AP Assembly Polls: ఏపీలో అర్ధరాత్రి 12 గంటల వరకు 78.36 శాతం పోలింగ్.. జిల్లాల వారీగా జాబితా ఇదే

చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు కూడా పోలింగ్ కొనసాగింది. అన్ని చోట్లా పోలింగ్ ముగింపు సమయానికి ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 78.36 శాతంగా నమోదయింది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది. అత్యధికంగా డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 83.19 శాతం పోలింగ్ నమోదయింది. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 63.19 శాతం నమోదయింది. ఈ మేరకు అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన డేటాను అధికారిక యాప్‌లో ఎన్నికల సంఘం అప్‌డేట్ చేసింది.


జిల్లాలవారీగా ఓటింగ్ శాతాలు ఇలా ఉన్నాయి..
అల్లూరి సీతారామరాజు – 63.19 శాతం
అనకాపల్లి – 81.63 శాతం
అనంతపురం – 79.25 శాతం
అన్నమయ్య – 76.12 శాతం
బాపట్ల – 82.33 శాతం
చిత్తూరు – 82.65 శాతం
అంబేద్కర్ కోనసీమ – 83.19 శాతం
తూర్పు గోదావరి – 79.31 శాతం
ఏలూరు – 83.04 శాతం
గుంటూరు – 75.74 శాతం
కాకినాడ – 76.37 శాతం
కృష్ణా – 82.20 శాతం
కర్నూలు – 75.83 శాతం
నంద్యాల – 80.92 శాతం
ఎన్టీఆర్ – 78.76 శాతం
పల్నాడు -78.70 శాతం
పార్వతీపురం మన్యం – 75.24 శాతం
ప్రకాశం – 82.40 శాతం
పొట్టిశ్రీరాములు నెల్లూరు – 78.10 శాతం
శ్రీ సత్యసాయి – 82.77 శాతం
శ్రీకాకుళం – 75.41 శాతం
తిరుపతి – 76.83 శాతం
విశాఖపట్నం – 65.50 శాతం
పశ్చిమ గోదావరి -81.12 శాతం
వైఎస్సార్ – 78.12 శాతం