంటున్నారు అనే దాని గురించి సమాచారాన్ని అందించండి.
>> OBC, SC/ST కేటగిరీల కిందకు వచ్చే దరఖాస్తుదారులు తమ కుల ధృవీకరణ పత్రాన్ని అందజేస్తారు.
>> 2 పాస్‌పోర్ట్ ఫోటోలను అందించండి.
>> ఫారమ్‌ను పూరించిన తర్వాత, ఏదైనా ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంక్‌కి వెళ్లి అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేయండి.
>> బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ మీ నుండి వ్యాపారం గురించి సమాచారాన్ని పొందుతారు. దాని ఆధారంగా ముద్రా పథకం కింద రుణం మంజూరు చేస్తారు.

ముద్రా లోన్ కోసం అవసరమైన పత్రాలు
>> పాన్ కార్డు, ఆధార్ కార్డు
>> నివాస ధృవీకరణ పత్రం
>> పాస్‌పోర్ట్ సైజు ఫోటో
>> వ్యాపార ధృవీకరణ పత్రం
>> వ్యాపార చిరునామా రుజువు
>> కుల ధృవీకరణ పత్రం

ముద్ర లోన్ వడ్డీ రేటు ఎంత?
ప్రధాన మంత్రి ముద్రా యోజన వడ్డీ రేట్లు బ్యాంకును బట్టి మారవచ్చు. ముద్రా రుణాలకు వేర్వేరు బ్యాంకులు వేర్వేరు వడ్డీ రేట్లను వసూలు చేయవచ్చు. వడ్డీ రేటు రుణగ్రహీత వ్యాపారం, స్వభావం, దానితో సంబంధం ఉన్న రిస్క్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా కనీస వడ్డీ రేటు 10 నుండి 12 శాతం వరకు కొనసాగుతుంది.

Health Facts: కళ్లజోడు వాడుతున్న ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయమిది.. రోజూ 10 నిమిషాలు ఇలా చేస్తే..!

Health Facts: కళ్లజోడు వాడుతున్న ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయమిది.. రోజూ 10 నిమిషాలు ఇలా చేస్తే..!

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అన్ని అవయవాలలోకి కళ్లు చాలా ముఖ్యమైనవి. కంటి చూపు బాగుండాలంటే కళ్ళను జాగ్రత్తగా కాపాడుతోవాలి. కంటి సంరక్షణా చర్యలు పాటించాలి.
కానీ ఇప్పట్లో కళ్ళజోడు లేని మనుషులు కనిపించరంటే అతిశయోక్తి కాదు. గంటల కొద్దీ కంప్యూటర్లు ముందు పనిచేస్తూ ఎక్కువ సేపు మొబైల్ బ్రౌజింగ్, టీవి చూడటం చేస్తుంటే కళ్లు దెబ్బతింటాయి. కంటి చూపు మందగిస్తుంది. వృద్దాప్యంలో కంటి చూపు మందగిస్తే ఉపయోగించాల్సిన కళ్ళజోడును చిన్నపిల్లలు, యువత కూడా వాడుతున్నారంటే దృష్టిలోపం తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే కంటి ఆరోగ్యం మెరుగుపడి కంటి చూపు పదునెక్కడానికి యోగాలో కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. ప్రతిరోజూ కేవలం 5నుండి 10నిమిషాల సేపు ఈ వ్యాయామాలు ఫాలో అవుతుంటే కొద్దిరోజుల్లోనే కళ్ళజోడు తీసి పక్కన పెట్టేయచ్చు.

పామింగ్..

పామింగ్ అనేది వ్యాయామం కాదు కానీ కళ్ళకు విశ్రాంతిని చేకూరుస్తుంది. రెండు చేతులను ఒకదానితో మరొకటి బాగా రుద్దితే వెచ్చదనం పుడుతుంది. చేతులను ఇలా రుద్దిన వెంటనే రెండు కళ్ళమీద
పెట్టుకోవాలి. చేతులకు ఉన్న వెచ్చదనం కళ్ళలోకి ప్రసరించి కళ్ల చుట్టూ రక్తప్రసరణ మెరుగవుతుంది.

కుడి, ఎడమవైపుకు చూడటం..

కళ్ళను ఆరోగ్యంగా ఉంచే వ్యాయామాలలో ఇది మొదటిది. ఒక చోట స్థిరంగా కూర్చుని కళ్లను కుడి వైపుకు, ఎడమవైపుకు తిప్పుతూండాలి. ఇది గడియారంలో లోలకం లాగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ 3 నుండి 5 సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
పైకి కిందకూ చూడటం..

కుడి ఎడమవైపుకు చూసినట్టుగానే పైకి కిందకూ చూస్తూ కంటి వ్యాయామం చెయ్యాలి. అయితే ఈ వ్యాయామంలో పైకి కిందకి చూసేటప్పుడు 5నుండి 10సెకెన్ల గ్యాప్ ఉండాలి. చాలా వేగంగా చెయ్యడం మంచిది కాదు.

కనురెప్పలు వాల్చడం..

కంప్యూటర్, మొబైల్, టీవి ఇలా ఏది చూస్తున్నా చాలా మంది కనురెప్ప వేయడం కూడా మరచిపోతుంటారు. కళ్లు వేగంగా మూస్తూ తెరుస్తూ చేసే వ్యాయామం వల్ల కళ్లు అలసట నుండి బయట పడతాయి. నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారు రాత్రి సమయంలో ఒక నిమిషం పాటు ఈ వ్యాయామం చేస్తుంటే మంచి నిద్ర పడుతుంది.

సవ్య, అపసవ్య దిశలో తిప్పడం..
కళ్లను వృత్తాకారంగా తిప్పాలి. ఆ తరువాత అదే విధంగా రివర్స్ గా చేయాలి. వృత్తాకారం సవ్యదిశలోనూ, దాన్నే అపసవ్య దిశలోనూ చేయాలి. ఇలా రోజూ కనీసం 10సార్లు అయినా చేయాలి. ఇలా చేస్తుంటే కళ్ళకు బలం చేకూరుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.

15*15*15 ఫార్ములా తెలుసా? కోటీశ్వరులు ఫాలో అయ్యే సూత్రం ఇదే..!

15*15*15 ఫార్ములా తెలుసా? కోటీశ్వరులు ఫాలో అయ్యే సూత్రం ఇదే..!

మిలియనీర్‌గా మారడం ఎలా: దేశంలోని ఈక్విటీల కంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడిదారులు ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ చాలా మందికి మిలియనీర్లు కావడానికి అసలు ఫార్ములా తెలియదు.

రూ.500 రోజువారీ సేవింగ్స్‌తో మిలియనీర్‌గా మారడం ఎలా: ప్రతి ఒక్కరికీ కోటీశ్వరులు కావాలనే కోరిక ఉంటుందా..? అయితే.. కొందరు కోరికలను మాత్రం వదులుకోకుండా.. దాన్ని సాధించుకునేందుకు కష్టపడుతుంటారు. కానీ.. ఎక్కడో సమస్య ఉంది. సరైన ఆర్థిక అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. సరైన ఆర్థిక సూత్రాలు తెలియక డబ్బును పెంచుకోలేకపోతున్నారని.. కానీ దానికి ఓ సూత్రం ఉందని అంటున్నారు. మరియు అది ఏమిటి? దీన్ని ఎలా వాడాలి..? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం…అపోహ వీడి..

మిలియనీర్ కావాలంటే చాలా డబ్బు పెట్టుబడి పెట్టాలని అందరూ అనుకుంటారు. అయితే ఇది పూర్తిగా నిజం కాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. తక్కువ డబ్బుతో, సరైన పెట్టుబడి మార్గాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు త్వరగా ధనవంతులుగా మారవచ్చు. దీని కోసం ముందుగా మీరు 15*15*15 సూత్రం గురించి తెలుసుకోవాలి!

15*15*15 రూల్ ఏంటి..?:

భవిష్యత్ అవసరాల కోసం ఎక్కువ మంది రిస్క్ ఫ్రీ రాబడుల కోసం సిప్‌లను ఎంచుకుంటున్నారు.. అంతేకాదు దీర్ఘకాలికంగా ఇన్వెస్ట్ చేసే వారికి కచ్చితంగా మంచి రాబడులు వస్తాయి. అంతేకాకుండా, ఇవి అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లచే నిర్వహించబడుతున్నందున, మీరు ఎటువంటి ఆందోళన లేకుండా మెరుగైన రాబడిని పొందవచ్చు.

చాలా మంది సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) రూపంలో ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. అయితే రూ.కోటి లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓ ఫార్ములా ఉంది.

అది చాలా ప్రసిద్ధ 15*15*15 వ్యూహం

దీని అర్థం ఏంటంటే.. ఏ ఇన్వెస్టర్ అయినా నెలకు 15 వేల రూపాయలు.. 15 ఏళ్లపాటు.. 15 శాతం రాబడిని ఇచ్చే ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే కచ్చితంగా కోటీశ్వరులవుతారు. దీని వెనుక ఉన్న కాంపౌండింగ్ ఫార్ములా అతిపెద్ద మ్యాజిక్ చేస్తుంది. ఈ ఫార్ములా ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ లో రోజుకు రూ.500 పెట్టుబడి పెడితే చాలు సామాన్యులు కోటీశ్వరులు అవుతారు.

మిలియనీర్ కావాలనుకునే ఏ పెట్టుబడిదారుడు క్రమం తప్పకుండా 15 సంవత్సరాల పాటు ఈ ప్లాన్ కింద పెట్టుబడి పెడితే అక్షరాలా కోటి రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తారు. ఈ కాలంలో పెట్టుబడిపై 15 శాతం చొప్పున చక్రవడ్డీ వసూలు చేస్తే 75 లక్షలు. అదే సమయంలో, పెట్టుబడిదారుడు రూ. 27 లక్షలు పెట్టుబడి రూపంలో. కాబట్టి ఈ రెండూ కలిపితే 15 ఏళ్ల తర్వాత మొత్తం రాబడి రూ.1.02 కోట్లు అవుతుంది. క్రమపద్ధతిలో పెట్టుబడి పెడితే కోటీశ్వరుడు కావాలనే కల నెరవేరుతుందని ఈ ఫార్ములా నిరూపిస్తోంది.

Wifi Router: రాత్రిపూట Wi-Fiని ఆన్ చేసి ఉంచుతున్నారా? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారంతే..!

Wifi Router Using Tips: ప్రస్తుతం WiFi రూటర్ దాదాపు ప్రతి ఇంట్లో ఉపయోగిస్తున్నారు. కానీ, రాత్రిపూట దీన్ని ఆన్ చేసి ఉంచడం మంచిది కాదు. చాలా సార్లు ప్రజలు దానిని విస్మరిస్తారు.
రాత్రంతా WiFi రూటర్‌ను వారి ఇళ్లలో ఉంచుతారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని నిరూపించవచ్చు. మీరు మీ ఇంట్లో రాత్రిపూట కూడా వైఫై రూటర్‌ని ఉపయోగిస్తే, దీని గురించి తప్పక తెలుసుకోవాలి. ఇలా చేయడం చాలా ప్రమాదకరం.

రాత్రిపూట Wi-Fi రూటర్‌ను ఆఫ్‌లో ఉంచడం మంచిది కాదు..

1. మీ ఇంట్లోని వైఫై రూటర్ రాత్రంతా రన్ అవుతూ ఉంటే, దాని నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కారణంగా, కొంత సమయం తర్వాత మీ శరీరంలో అనేక వ్యాధులు తలెత్తుతాయి. రూటర్ నుంచి వెలువడే రేడియేషన్ వల్ల ఇది జరుగుతుంది. దీని గురించి చాలా మందికి తెలియదు.

2. విద్యుదయస్కాంత వికిరణం కారణంగా, కొన్ని వ్యాధులు శరీరంలో తలెత్తుతాయి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. మీ శరీరాన్ని చెడుగా ప్రభావితం చేస్తాయి.
3. ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కారణంగా శరీరంలో సంభవించే వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే, మీరు వైఫై రూటర్‌ని ఉపయోగించడం పూర్తయిన తర్వాత దాన్ని ఆఫ్ చేయడానికి ప్రయత్నించాలి. ప్రజలకు దీని గురించి అవగాహన లేదు కానీ ఇది నిజంగా జరుగుతుంది. కాబట్టి మీరు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలి.

Vamu Rasam: వారంలో ఒక్కసారి వాము రసం తినండి.. పొట్టంతా క్లీన్!

వాము ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఇది వరకు వాము ఆకులు, వాము ఇంటి చుట్టుపక్కలే వేసేవారు. వాటితో రకరకాలైన ఆహారాలు తయారు చేసేవారు.

కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ముఖ్యంగా ఏవి పడితే ఆ హారాలు తినేస్తున్నారు. ఉడికీ ఉడకని ఆహారం తినడం వల్ల.. సరిగ్గా జీర్ణం అయ్యేది కాదు. దీంతో కడుపులో నొప్పి, అజీర్తి, పొట్ట పట్టేయడం వంటి సమస్యలు తలెత్తేవి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే.. వాము చాలా హెల్ప్ చేస్తుంది. వారం లేదా పది రోజులకు ఓ సారైనా వాముతో తయారు చేసే ఆహారాలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ అనేది శుభ్ర పడుతుంది. దీని వల్ల పొట్ట ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. అందులోనూ చలి కాలంలో వాముతో రసం చేసుకుని తింటే చాలా ఆరోగ్యం. మరి వాము రసానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

వాము రసానికి కావాల్సిన పదార్థాలు:

వాము, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, చింత పండు, బెల్లం తురుము, ఉప్పు, కొత్తి మీర, కొత్తి మీర, ఆయిల్, పసుపు, ఆయిల్, తాళింపు దినుసులు.

వాము రసం తయారీ విధానం:

వాము రసం తయారు చేయడం చాలా సులభం. ఒక లోతైన పాత్ర తీసుకుని.. అందులో చింత పండు, ఉప్పు, పచ్చి మిర్చి ముక్కలు, ఉల్లి పాయ ముక్కలు, పసుపు వేసి ఒకసారి కలపాలి. ఈ గిన్నెను స్టవ్ పెట్టి.. మీడియం మంటపై ఓ 10 నిమిషాలు మరిగించాలి. తర్వాత కరివేపాకు, కొత్తి మీర, తురిమిన బెల్లం కూడా వేసి ఓ పొంగు రానివ్వాలి.

ఈ సమయంలోనే ఒక స్పూన్ వాము కూడా వేసి చిన్న మంట మీద ఓ ఐదు నిమిషాలు బాగా మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. ఈ రసానికి పోపు పెట్టాలి. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వాము రసం తయారు. వేడి వేడి అన్నంలో ఈ వాము రసం వేసుకుని తింటే చాలా మంచింది. పిల్లలకు పెడితే వారిలో ఉండే నులి పురుగులు వంటివి నశిస్తాయి. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగు పడుతుంది.

ఇరవై వేల గీజర్ కొనే కన్నా.. 12 వందలతో ట్యాప్ హీటర్ బెటర్, సెకన్లలో వేడెక్కనున్న నీళ్లు

రోజు రోజుకు కొన్ని ప్రాంతాల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఈ సమయంలో కొందరు నీళ్లు ముట్టుకోవాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది.

ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొవాలో తెలియని వారికీ ఓ సవాలుగా మారుతుంటుంది. సాధారణంగా చలికాలంలో మధ్యాహ్నం స్నానం చేయాలన్నా కూడా ముట్టుకోలేనంత చల్లగా ఉంటాయి. ఈ సీజన్లో ఇంట్లో ఏ పని చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వేడి నీళ్లు ఉంటే బావుండనిపిస్తుంది. మరి సెకన్ల వ్యవధిలో వేడి నీళ్లు ఎలానా అని ఆలోచిస్తున్నారా? సెకన్ల వ్యవధిలో ట్యాప్ తిప్పగానే వేడి నీళ్లు వచ్చే ప్రోడక్ట్ కూడా మార్కెట్‌లోకి వచ్చేసింది. అదే ట్యాప్ వాటర్ హీటర్ దీని ధర కూడా చాలా తక్కువ.

ట్యాప్ వాటర్ హీటర్ కోసం ఎక్కడికో వెళ్ళాలిసిన అవసరం లేదు.ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది. ఈ మీ వాటర్ హీటర్ ఇంట్లో చాలా సులభంగా అమర్చుకోవచ్చు. గీజర్ కోసం 10 వేల నుంచి 15 వేలు పెట్టె బదులు ..ఈ డివైస్ కి 1200 పెడితే సరిపోతుంది. అంతే కాకుండా సెకన్ల వ్యవధిలోనే నీటిని వేడి చేస్తుంది. ఇది ట్యాప్‌కు అమర్చుకునే పరికరం . ట్యాప్ ఇలా తిప్పగానే సెకన్ల వ్యవధిలో నీళ్లు వేడెక్కి బయటకు వచ్చేస్తాయి. ఈ డివైస్ బాడీను షాక్ ప్రూఫ్‌గా తయారు చేశారు. దీనిలో డిస్‌ప్లే కూడా ఉంటుంది.

అంగన్‌వాడీల తొలగింపునకు సన్నాహాలు?

అంగన్‌వాడీల తొలగింపునకు సన్నాహాలు?
తదుపరి చర్యలకు సిద్ధం కావాలని కలెక్టర్లకు ఆదేశాలుకొత్త నియామకాలకు సంబంధించి రోస్టర్‌ పాయింట్ల సేకరణ

ఈనాడు, అమరావతి: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ 40 రోజులుగా రోడ్డెక్కి నిరసన తెలుపుతున్న అంగన్‌వాడీలను విధుల నుంచి తొలగించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

షోకాజ్‌ నోటీసుల్లో పేర్కొన్న గడువు పూర్తయిన నేపథ్యంలో తదుపరి చర్యలకు సిద్ధం కావాలని కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి. కొత్త నియామకాలు చేపట్టాల్సి వస్తే నిబంధనల మేరకు అనుసరించాల్సిన విధానంపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రోస్టర్‌ పాయింట్ల వివరాలు సేకరించారు. ఇతర పనులు చేపట్టేందుకు శనివారం రాత్రి, ఆదివారం కూడా క్షేత్రస్థాయిలో అధికారులు విధుల్లో ఉండాలని ఆదేశాలు వెళ్లాయి.

నామమాత్రంగానే విధుల్లోకి..

విధుల్లో చేరేందుకు అంగన్‌వాడీలకు శనివారం మధ్యాహ్నం వరకు ప్రభుత్వం గడువిచ్చింది. సాయంత్రం 4 గంటల వరకు చేరినవారి, చేరనివారి వివరాలు తీసుకుంది. కొత్త నియామకాలు చేపట్టాల్సి వస్తే 5 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని వివరాలను అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. మరోవైపు ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో అసత్యాలు పేర్కొన్నారని, చర్యలు తీసుకునే ముందు తమ వాదనను వ్యక్తిగతంగా వినాలని అంగన్‌వాడీలు సమాధానమిచ్చారు. దీన్ని అనుసరించాల్సిన అవసరం లేదనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎస్మాను ప్రయోగించినా… ఎన్ని రకాలుగా వారిపై ఒత్తిడి తెచ్చినా శనివారం నాటికి విధుల్లో చేరింది 10 శాతంలోపే. అంగన్‌వాడీలు సంఘటితంగా పోరాట ఉద్ధృతిని కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.04 లక్షల మంది అంగన్‌వాడీలున్నారు.

Lord Rama Puja: బాల రామయ్య ప్రతిష్ట సమయంలో.. ఇంట్లోనే ఎలా పూజ చేయాలంటే..

కోట్లాది హిందువుల కల తీరే జనవరి 22వ తేదీ చారిత్రలో నిలిచిపోనుంది. కొన్ని శతాబ్దాల పాటుగా రామ భక్తులంతా ఎదురుచూస్తున్న రోజు రాబోతోంది. వైదిక సంప్రదాయం ప్రకారం అయోధ్యలోని రామ మందిరంలోని గర్భ గుడిలో బాల రామయ్యకు పట్టాభిషేకం జరగనుంది.

అయితే రామయ్య కొలువుదీరుతున్న దృశ్యాన్ని చూడాలని.. పూజించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే అందరూ అయోధ్యకు వెళ్ళలేరు. ఈ నేపధ్యములో మీరు అయోధ్యకు వెళ్లలేకపోతే.. బాల రామయ్య ప్రతిష్టాపన రోజున రామయ్య ఆశీర్వాదం పొందడానికి ఇంట్లో రాముడిని ఆచారనియమాల ప్రకారం పూజించవచ్చు. ఈ రోజు పూజ విధానం తెలుసుకుందాం..

పూజగదిని శుభ్రం చేసుకోండి..

ముందుగా ఇంటిలోని పూజ గదిని శుభ్రం చేసుకోండి. అనంతరం దేవుళ్ల విగ్రహాలను శుభ్రం చేయండి. దేవుడి పటాలను శుభ్రమైన గుడ్డతో తుడవండి.రామయ్య విగ్రహానికి స్నానం చేయించండి. లేదా రాములవారి చిత్రాన్ని శుభ్రమైన గుడ్డతో తుడవండి. ఉత్తరం.. తూర్పు దిశల మధ్య భాగాన్ని ఈశాన్య మూలగా పరిగణిస్తారు. ఈ దిక్కులో పూజ చేయడం అత్యంత ఫలవంతం. ఇంటి ఈశాన్య మూలను శుభ్రం చేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

ఇంట్లో శ్రీ రాముడిని ఇలా పూజించండి

ఆలయాన్ని శుభ్రం చేసిన తర్వాత ఇంట్లోని సభ్యులందరూ స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇప్పుడు ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిమీద ఎర్రటి వస్త్రాన్ని వేడి.. శ్రీరాముని విగ్రహం లేదా చిత్రాన్ని అమర్చండి.
శ్రీరాముని ఆశీస్సులు పొందడానికి ముందుగా శ్రీరాముడిని పూజించి అనంతరం హనుమంతుడిని పూజించండి. ఇప్పుడు ఎర్రటి వస్త్రాన్ని సమర్పించండి.. హనుమంతుని పూజ చేయకపోతే శ్రీరాముడి పూజ అసంపూర్ణమని.. శ్రీరాముని ఆశీస్సులు లభించవని విశ్వాసం.
ముందుగా రాముని విగ్రహానికి నీటితో అభిషేకం చేసి అనంతరం పంచామృతంతో స్నానం చేయించాలి. ఇప్పుడు మళ్లీ నీటితో స్నానం చేయించండి
రాముడికి తిలక ధారణ చేసి.. పువ్వులు, ధూపం, దీపలతో పూజను చేయండి. శ్రీ రామునికి నైవేద్యంగా స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ తో పాటు చలిమిడి, పానకాన్ని సమర్పించండి. రామజనం స్తుతితో రాముడిని పూజించడం ప్రారంభించండి.
రాముడిని పూజించేటప్పుడు రామరక్షా స్తోత్రాన్ని పఠించండి. రామ స్తోత్రాన్ని పఠించడం ద్వారా శ్రీరాముని ఆశీస్సులు భక్తుడిపై ఎల్లప్పుడూ ఉంటాయని విశ్వాసం. శ్రీరామునికి హారతి ఇచ్చి పూజను ముగించండి.
అనంతరం రామ చరిత మానస్ ను పఠించవచ్చు లేదా ఇంట్లో రామాయణ పఠనాన్ని చేయండి.
దీపావళి రోజు రాత్రి చేసే విధంగా ప్రాణ ప్రతిష్ట రోజు సాయంత్రం ఇంటి బయట దీపాలను వెలిగించండి.
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని మన్నం వెబ్ ధ్రువీకరించడం లేదు.

Roasted Garlic: కాల్చిన వెల్లుల్లితో ఖతర్నాక్ బెనిఫిట్స్.. ఇవిగో డీటేల్స్

వెల్లుల్లి మన జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా నోటి ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది కాకుండా, వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి, మూత్రపిండాల పనితీరుకు సహాయపడుతుంది.
అయితే, పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం కంటే కాల్చిన వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాల్చిన వెల్లుల్లి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యాంటీఆక్సిడెంట్లతో నిండిన, కాల్చిన వెల్లుల్లి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.

కాల్చిన వెల్లుల్లి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. కాల్చిన వెల్లుల్లి ఆరోగ్యకరమైన జీర్ణక్రియ, ప్రేగు పనితీరును ప్రోత్సహిస్తుంది. వేయించిన వెల్లుల్లి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో పాత్ర పోషిస్తుంది. కాల్చిన వెల్లుల్లి విటమిన్ సి, మాంగనీస్, విటమిన్ B6 వంటి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

కాల్చిన వెల్లుల్లిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ప్రతిరోజూ రెండు, మూడు కాల్చిన వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోవచ్చు.

కాల్చిన వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్-తగ్గించే లక్షణాలను కలిగి ఉందని తేలింది.
ఇది ఇమ్యూనిటీ పవర్ పెంచడంలో సహాయపడుతుంది . ఎందుకంటే అల్లిసిన్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది.
కాల్చిన వెల్లుల్లి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, రక్తం గడ్డకట్టడాన్ని నివారించడానికి సహాయపడుతుంది. క్వెర్సెటిన్, కెంప్ఫెరోల్ వంటి సమ్మేళనాలను కలిగి ఉండటం దీనికి కారణం.
వెల్లుల్లిలో జింక్, విటమిన్ సి ఉన్నాయి, ఈ రెండూ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

Kalagnanam Ayodhya : అయోధ్య విషయంలో బ్రహ్మంగారు చెప్పిన షాపింగ్ నిజాలు..!

Kalagnanam Ayodhya : బ్రహ్మంగారు తన కాలజ్ఞానం ద్వారా భవిష్యత్తులో జరిగే ఎన్నో విషయాల గురించి ఊహించి ముందుగానే రాశారు. అటువంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అయోధ్య విషయంలో కూడా బ్రహ్మంగారు చెప్పిన చాలా నిజాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం..
కాలజ్ఞానం అంటే భవిష్యత్తులో జరగబోయేది ముందుగానే ఊహించి చెప్పడం.. భవిష్యత్తులో జరిగి అనేక సంఘటనలను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంధాలలో భద్రపరిచారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో ఉన్నవే ఆయన రాసిన కాలజ్ఞానం. ఆయన ఎన్నో మహిమలు చూపెట్టాడు. మరి ఇప్పటివరకు చెప్పిన విషయాలు ఏంటి అలాగే కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా అయోధ్య విషయంలో బ్రహ్మంగారు చెప్పిన షాకింగ్ వివరాలు అన్నీ కూడా ఈరోజు వివరంగా తెలుసుకుందాం.. ఇప్పుడు భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది లేదు. ఒక అమ్మ 16 సంవత్సరాలు రాజ్యమేలుతుంది అన్నాడు. ఇక ఇందిరా గాంధీ 16 సంవత్సరాల పాటు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని చెప్పారు. కిందటి వరకు కూడా బ్రాహ్మణులకు మందులు ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ప్రస్తుతం ఎక్కడ అగ్రహారాలు కనిపించడం లేదు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది. ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు మనం ఇప్పటివరకు ఎన్నో చూసాం. అలాగే ప్రస్తుత కాలంలో కూడా ప్రజలు భయంకర రోగాలకు గురవుతున్నారు. మనుషులు మృగాల ప్రవర్తిస్తున్నారు.

వాటికి మందు అనేది లేదు.. ఇటువంటి వ్యాధులు వచ్చినవారు మరణించక తప్పడం లేదు. అక్రమ సంబంధాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగి హత్యలకు కూడా దారితీస్తున్నాయి. అలాగే ఇప్పుడు అయోధ్య విషయంలో కూడా బ్రహ్మంగారి చెప్పిన షాకింగ్ నిజాలు జరుగుతున్నాయి. అనే వార్త మనం వింటూ ఉన్నాం.. అంటే అయోధ్య విషయంలో కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయని మనం ఇప్పటివరకు ఎన్నో వార్తలు విన్నాం. అవి కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినట్లు ఎన్నో రకాల వార్తలు కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఒకేసారి అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతున్న సమయంలో వేల సంఖ్యలో వానరులు వచ్చాయని అంటే వేల సంఖ్యలో వానరు గుంపు అయోధ్యలో రామ మందిరం నిర్మాణ సమయంలో కనిపించని వానరులు అంటే హనుమంతుని సైన్యం శ్రీరామచంద్ర మూర్తిల వారికి హనుమాన్ ని మించిన భక్తుడు మరొకరు లేరని విషయం మనందరికీ తెలిసిందే.. ఈ విధంగా అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్న సమయంలో ఈ విధంగా శ్రీరాముని దర్శనార్థం వచ్చినట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇటువంటి విషయాలని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్టు మనం ఎన్నో రకాల వార్తలు చూస్తున్నాము. అలాగే ఒకేసారి వందలాది పాములు ఒకేసారి రామ మందిని నిర్మాణ సమయంలో వచ్చాయి. అంటే రామ మందిరం నిర్మాణం అనేది వందల సంవత్సరాలుగా ప్రతి ఒక్క హిందువు ఎదురుచూస్తున్న కళ. ఆ కళ ఇప్పుడు నిజం కాబోతుంది.
అంటే ఈ విధంగా మనుషులు మాత్రమే కాకుండా అనేక రకాల ప్రార్థన నిర్మాణం కోసం ఎదురుచూస్తున్నాయని ఆ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకునేందుకు మనుషులు మాత్రమే కాకుండా జీవాలు కూడా రామ మందిరం నిర్మాణం జరిగే చోటికి వస్తున్నాయని మనకు తెలుస్తుంది. అక్కడికి వచ్చినట్లు మనం వార్తలు వింటున్నాం. అంటే ఈ విధంగా ఆ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకునేందుకు ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీర్వాదాలు పొందుకునేందుకు కేవలం మనుషులు మాత్రమే కాదు మూగజీవాలు కూడా ఎంతగానోవాటికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. మందిరానికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీ రాముని చిన్ననాటి బాలరూప విగ్రహం ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీరాముని దర్బార్ ఉంటుంది. మందిరంలో ఐదు మండపాలు ఉన్నాయి. రంగమండపం, సభ మండపం ప్రార్ధన మరియు కీర్తన మండపాలు ఈ మండపాలన్నీ దేవతల విగ్రహాలతో అలంకరించబడ్డాయి. వికలాంగులు వృత్తుల సౌకర్యం రాంపులు మరియు లెఫ్ట్ లు కూడా ఉన్నాయి. మందిరం చుట్టూ 732 మీటర్ల పొడవు మరియు 14 అడుగుల వెడల్పుతో ప్రాకార కూడా నిర్మించబడింది. మందిరంలోని నాలుగు మూలల్లో సూర్యుడు దేవి భగవతి గణపతి శివుడి ఆలయాలు కూడా ఉన్నాయి. ఉత్తరంలో అన్నపూర్ణమ్మ దేవస్థానం.. మహర్షి అగస్త్య మహర్షి నిషాద్రాజ్ శబరిమాత దేవి అహల్య మంత్రాలు ఉన్నాయి. మందిరంలో ఎక్కడా కూడా ఇనుము వాడలేదు. మందిరం యొక్క పునాది 14 మీటర్ల మండపాటి ఆర్సిసితో నిర్మించబడింది. ఇంతటి విశిష్టత కలిగిన నిర్మాణం దాదాపుగా పూర్తయినట్లే జనవరి 22వ తేదీన విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కూడా జరగబోతుంది. నిర్మిస్తున్న సమయంలో ఇటువంటి వింతలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అటువంటి వింతలు జరుగుతాయని వీరబ్రహ్మేంద్రస్వామి గారు చెప్పాడు…

ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి… హిందూ శాస్త్రంలో ఎందుకు అంత ప్రాముఖ్యత

హిందూధర్మంలోని ఆచారాల ప్రకారం ఏదైనా దేవాలయంలో దేవుని విగ్రహ ప్రతిష్ఠకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించకుంటే దేవుని ఆరాధన అసంపూర్ణమవుతుందని అంటారు.
అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న రామ్‌లల్లా విగ్రహానికి ‍ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏమిటి? ఇందులోని విశిష్టత ఏమిటనేది ఇప్పుడు తెలుసుకుందాం. . .

యావత్ భారతదేశం ఎదురుచూస్తున్న మధుర క్షణాలు అయోధ్యలోని రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసమే. ఎన్నో ఏళ్ల కల జనవరి 22న నెరవేరనుంది. అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుంది. రామ్ లల్లా విగ్రహం ప్రతిష్టాపన జరగనుంది

హిందూ మతంలో ప్రాణ ప్రతిష్ఠ అనేది పవిత్రమైన వేడుక. ఆలయంలో ఏర్పాటు చేసే విగ్రహంలోకి దేవతని ఆహ్వానించడం. కొత్తగా ఆలయం నిర్మించినప్పుడు లేదా కొత్తగా విగ్రహాన్ని పెడుతున్నప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. వేద మంత్రోచ్చారణ మధ్య రామ్ లల్లా విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్ఠకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రాణ అంటే ప్రాణ శక్తి, ప్రతిష్ఠ అంటే స్థాపన అని అర్థం. అప్పటి వరకు ఆ విగ్రహానికి ప్రాణం ఉండదు. కేవలం విగ్రహం మాదిరిగానే పరిగణిస్తారు. ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో అప్పటి నుంచి విగ్రహంలోకి దైవం వచ్చి చేరుతుంది.

సనాతన ధర్మంలో ప్రాణ ప్రతిష్టకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ప్రాణ ప్రతిష్ఠ తప్పనిసరిగా జరుగుతుంది. ఏదైనా విగ్రహ ప్రతిష్ఠాపన సమయంలో ఆ విగ్రహానికి జీవం పోసే విధానాన్నే ప్రాణ ప్రతిష్ఠ అంటారు. ‘ప్రాణ్’ అనే పదానికి ప్రాణశక్తి అని, ‘ప్రతిష్ఠ’ అంటే స్థాపన అని అర్థం. మొత్తంగా చూసుకుంటే ప్రాణ ప్రతిష్ఠ అంటే విగ్రహంలో ప్రాణశక్తిని స్థాపించడం లేదా దేవతను విగ్రహంలోకి ఆహ్వానించడం అని అర్థం.

ప్రాణ ప్రతిష్టకు ముందు ఏ విగ్రహం కూడా పూజకు అర్హమైనదిగా పరిగణించరు. ప్రాణప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోనికి ప్రాణశక్తిని ప్రవేశపెట్టి, దానిని ఆరాధనీయ దేవతా స్వరూపంగా మారుస్తారు. అప్పుడే ఆ విగ్రహం పూజకు అర్హమైనదవుతుంది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం విగ్రహ రూపంలో ఉన్న దేవతామూర్తులను ఆచార వ్యవహారాలతో మంత్రాలు జపిస్తూ పూజలు చేస్తారు. ప్రతిష్ఠాపన తర్వాత భగవంతుడే ఆ విగ్రహంలో కొలువయ్యాడని చెబుతారు. అయితే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభ సమయం అనేది నిర్ణయిస్తారు. శుభ ముహూర్తాలు లేకుండా మొక్కుబడిగా ప్రాణ ప్రతిష్ఠ చేయడం తగదని పండితులు చెబుతుంటారు.
ప్రాణ ప్రతిష్ఠకి ముందు ఆ విగ్రహాన్ని పూజకి ఉపయోగించరు. ప్రాణ ప్రతిష్ఠ ద్వారా విగ్రహంలోకి ప్రాణశక్తిని ప్రవేశపెడతారు. భక్తులు విగ్రహాన్ని కేవలం విగ్రహంగా కాకుండా దేవుళ్ళ సజీవ స్వరూపంగా భావిస్తారు. ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత మాత్రమే ఆ విగ్రహం పూజ చేసేందుకు అర్హత సాధిస్తుంది. ఇలా చేసిన తర్వాత దేవుడి విగ్రహంలోకి కొలువై ఉంటాడు.

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం నాడు ఇంట్లో ఇలా చెయ్యండి.. ప్రధాని మోడీ పిలుపు!!

హిందువుల శతాబ్దాల కల అయిన అయోధ్య బాలరాముని ప్రతిష్టపై ప్రజలలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యను ఎంతో సామరస్యంగా పరిష్కరించి ప్రస్తుతం అయోధ్య శ్రీరాముడి ఆలయం ప్రారంభోత్సవం చేస్తున్న కారణంగా హిందువులంతా ఆనంద తన్మయత్వంతో ఉన్నారు.
ఇక అయోధ్య రాముడి అక్షింతలు ఇంటింటికీ పంపిణీ జరుగుతున్న క్రమంలో దేశ వ్యాప్తంగా జై శ్రీరాం అంటూ జనం ఊగిపోతున్నారు.

రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని తిలకించటానికి తెగ తాపత్రయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవానికి అనుబంధంగా దేశ వ్యాప్తంగా ఆలయాలను శుభ్రం చెయ్యాలని ప్రధాని మోడీ పిలుపునివ్వటంతో ఆలయాలను శుద్ధి చేస్తున్నారు. ఇక అయోధ్య రామయ్య ఆలయ ప్రారంభోత్సవం నాడు కూడా దేశ ప్రజలంతా చెయ్యవలసిన విధులను పండితులు ఇప్పటికే చెప్పారు.

అయోధ్యలో చారిత్రాత్మక ఘట్టంగా బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగే రోజు అయిన జనవరి 22 న తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవాలని హిందూ మత పెద్దలు చెబుతున్నారు. కాలకృత్యాల అనంతరం స్నానం చేసి దేవుడి దగ్గర దీపం వెలిగించాలి. ఆ తరువాత సీతారామ, లక్ష్మణ, భరత, శతృఘ్న సమేత ఆంజనేయుడికి షోడశోపచార పూజలు చేయాలి.

పానకం, వడపప్పు నైవేద్యం సమర్పించాలని చెప్తున్నారు . పండ్లు, టెంకాయ మొదలైనవి సమర్పించాలి. జైశ్రీరాం అంటూ నగర సంకీర్తన చేస్తే చాలా మంచిది. అభిజిత్ ముహూర్తం వరకు దీపారాధన కొండెక్కకుండా చూసుకోవాలి. ఐదు దీపాలను తప్పకుండా వెలిగించాలని చెప్తున్నారు. ఆ రోజు విధిగా హిందువులంతా రామయ్యను మనసులో నిలుపుకుని పూజాధికాలు చెయ్యాలి.

ఇక మరోవైపు ఈ నెల 22న జరగనున్న అయోధ్య బాల రాముని ప్రతిష్టా కార్యక్రమాన్నిపురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో శ్రీరామ జ్యోతిని వెలిగించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్కరూ రాముడు చూపిన బాటలో నడవాలన్నదే తమ ఉద్దేశమని మోడీ వెల్లడించారు.రామాలయ ప్రారంభోత్సవంలో పాల్గొననుండటం తన పూర్వ జన్మ సుకృతం అన్నారు.

Health

సినిమా