ఏపీ ప్రభుత్వం(AP Govt) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్(Library Corporation Chairman ), సభ్యులను తొలగించింది.
అదే విధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల గ్రంథాలయ ఛైర్మన్లను సైతం తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశాలు ఉండటంతో.. గత వైసీపీ ప్రభుత్వంలో నియమించిన వీరందరినీ తొలగించినట్టు తెలుస్తోంది