Padma Awards – పద్మ” పురస్కారాలను ప్రకటించిన కేంద్రం… ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు కోసం వివిధ రంగాల్లో విశేష సేవలు వారి వివరాలు..

చిరంజీవితో పాటు పలువురు తెలుగువాళ్లకు పద్మ అవార్డులు!


రిపబ్లిక్ డే వేళ కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా.. “పద్మ” పురస్కారాలను ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు కోసం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఎంపిక చేసింది. ఈ క్రమంలో… సినీ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్‌ కళారంగం నుంచి డి. ఉమామహేశ్వరి, గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప పద్మ అవార్డులతో సత్కరించింది.

ఈ క్రమంలో… మొత్తం 132 మందికి పురస్కాలు ప్రకటించగా.. వీటిలో ఐదుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. ఇదే సమయంలో దేశ అత్యున్నత పౌర పురస్కారమైన “భారతరత్న”ను బిహార్‌ జననాయక్‌, మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌ కు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

పద్మ విభూషణులు!:

బిందేశ్వర్‌ పాఠక్‌ (సామాజిక సేవ) – బిహార్‌

వైజయంతి మాల (కళారంగం) – తమిళనాడు

కొణిదెల చిరంజీవి (కళారంగం) – ఆంధ్రప్రదేశ్‌

పద్మ సుబ్రమణ్యం (కళారంగం) – తమిళనాడు

వెంకయ్యనాయుడు (ప్రజా వ్యవహారాలు) – ఆంధ్రప్రదేశ్‌

కళారంగం నుంచి పద్మశ్రీలు!:

డి. ఉమామహేశ్వరి – ఆంధ్రప్రదేశ్‌

దాసరి కొండప్ప – తెలంగాణ

గడ్డం సమ్మయ్య – తెలంగాణ

భద్రప్పన్‌ ఎం – తమిళనాడు

జానకీలాల్‌ – రాజస్థాన్‌

గోపీనాథ్‌ స్వైన్‌ – ఒడిశా

భాగబత్‌ పదాన్‌ – ఒడిశా

ఓంప్రకాశ్‌ శర్మ – మధ్యప్రదేశ్‌

బాబూ రామ్‌ యాదవ్‌ – ఉత్తర్‌ ప్రదేశ్‌

స్మృతి రేఖ ఛక్మా – త్రిపుర

బాలకృష్ణన్‌ సాధనం పుథియ వీతిల్‌ – కేరళ

నారాయణన్‌ ఈపీ – కేరళ

సనాతన్‌ రుద్ర పాల్‌ – పశ్చిమ బెంగాల్‌

నేపాల్‌ చంద్ర సూత్రధార్‌ – పశ్చిమ బెంగాల్‌

రతన్‌ కహార్‌ – పశ్చిమ బెంగాల్‌

జోర్డాన్‌ లేప్చా – సిక్కిం

మచిహన్‌ సాసా – మణిపుర్‌

శాంతిదేవీ పాసవాన్‌, శివన్‌ పాసవాన్‌ – బిహార్‌

అశోక్‌ కుమార్‌ బిశ్వాస్‌ – బిహార్‌

సామాజిక సేవా రంగం నుంచి పద్మశ్రీలు!:

సోమన్న – కర్ణాటక

పార్బతి బారువా – అస్సాం

దుఖు మాఝీ – పశ్చిమ బెంగాల్‌

ఛామి ముర్మూ – ఝార్ఖండ్‌

జగేశ్వర్‌ యాదవ్‌ – ఛత్తీస్‌ గఢ్‌

గుర్విందర్‌ సింగ్‌ – హరియాణా

సంగ్థాన్‌ కిమా – మిజోరం

వైద్యరంగం నుంచి పద్మశ్రీలు!:

ప్రేమ ధన్‌రాజ్‌ – కర్ణాటక

హేమచంద్‌ మాంఝీ – ఛత్తీస్‌ గఢ్‌

యజ్దీ మాణెక్‌ షా ఇటాలియా – గుజరాత్‌

క్రీడారంగం నుంచి పద్మశ్రీలు!:

ఉదయ్‌ విశ్వనాథ్‌ దేశ్‌ పాండే – మహారాష్ట్ర

ఇతర రంగాల నుంచి పద్మశ్రీలు!:

సర్బేశ్వర్‌ బాసుమతరి – అస్సాం

యనుంగ్‌ జామోహ్‌ లెగో – అరుణాచల్‌ ప్రదేశ్‌

సత్యనారాయణ బెలేరి – కేరళ

కె.చెల్లామ్మళ్‌ – అండమాన్‌ నికోబార్‌