ఎన్టీఏ సంచలన నిర్ణయం.. పెన్ పేపర్‌ మోడ్‌లోనే నీట్‌ యూజీ-2025 పరీక్ష

NEET UG 2025 | ఎంబీబీఎస్‌ సహా యూజీ-వైద్య విద్యాకోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్‌ (NEET)పై జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ) సంచలన ప్రకటన చేసింది.


సింగిల్‌ డే – సింగిల్‌ షిఫ్ట్‌లో పెన్‌- పేపర్‌ మోడ్‌ (ఓఎంఆర్‌ బేస్డ్‌)లో నీట్‌ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్ (ఎన్‌ఎంసీ) ఖరారు చేసిన మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది.

ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎస్‌ఎంఎస్‌ కోర్సులకు యూనిఫామ్‌ నీట్ (యూజీ) పరీక్ష నిర్వహిస్తామని ఎన్టీఏ తెలిపింది. నీట్‌ (యూజీ) ఫలితాల ఆధారంగా నేషనల్‌ కమిషన్ ఫర్‌ హోమియోపతి కింద బీహెచ్‌ఎంఎస్‌ కోర్సు అడ్మిషన్లు నిర్వహిస్తారు. దీంతోపాటు ఆర్మ్‌డ్‌ మెడికల్‌ సర్వీస్‌ హాస్పిటల్స్‌లో బీఎస్‌సీ నర్సింగ్‌ కోర్సు అడ్మిషన్లకు నీట్ (యూజీ) క్వాలిఫై కావాల్సి ఉంటుంది. నాలుగేండ్ల బీఎస్‌సీ నర్సింగ్‌ కోర్సుకు కూడా నీట్‌ (యూజీ) కోర్సులో అర్హత సాధించాల్సి ఉంటుందని ఎన్టీఏ తెలిపింది.