డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలు.. 1.82 లక్షల వరకు జీతం.. ఇలా అప్లై చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. వందల సంఖ్యలో గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్స్ విడుదలవుతుండడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 , పాలిటెక్నిక్ లెక్చరర్, డీఈవో, ఇతర ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల కాగా వాటికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. కొత్త సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. ప్రభుత్వ, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 240 లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ డిసెంబరు 30న ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజాగా అదనంగా మరో 50 పోస్టులను పెంచుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 290కి చేరింది. ఈ పోస్టుల భర్తీకి జనవరి 24 నుంచి ఆన్‌ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://appsc.aptonline.in ని పరిశీలించాల్సి ఉంటుంది.

బోటనీ 19 పోస్టులు, కెమిస్ట్రీ 26 పోస్టులు, కామర్స్ 35 పోస్టులు, కంప్యూటర్ అప్లికేషన్స్ 26 పోస్టులు, కంప్యూటర్ సైన్స్ 31 పోస్టులు, ఎకనామిక్స్ 16 పోస్టులు, హిస్టరీ 19 పోస్టులు, మ్యాథమెటిక్స్ 17 పోస్టులు, ఫిజిక్స్ 11 పోస్టులు, పొలిటికల్ సైన్స్ 21 పోస్టులు, జువాలజీ 19 పోస్టులు
సబ్జెక్టుల వారీగా పోస్టులు, వేతనం, రిజర్వేషన్, విద్యార్హతలు వంటి పూర్తి వివరాలతో కూడిన సమాచారం సర్వీస్‌ కమిషన్‌ వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in లో ఉంచినట్టు కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ తెలిపారు.