Dahnush: బ్రేకింగ్.. ఐశ్వర్య రజినీకాంత్ తో ధనుష్ విడాకులు..

Dahnush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ తో విడాకులు తీసుకోవడానికి సిద్ధం అయ్యాడు. తాజాగా వారు చెన్నై కోర్టులో మ్యూచువల్ విడాకులకు పిటిషన్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది. సెక్షన్ 13 బి కింద వారు విడాకులకు అప్లై చేశారు. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ .. ధనుష్ ను 2014లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే 18 ఏళ్ళ తరువాత.. అనగా 2022 లో ఈ జంట కొన్ని విబేధాల కారణంగా విడిపోతున్నట్లు ప్రకటించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

రెండేళ్ల నుంచి ఈ జంట విడిగానే ఉంటున్నారు. ” 18 సంవత్సరాలు స్నేహితులుగా, జంటగా, తల్లిదండ్రులుగా మరియు ఒకరికొకరు శ్రేయోభిలాషులుగా కలిసిమెలిసి ఉన్నాము. మా ఈ ప్రయాణం.. ఎదుగుదల, అవగాహన, సర్దుబాటు మరియు అనుకూలతలతో సాగింది. ఈరోజు మేము ఒక చోట నిలబడ్డాము. మా దారులు విడిపోయే చోట. ఐశ్వర్య మరియు నేను జంటగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మరియు మమ్మల్ని మంచి వ్యక్తులుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దయచేసి మా నిర్ణయాన్ని గౌరవించండి. దీన్ని ఎదుర్కోవడానికి మాకు అవసరమైన గోప్యతను ఇవ్వండి. ఓం నమశివాయ! ప్రేమను పంచండి” అంటూ రాసుకొచ్చాడు.

ఇక ఈ విషయం చెప్పి రెండేళ్లు అవుతుంది. కానీ, ఇప్పటివరకు వీరు విడాకులు తీసుకోలేదా అనే అనుమానం అభిమానుల్లో మొదలయ్యింది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ రెండేళ్లు.. ఇరు కుటుంబ సభ్యులు వీరిని కలపడానికి చాలా ప్రయత్నాలు చేశారు అని, అయినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి రెండు కుటుంబాలు కూడా నగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి కేసు విచారణకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *