ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీనితో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ కార్యాలయాలు, ‘పుష్ప 2’ చిత్రం నిర్మాత నవీన్ ఎర్నేని నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి.
ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో దిల్ రాజు ఇళ్లతో పాటు ఆయన సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. వ్యాపార భాగస్వాముల నివాసాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివిధ పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు.