Gold Rate Today: కుప్పకూలుతున్న బంగారం ధర… నేటి ధరలు ఇవే.. తులం రేటు ఎంతంటే?

Gold Rate Today: పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వరుసగా మూడో రోజు పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో దేశీయంగా ధరలు దిగివస్తున్నాయి. రికార్డ్ గరిష్ఠాల నుంచి గోల్డ్ రేట్లు పడిపోతుండడం పసిడి ప్రియులకు ఊరటగా చెప్పవచ్చు. ఇన్నాళ్లు ధరలు పెరుగుతుండడంతో పసిడి, వెండి కొనేందుకు వెనకడుగు వేసిన వారికి కొనుగోలు చేసేందుకు మంచి అవకాశంగా బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ ధరలు పెరగకముందే కొనుగోలు చేయడం మంచిదంటున్నారు. ఓవైపు చూస్తే ఇప్పుటీ ధరలు భారీగానే ఉన్నప్పటికీ గత 15 రోజుల క్రితం నాటి ధరలతో చూసుకుంటే మాత్రం భారీగానే దిగివచ్చాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో మన హైదరాబాద్‌లో ఇవాళ అంటే మే 25వ తేదీన తులం బంగారం ధర ఎంతకు దిగివచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కీలక సూచనలు ఇస్తున్న క్రమంలో బంగారం ధరలు దిగివస్తున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2334 డాలర్లు పలుకుతోంది. ఇటీవలే స్పాట్ గోల్డ్ రేటు 2400 స్థాయి వరకు ఎగబాకిన సంగతి తెలిసేంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 30.38 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. మరోవైపు.. రూపాయి విలువ కాస్త కోలుకుని ప్రస్తుతం రూ. 83.093 వద్ద అమ్ముడవుతోంది.


హైదరాబాద్ మార్కెట్ల బంగారం ధరలు వరుసగా దిగివస్తున్నాయి. గత మూడు రోజుల్లోనే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.2720 మేర తగ్గింది. ఇవాళ ఒక్కరోజే రూ.980 మేర తగ్గి రూ. 72,440 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 900 తగ్గి రూ. 66 వేల 400 వద్ద ట్రేడింగ్ అవుతోంది. మరోవైపు.. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం రేటు తులానికి రూ.980 తగ్గి రూత 72 వేల 590 వద్దకు దిగివచ్చింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.900 తగ్గి రూ. 66,550 వద్దకు దిగివచ్చింది.

బంగారం దారిలోనే వెండి సైతం భారీగా దిగివస్తోంది. క్రితం రోజుల కిలో వెండి రేటు రూ. 3300 మేర పడిపోయిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో రూ.500 మేర దిగివచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ. 96,500 వద్దకు దిగివచ్చింది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి ధర ఇవాళ రూ. 500 తగ్గి రూ. 92 వేల వద్ద ట్రేడింగ్ అవుతోంది.