తిరుమల(Tirumala)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భక్తులు(Devotees) ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. టీటీడీ(TTD) సిబ్బంది తీరుపై ఆగ్రహం చేశారు.
వరాహస్వామి ఆలయంలో వీఐపీల దర్శనాలపై అధికారులను నిలదీశారు. క్యూలైన్లలో గంటల తరబడి ఉన్నవాళ్లను కాకుండా..సిఫార్సు భక్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. సిబ్బంది తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. భక్తులందరిని ఒకేలా చూడాలని, అధికారులు కొందరికి కొమ్ము కాస్తున్నారని భక్తులు మండిపడ్డారు. దేవుడిని దర్శించుకునేందుకు వస్తే వీఐపీల కోసం క్యూలైన్ల ఉన్న తమను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.