వైసీపీ మేనిఫెస్టోకు డేట్ ఫిక్స్… కీలక హామీ ఇదే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

2024 సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం ముంచుకొస్తోంది. నామినేషన్ల పర్వం కూడా మొదలైన నేపథ్యంలో హడావిడి పీక్స్ కి చేరింది. అయితే, ఎన్నికలకు నెలరోజుల సమయం కూడా లేని క్రమంలో ప్రధాన పార్టీలేవీ కూడా మేనిఫెస్టోను ప్రకటించకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా, ఉండగా వైసీపీ మేనియాఫెస్టో ప్రకటనకు డేట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం అందుతోంది. మరో రెండు రోజుల్లో వైసీపీ మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ప్రస్తుతం జగన్ సర్కార్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ మేనిఫెస్టో మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి వైసీపీ ప్రకటించబోయే మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ కీలక పాత్ర పోషించనుంది. 2014 ఎన్నికల్లో రుణమాఫీ సాధ్యం కాదని అన్న జగన్ అప్పట్లో చంద్రబాబు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అమలు చేయని అంశాన్ని ఎన్నికల ప్రచారంలో గుర్తు చేస్తూ వస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఈసారి మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, పెన్షన్ల పెంపు వంటి హామీలు కీలకం కానున్నాయని తెలుస్తోంది.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *