BREAKING: పదో తరగతి విద్యార్థిని గర్భవతిని చేసిన కామాంధుడు

పదో తరగతి విద్యార్థినిపై ఓ కామాంధుడు కన్నేసి గర్భవతిని చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా పరిధిలోని చేవెళ్లలో చోటుచేసుకుంది. చెవెళ్లకు చెందిన కోజ్జంకి సుదర్శన్ అనే వ్యక్తికి విహాహమై ఓ పిల్లాడు కూడా ఉన్నాడు.


ఈ క్రమంలోనే పాఠశాలకు వెళ్తున్న పదో తరగతి విద్యార్థిని వెంట నిత్యం వెంటబడుతూ.. ఆమెను లోబరచుకున్నాడు. దీంతో ఆ విద్యార్థిని గర్భం దాల్చింది. దీంతో ఎక్కడ పరువుపోతుందోనని గ్రహించిన విద్యార్థిని తండ్రి గాంధీ ఆసుపత్రిలో అబార్షన్ చేయించడంతో ప్రస్తుతం ఆ బాలిక ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. విద్యార్థిని తండ్రి బుచ్చయ్య ఫిర్యాదు మేరకు కొజ్జంకి సుదర్శన్‌పై పోలీసులు ఫోక్సో యాక్ట్ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. నిందితుడు ఎమ్మెల్యే కాలె యాదయ్య అనుచరుడిగా తెలుస్తోంది.