Employee died | ఎన్నికల విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు..ఉద్యోగి మృతి

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
పార్లమెంట్‌(Parliament elections) ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగి గుండెపోటుతో(Employee died)మృతి చెందాడు.


ఈ విషాదకర సంఘటన అశ్వరావుపేట నెహ్రూ నగర్‌లో చోటు చేసుకుంది. నెహ్రూ నగర్‌ 165 పోలింగ్ బూత్‌లో విధులు నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ అనే ఉద్యోగి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.