Rohit Sharma: అది క్రికెట్ కు చాలా ప్రమాదకరం.. దానికి నేను పూర్తిగా వ్యతిరేకం: రోహిత్ శర్మ

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఐపీఎల్ సీజన్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 105 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ టీమ్ కు మాత్రం విజయాన్ని అందించకపోగా.. సెల్ఫిష్ అంటూ విమర్శలు మూటగట్టుకున్నాడు. కాగా.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన రోహిత్ ఐపీఎల్ లో ఉన్న ఓ రూల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ రూల్ ప్రమాదకరం అని, దానికి నేను బిగ్ ఫ్యాన్ ను కాదని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ రూల్ ఏంటంటే?

ఐపీఎల్ 2024 సీజన్ దాదాపు సగం పూర్తైంది. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. అయితే ఐపీఎల్ కొత్తగా తెచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ రూల్ డేంజర్ అని, దానికి నేను ఫ్యాన్ ను కాదని, వ్యతిరేకమని చెప్పుకొచ్చాడు టీమిండియా కెప్టెన్, ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. ఓ యూట్యూబ్ ఛానల్ తో రోహిత్ ఈ విధంగా మాట్లాడాడు.

“నేను ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కు అభిమానిని కాదు. ఇది ఆల్ రౌండర్లకు శాపం లాంటింది. వారిని వెనక్కి లాగుతుంది. దుబే, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆల్ రౌండర్లు బౌలింగ్ వేయకుండా ఈ రూల్ కట్టడి చేస్తుంది. ఇదంత మంచి రూల్ కాదని నా అభిప్రాయం. 12 మంది ప్లేయర్లు ఆటడం ఎంటర్ టైనింగ్ గానే ఉన్నా.. ప్రేక్షకులను అలరించడానికి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఇంపాక్ట్ రూల్ ఒక్కటే కాదు. ఇది ప్రమాదకరమైన రూల్.. అందుకే నేను దానికి వ్యతిరేకం” అని చెప్పుకొచ్చాడు హిట్ మ్యాన్.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *