దీపం-2′ పథకం: రూ.867 కోట్ల సబ్సిడీ విడుదల
రాష్ట్ర ప్రభుత్వం ‘దీపం-2’ పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులకు రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ అందించేందుకు రూ.867 కోట్ల సబ్సిడీ నిధులను విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో ఈ సిలిండర్లు పంపిణీ చేయనున్నారు.
నిధుల కేటాయింపు వివరాలు:
-
ఎస్సీ కార్పొరేషన్: రూ.16,330 లక్షలు
-
ఎస్టీ కార్పొరేషన్: రూ.3,870 లక్షలు
-
బీసీ సంక్షేమ శాఖ: రూ.46,522 లక్షలు
-
ఈడబ్ల్యూఎస్ విభాగం: రూ.14,582 లక్షలు
-
మైనారిటీ సంక్షేమ శాఖ: రూ.5,396 లక్షలు
రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ నిధులను సంబంధిత సంక్షేమ శాఖలకు (కార్పొరేషన్లు) కేటాయించింది. గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ బడ్జెట్ వినియోగంపై మార్గదర్శకాలను స్పష్టం చేసింది.
పౌరసరఫరాల శాఖలో కొత్త సీవీఓ నియామకం
పౌరసరఫరాల శాఖ చీఫ్ విజిలెన్స్ అధికారిగా (సీవీఓ) కె.రంగకుమారిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె దీర్ఘకాలంగా కమిషన్ కార్యాలయంలో అదనపు డైరెక్టర్గా పనిచేస్తున్నారు.