- Like
- Digg
- Del
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- Yummly
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Skype
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఏపీలో మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శనివారం విజయవాడలో యాత్ర కొనసాగుతుండగా గుర్తు తెలియని దుండగులు జగన్ పై శనివారం రాత్రి రాళ్లదాడి చేశారు.
ఈ దాడిలో సీఎ జగన్ కనుబొమ్మ పై గాయం అయింది. కాగా ఈ దాడిపై ఎన్నికల కమిషన్ స్పందించి.. ఆరా తీసింది. విజయవాడ సీపీ కాంతి రాణాకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఫోన్ చేశారు.
ఈ ఘటనపై రేపటిలోగా నివేదిక పంపాలని.. దాడికి పాల్పడిన వారిని వెంటనే గుర్తించాలని ఆదేశించారు. కాగా ఈ దాడి జరిగిన సమయంలో పలుమార్లు పవర్ కట్ అయిందని, ఆ ప్రాంతంలో స్కూల్, వ్యాపార సముదాయాలు ఉండటంతో రాళ్లు విసిరిన వారిని గుర్తించడంలో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని సీసీ టీవీ పుటేజ్లను క్షుణ్ణంగా పరిక్షించారు. అలాగే సీఎం జగన్ కు తగిలిన రాయిని పరిశీలించి వేలిముద్రలు సేకరించిన పోలీసులు, పలువురు అనుమానితులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది.