ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (Champions Trophy 2025) గెలిచింది. ఫైనల్ మ్యాచ్లో టీమ్ ఇండియా (India), న్యూజిలాండ్ (New Zealand)ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి హిస్టరీ క్రియేట్ చేసింది.
ఈ గెలుపుతో వ్యూయర్షిప్లో భారీ పెరుగుదల కనిపించింది. టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఎత్తుతుంటే 89 కోట్ల మందికి పైగా చూశారంట. జియో సినిమా (Jio Cinema), హాట్స్టార్ (Hotstar) ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేశారు. దీనివల్ల ప్రపంచం నలుమూలల నుంచి లైవ్ చూసే అవకాశం కలిగింది.
జియో సినిమా-హాట్స్టార్లో హిస్టారికల్ రికార్డ్
ఇండియా గెలుపు సంబరాలు గ్రౌండ్కే పరిమితం కాలేదు. డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా దీని ప్రభావం కనిపించింది. రిపోర్ట్స్ ప్రకారం 89 కోట్ల మందికి పైగా ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జియో సినిమా, హాట్స్టార్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ హిస్టారికల్ మూమెంట్ను చూశారు. ఏ క్రికెట్ మ్యాచ్కైనా ఇంత పెద్ద డిజిటల్ వ్యూయర్షిప్ రికార్డు ఇదే మొదటిసారి.
టీమ్ ఇండియా గెలుపుతో పండుగలా సంబరాలు, సెలబ్రేషన్స్
ఇండియా ఈ హిస్టారికల్ టైటిల్ గెలుచుకున్న తర్వాత దేశమంతా పండుగలా చేసుకున్నారు. ఫ్యాన్స్ టపాసులు కాల్చారు, రోడ్ల మీద ర్యాలీలు తీశారు. సోషల్ మీడియాలో క్రికెటర్లకు విషెస్ చెబుతూ పోస్టులు పెట్టారు. జియో సినిమా, హాట్స్టార్లో ఒకేసారి ఇంతమంది చూడటం చూస్తే క్రికెట్ ఒక ఆట మాత్రమే కాదు, ఇండియాలో ఒక పండుగ అని అర్థమవుతోంది.